అన్వేషించండి

Team India: నిను వీడని నీడను నేనే - టీమిండియాను తీవ్రంగా వేధిస్తున్న సమస్య అదే!

19వ ఓవర్ సరిగ్గా బౌల్ చేయలేకపోవడం టీమిండియాకు పెద్ద సమస్యగా మారింది.

IND vs SL 2nd T20I: భారత జట్టుకు, ఐసీసీ ట్రోఫీలకు మధ్య ఉన్న అడ్డంకుల్లో 19వ ఓవర్ సమస్య అతి పెద్దది. లక్ష్యాన్ని కాపాడుకునేటప్పుడు అయినా, మొదట బౌలింగ్ చేస్తున్నప్పుడు అయినా 19వ ఓవర్‌లో పరుగులు కాపాడుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో భారత్ ఇప్పటికీ గుణపాఠం నేర్చుకోలేదని అనిపిస్తుంది.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో భారత జట్టు వెనుకబడింది. భారత్ - శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఒక నోబాల్‌తో మొత్తం 18 పరుగులు సమర్పించుకున్నాడు. 19వ ఓవర్లో పరుగులు ఇచ్చుకోవడం భారత జట్టుకు చాలా కాలంగా సమస్యగా మారింది. 2022లో ఆడిన టీ20 ప్రపంచకప్‌లో కూడా టీమిండియా ముందు ఈ సమస్య తలెత్తింది. ఇప్పుడు మళ్లీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ సమస్య మనకు తలెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు దీనిపై ఆలోచించాలి.

గత మ్యాచ్‌లో కూడా
అంతకుముందు వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఇబ్బంది పెట్టింది. ఆ మ్యాచ్‌లో భారత్ బౌలింగ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. ఆ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ 19వ ఓవర్ వేశాడు. ఈ మ్యాచ్‌లో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ 19వ ఓవర్ బౌల్ చేశాడు. అది కూడా కాస్ట్లీగా మారింది.

టచ్‌లో కనిపించిన షనక
భారత జట్టుపై శ్రీలంక కెప్టెన్ దసున్ షనక మరోసారి అద్భుతమైన లయలో కనిపించాడు. ఈ మ్యాచ్‌లో అతను 22 బంతుల్లో 56 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 254.55గా ఉంది.

అంతకుముందు మ్యాచ్‌లో కూడా అతను 27 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 45 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షనక ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్‌లో భారత జట్టుపై 5 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతను తన ప్రతి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల మార్కును దాటాడు, రెండు అర్ధ సెంచరీలు చేశాడు. అతను ఇప్పటివరకు భారత్‌పై 205.64 స్ట్రైక్ రేట్‌తో 255 పరుగులు చేశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL orange cap winners: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
IPLలో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
హార్దిక్ పాండ్యా గ్యారేజీలోకి 'ఫెరారీ 12 సిలిండ్రి': రూ. 8.5 కోట్ల లగ్జరీ కారుకు దేశీ స్టైల్‌లో గ్రాండ్ వెల్కమ్!
హార్దిక్ పాండ్యా గ్యారేజీలోకి 'ఫెరారీ 12 సిలిండ్రి': రూ. 8.5 కోట్ల లగ్జరీ కారుకు దేశీ స్టైల్‌లో గ్రాండ్ వెల్కమ్!
IPL 2026 తరువాత బిజీబిజీగా టీమిండియా.. కొత్త సిరీస్‌ల షెడ్యూల్ విడుదల.. రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
IPL 2026 తరువాత బిజీబిజీగా టీమిండియా.. కొత్త సిరీస్‌ల షెడ్యూల్ విడుదల
Laxman Sivaramakrishnan: క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!
క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget