IND vs ENG, 5th Test: రద్దైన టెస్టును మళ్లీ నిర్వహించండి... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును కోరిన BCCI
బీసీసీఐ... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును రద్దైన టెస్టు మ్యాచ్ను తర్వాత అయినా జరిపించాలని కోరిందట.
ఎన్నో చర్చల అనంతరం భారత్ X ఇంగ్లాండ్ మధ్య ఈ రోజు (శుక్రవారం) ప్రారంభం అవ్వాల్సిన ఐదో టెస్టును రద్దు చేశారు. అయితే ఈ టెస్టును ఎలాగైనా జరిపించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును రద్దైన టెస్టు మ్యాచ్ను తర్వాత అయినా జరిపించాలని కోరిందట.
Following ongoing conversations with the BCCI, the ECB can confirm that the fifth LV= Insurance Test at Emirates Old Trafford, due to start today, will be cancelled.
— England Cricket (@englandcricket) September 10, 2021
ఐదో టెస్టును త్వరలోనే మళ్లీ నిర్వహించేందుకు ఈసీబీ(ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు)తో కలిసి పని చేస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. ఈ కష్ట సమయంలో తమ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించినందుకు ఈ సందర్భంగా ఈసీబీకి జైషా థాంక్స్ చెప్పారు. మరో వైపు ఫైనల్ మ్యాచ్ రద్దవ్వడంపై పలువురు మాజీలు, అభిమానులు నిరాశకు గురయ్యారు. సామాజిక మాధ్యమాల్లో అసహనం వ్యక్తం చేశారు.
Update: The BCCI and ECB held several rounds of discussion to find a way to play the match, however, the outbreak of Covid-19 in the Indian team contingent forced the decision of calling off the Old Trafford Test.
— BCCI (@BCCI) September 10, 2021
Details: https://t.co/5EiVOPPOBB
అంతకుముందు మ్యాచ్ రద్దుపై తొలుత ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అభిమానులను గందరగోళానికి గురి చేసింది. ఈ టెస్టులో టీమిండియా తమ తుది జట్టును బరిలోకి దింపలేకపోతున్నందున మ్యాచ్ను కోల్పోయిందని ప్రకటించింది. తర్వాత ఈ వ్యాఖ్యలను సరిచేసుకొని ఐదో టెస్టు రద్దయినట్లు తెలిపింది.
,
India have let English Cricket down !!! But England did let South African Cricket down !!!
— Michael Vaughan (@MichaelVaughan) September 10, 2021
భారత క్రికెట్ జట్టు ఫిజియోకి కరోనా పాజిటివ్ రావడంతో చివరి టెస్టును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆటగాళ్లకు నిర్వహించిన టెస్టుల్లో అందరికీ నెగిటివ్ ఫలితాలే వచ్చాయి.
Before You Go
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్పై బిసిసిఐ వేటు
ట్రెండింగ్ వార్తలు






















