అన్వేషించండి

Shreyas Iyer: నా దృష్టంతా దానిపైనే,తొలిసారి స్పందించిన అయ్యర్‌

Shreyas Iyer: టీ 20 ప్రపంచకప్‌నకు ముందు ఉన్నకీలక సిరీస్‌లో చోటు దక్కకపోవడంపై తొలిసారి శ్రేయస్‌ అయ్యర్‌ స్పందించాడు. త‌న ఆధీనంలో లేని విష‌యాల గురించి ప‌ట్టించుకోన‌ని తేల్చి చెప్పాడు.

అఫ్గానిస్థాన్‌(Afghanistan)తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా(Team India) కైవసం చేసుకుంది. అయితే  టీ 20 ప్రపంచకప్‌ (T20 World Cup)నకు ముందు ఉన్న ఈ కీలక సిరీస్‌లో శ్రేయ‌స్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై తొలిసారి శ్రేయస్‌ అయ్యర్‌ స్పందించాడు. త‌న ఆధీనంలో లేని విష‌యాల గురించి ప‌ట్టించుకోన‌ని.. త‌న‌కు ఇచ్చిన బాధ్యత‌ను స‌క్రమంగా నిర్వర్తించ‌డంపై మాత్రమే శ్రద్ధ పెడ‌తాన‌ని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం త‌ను అదే ప‌నిలో ఉన్నాన‌ని పేర్కొన్నాడు. గ‌తం గురించి ఆలోచించ‌ను. వ‌ర్తమానంలో జీవించాల‌ని అనుకుంటున్నానని అయ్యర్‌ అన్నాడు. 

రంజీలు ఆడమన్నారు..  ఆడేశా...
తనకు ఏ ప‌నినైతే అప్పగించారో అది విజ‌య‌వంతంగా పూర్తి చేశానని.. తనను రంజీ మ్యాచ్‌ ఆడమన్నారని... ఆడాను తన ప్రణాళికలు అమలు చేశానని అయ్యర్‌ తెలిపాడు. రంజీ ట్రోఫీలో తన ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నానని... కొన్ని విష‌యాలు మ‌న ఆధీనంలో ఉండ‌వని... అలాంటి వాటి గురించి ఆలోచించ‌క‌పోవ‌డ‌మే మంచిదని అయ్యర్‌ అన్నాడు. రంజీ మ్యాచ్ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ ల‌భించిందని తెలిపాడు. ఇంగ్లండ్‌తో మొద‌టి రెండు టెస్టుల్లో ఎలా ఆడాల‌న్నదాని గురించే ప్రస్తుతం ఆలోచిస్తున్నానని... తన ధ్యాసంతా ఆ రెండు మ్యాచ్‌లపైనే ఉందని  పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ జ‌న‌వ‌రి 25 నుంచి ఆరంభం కానుంది. తొలి రెండు మ్యాచ్‌ల‌కు ప్రక‌టించిన జ‌ట్టులో శ్రేయ‌స్ అయ్యర్‌కు చోటు ద‌క్కింది.

రంజీ మ్యాచ్‌లో ఇలా...
దేశ‌వాళీ క్రికెట్‌లో ఆడాలని శ్రేయ‌స్ అయ్యర్‌ను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సూచించింది. దానికి తగ్గట్లుగా అయ్యర్‌ ముంబై తరపున బరిలోకి దిగాడు. ఆంధ్రాతో జ‌రిగిన మ్యాచ్‌లో 48 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్న అయ్యర్‌.. 145కు పైగా ఓవ‌ర్లపాటు ఫీల్డింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జ‌ట్టుపై ముంబై 10 వికెట్ల తేడాతో జ‌య‌భేరి మోగించింది.

సిరీస్‌ భారత్‌ కైవసం
అఫ్గానిస్థాన్‌(Afghanistan )తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను టీమిండియా(Team India) మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal), శివమ్ దూబే (Shivam Dube) మెరుపు ఇన్నింగ్స్‌తో రోహిత్‌ సేన మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్‌ అయింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మరో 26 బంతులు మిగిలి ఉండగానే సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్‌, శివమ్ దూబే అర్థ శతకాలతో భారత్‌కు విజయాన్ని అందించారు. 173 పరుగుల లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్‌ అఫ్గాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో యశస్వి 68 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పేశాడు. 14 నెలల తర్వాత టీ 20ల్లో బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లీ ఉన్నంతసేపు మంచి టచ్‌లో కనిపించాడు. కేవలం 16 బంతుల్లో అయిదు చూడముచ్చని ఫోర్లతో కింగ్‌ కోహ్లీ 29 పరుగులు చేశాడు. శివమ్‌ దూబే కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో దూబే 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దూబే విధ్వంసంతో మ్యాచ్‌ భారత్‌ వశమైంది. 173 పరుగుల లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారత్‌ ఛేదించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nimmala RamaNaidu: భవన నిర్మాణ కూలీ అవతారమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు.. ఎందుకిలా..
భవన నిర్మాణ కూలీ అవతారమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు.. ఎందుకిలా..
Jubilee Hills Politics: కాంగ్రెస్ ఓటుకు 10వేలు ఇస్తోంది! బీఆర్ఎస్ సానుభూతి వర్కవుట్ కాదు: లంకల దీపక్ రెడ్డి
కాంగ్రెస్ ఓటుకు 10వేలు ఇస్తోంది! బీఆర్ఎస్ సానుభూతి వర్కవుట్ కాదు: లంకల దీపక్ రెడ్డి
Pawan Kalyan Visits Kumki Elephants: పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్ చేసిన కుంకీ ఏనుగులు, కుంకీలకు ఆహారం అందించిన డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్ చేసిన కుంకీ ఏనుగులు, కుంకీలకు ఆహారం అందించిన డిప్యూటీ సీఎం
Jana Nayagan : దళపతి విజయ్ లాస్ట్ మూవీ 'జన నాయగన్' - బాలయ్య 'భగవంత్ కేసరి'కి రీమేకా!... ఫస్ట్ సాంగ్‌తో...
దళపతి విజయ్ లాస్ట్ మూవీ 'జన నాయగన్' - బాలయ్య 'భగవంత్ కేసరి'కి రీమేకా!... ఫస్ట్ సాంగ్‌తో...
Advertisement

వీడియోలు

మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా?  డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
రియల్ లైఫ్ OG.. షూటింగ్ రేంజ్‌లో గన్ ఫైర్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Narmada Human: భారతదేశ చరిత్రని మార్చిన ఆ పుర్రె ఎవరిది?
Dhruv Jurel Century for India A | సెంచరీలతో చెలరేగిన ధ్రువ్ జురెల్
Abhishek Sharma World Record in T20 | అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డు !
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala RamaNaidu: భవన నిర్మాణ కూలీ అవతారమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు.. ఎందుకిలా..
భవన నిర్మాణ కూలీ అవతారమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు.. ఎందుకిలా..
Jubilee Hills Politics: కాంగ్రెస్ ఓటుకు 10వేలు ఇస్తోంది! బీఆర్ఎస్ సానుభూతి వర్కవుట్ కాదు: లంకల దీపక్ రెడ్డి
కాంగ్రెస్ ఓటుకు 10వేలు ఇస్తోంది! బీఆర్ఎస్ సానుభూతి వర్కవుట్ కాదు: లంకల దీపక్ రెడ్డి
Pawan Kalyan Visits Kumki Elephants: పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్ చేసిన కుంకీ ఏనుగులు, కుంకీలకు ఆహారం అందించిన డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్ చేసిన కుంకీ ఏనుగులు, కుంకీలకు ఆహారం అందించిన డిప్యూటీ సీఎం
Jana Nayagan : దళపతి విజయ్ లాస్ట్ మూవీ 'జన నాయగన్' - బాలయ్య 'భగవంత్ కేసరి'కి రీమేకా!... ఫస్ట్ సాంగ్‌తో...
దళపతి విజయ్ లాస్ట్ మూవీ 'జన నాయగన్' - బాలయ్య 'భగవంత్ కేసరి'కి రీమేకా!... ఫస్ట్ సాంగ్‌తో...
Sleep Quality Tips : రాత్రుళ్లు పదే పదే నిద్ర లేస్తున్నారా? వెంటనే పడుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
రాత్రుళ్లు పదే పదే నిద్ర లేస్తున్నారా? వెంటనే పడుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Nara Lokesh: ఒక్కఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది, బిహార్‌లో ఆ పరిస్థితి రావద్దు: నారా లోకేష్
ఒక్కఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది, బిహార్‌లో ఆ పరిస్థితి రావద్దు: నారా లోకేష్
Congress candidate Naveen Yadav: రౌడీ అనే ముద్రవేస్తారా..? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 40వేల మెజారిటీతో గెలుస్తా: నవీన్ యాదవ్
రౌడీ అనే ముద్రవేస్తారా..? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 40వేల మెజారిటీతో గెలుస్తా: నవీన్ యాదవ్
AR Rahman Concert : రెహమాన్ కాన్సెర్ట్‌లో 'పెద్ది' టీం సందడి - 'చికిరి చికిరి' జోష్ వేరే లెవల్
రెహమాన్ కాన్సెర్ట్‌లో 'పెద్ది' టీం సందడి - 'చికిరి చికిరి' జోష్ వేరే లెవల్
Embed widget