By: ABP Desam | Updated at : 25 Jan 2022 01:51 PM (IST)
కరోనా బారిన పడిన గౌతమ్ గంభీర్
Gambhir Corona Positive: కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో మరోసారి పెరిగింది. ఇటీవల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలో గౌతమ్ గంభీర్ చేరారు. టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
తనకు లక్షణాలు కనిపంచడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తనకు తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నాయని గౌతమ్ గంభీర్ తెలిపారు. ఇటీవల తనని కలిసిన వారందరూ తప్పక కొవిడ్19 నిర్దారణ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ఇటీవల పర్యటనల్లో పాల్గొన్న బీజేపీ జాతీయ నేతలు కరోనా బారిన పడి కోలుకున్నారు.
After experiencing mild symptoms, I tested positive for COVID today. Requesting everyone who came into my contact to get themselves tested. #StaySafe
— Gautam Gambhir (@GautamGambhir) January 25, 2022
దేశంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ అధికంగా ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించిన గౌతమ్ గంభీర్ పార్టీ పనుల్లో బిజీగా ఉంటున్నారు. పార్టీ పనులు చూసుకుంటూనే క్రికెట్కు సంబంధించిన అంశాలపై స్పందిస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్పై సైతం గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. జట్టులో సరైన మార్పులు చేయకపోతే ప్రతికూల ఫలితాలు వస్తాయని చెప్పారు.
Koo App#COVID19 UPDATE: 💠162.92 cr vaccine doses have been administered so far under Nationwide Vaccination Drive 💠India’s Active caseload currently stands at 22,36,842 💠Recovery Rate currently at 93.15% Read here: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1792330 #IndiaFightsCorona - PIB India (@PIB_India) 25 Jan 2022
నిన్నటితో పోల్చితే దేశంలో 50 వేల పాజిటివ్ కేసులు తక్కువ నమోదయ్యాయి. వరుసగా ఐదోరోజులు 3 లక్షలు దాటిన కరోనా కేసులు నేడు భారీగా తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,55,874 (2 లక్షల 55 వేల 874) మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 614 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. నిన్నటితో పోల్చితే కరోనా మరణాలు 170 వరకు పెరిగాయి. నిన్న ఒక్కరోజులో 2 లక్షల 67 వేల 753 మంది కరోనాను జయించారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,36,842కు చేరుకుంది.
Also Read: ICC Awards: 2021లో ఉత్తమ టెస్టు క్రికెటర్ అవార్డు ఇతనే.. ఎన్ని పరుగులు చేశాడంటే?
IND v AUS: టీం ఇండియా ఆనవాయతీ కొనసాగించిన స్కై , విన్నింగ్ ట్రోఫీ ఎవరికి ఇచ్చాడంటే..
Virat Kohli: కింగ్ కోహ్లీ అంటే అట్లుంటది మరి, ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డు , ఆసిస్పై అన్ని పరుగులు చేయటం తొలిసారట
Sports Award selection committee: క్రీడా పురస్కారాల ఎంపికకు కమిటీ , 12 మంది దిగ్గజాలతో ఏర్పాటు
Syed Modi International 2023 badminton: టైటిల్ లేకుండానే ముగిసిన భారత్ పోరాటం , రన్నరప్ గా తనీష-అశ్విని జోడి
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
/body>