అన్వేషించండి

మ్యాచ్‌లు

T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్ - ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్న మహ్మద్ షమీ

జస్ప్రిత్ బుమ్రా గాయంతో టీ20 మెగా టోర్నీకి దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ బలహీనపడింది. పేసర్ మహ్మద్ షమీ పొట్టి ప్రపంచ కప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Mohammed Shami clears fitness test at NCA: టీ20 ప్రపంచ కప్ 2022కు ముందే టీమిండియాకు శుభవార్త. పేసర్ మహ్మద్ షమీ పొట్టి ప్రపంచ కప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. జస్ప్రిత్ బుమ్రా గాయంతో టీ20 మెగా టోర్నీకి దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ బలహీనపడింది. ఈ సమయంలో కాస్త ఊరటనిచ్చే అంశం షమీ అందుబాటులోకి రావడం. నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో పాసైన సీనియర్ పేసర్ షమీ ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నాడు. 

ఆస్ట్రేలియాలో టీమిండియా.. 
14 మందితో కూడిన భారత జట్టు ఇదివరకే ఆస్ట్రేలియాకు వెళ్లింది. టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మార్గదర్శకత్వంలో పొట్టి ప్రపంచ కప్ సాధించేందుకు ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. ఇదివరకే పశ్చిమ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరం కాగా, గాయం కారణంతో స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా సైతం టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. సర్జరీ అవసరం లేనప్పటికీ గాయం నుంచి కోలుకోవడానికి బుమ్రాకు కనీసం నాలుగు నుంచి ఆరు నెలల సమయం పట్టనుందని సమాచారం.

బుమ్రా స్థానాన్ని భర్తీ చేయనున్న షమీ ! 
బుమ్రాకు గాయం కావడంతో ఆ స్థానాన్ని సిరాజ్, దీపక్ చహర్, మహ్మద్ షమీలలో ఒకరితో భర్తీ చేసేందుకు బీసీసీఐ యోచించింది. ఈ క్రమంలో షమీ ఫిట్ నెస్ టెస్ట్ క్లియర్ చేయడం, సీనియర్ బౌలర్ కావడంతో అతడి వైపు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 తరువాత నుంచి షమీ ఇప్పటివరకూ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం కలవరపెడుతోంది. అయితే ఆస్ట్రేలియా లాంటి పిచ్ ల మీద బౌలింగ్ దాడిని నడిపించాలంటే షమీ లాంటి బౌలర్ జట్టుకు ఎంతో అవసరమని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. త్వరలోనే ఆస్ట్రేలియా వెళ్లనున్న షమీ.. భారత్ ఆడనున్న వార్మప్ మ్యాచ్‌లలో బౌలింగ్ చేస్తే అతడికి మరింత ప్రాక్టీస్ కానుంది.

టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ జట్టు
ప్రస్తుతం టి20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు నంబర్ వన్‌గా ఉంది. ఈసారి పొట్టి ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా బలమైన పోటీదారుగా చెప్పొచ్చు. ఈ ఏడాది మొత్తం 32 టి 20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఈ 32 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా 23 విజయాలు సాధించింది. 8 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ రద్దైంది.  గెలుపు శాతం పరంగా చూస్తే ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత జట్టు 74 శాతం మ్యాచ్‌లలో విజయం సాధించింది.

గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఐసిసి ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు ఐదో స్థానంలో  ఉంది. అయినా కేన్ విలియమ్సన్‌ నేతృత్వంలోని జట్టులో చాలా మంది టీ20 స్పెషలిస్టులు ఉన్నారు. ఒక్క క్షణంలో మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా వాళ్లకు ఉంది. ఈ ఏడాది న్యూజిలాండ్ మొత్తం 10 టీ20 మ్యాచ్లు ఆడగా, అందులో తొమ్మిదింట విజయం సాధించి గెలుపు శాతం 90తో ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nandamuri Balakrishna at Legend 10Years | లెజెండ్ రీరిలీజ్ లోనూ 100రోజులు ఆడుతుందన్న బాలకృష్ణ | ABPBIG Shocks to BRS | బీఆర్ఎస్ నుంచి వలసలు ఆపడం కష్టమేనా..!? | ABP DesamDanam Nagender Face to Face | కొత్త నాయకత్వంకాదు..ముందు కేటీఆర్ మారాలంటున్న దానం | ABP DesamMadhavi Latha Sensational Interview | లక్ష ఓట్ల తేడాతో ఒవైసీని ఓడిస్తానంటున్న మాధవీలత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Embed widget