అన్వేషించండి

Shoaib Akhtar Comments: పాకిస్థాన్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయం బీసీసీఐది కాదు బీజేపీ గవర్నమెంట్‌ది- అక్తర్ హాట్‌ కామెంట్స్ 

Shoaib Akhtar Comments On Champions Trophy:పాకిస్తాన్‌లో ఛాంపియన్ ట్రోఫీలో ఆడేందుకు భారత్ వస్తుందని అశాభావం వ్యక్తం చేశారు మాజీ ఫాస్ట్ బౌలర్‌ షోయబ్ అక్తర్. బీజేపీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు.

Shoaib Akhtar made a big statement on India: టీమ్ ఇండియా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లాలా వద్దా అనేది నిర్ణయించేది బీసీసీఐ కాదని బీజేపీ ప్రభుత్వమని విమర్శలు చేశారు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. 

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీకి వెళ్లి ఆడేందుకు టీమిండియా అంగీకరించడం లేదు. దీన్ని తటస్త వేదికపై నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నీలినీడలు అలుముకున్నాయి. 2023లో జరిగిన ఆసియా కప్‌లా దీన్ని కూడా హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని కూడా చూస్తున్నారు. 

ఛాంపియన్స్ ట్రోఫీ వివాదంపై ఇంకా చర్చలు సాగుతున్న టైంలో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. మాజీ క్రికెటర్లు కూడా నోరు పారేసుకుంటున్నారు. అదే బాటలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమ్ ఇండియా పాకిస్థాన్ పర్యటన బీజేపీ ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటుందని, బీసీసీఐపై కాదని విమర్శలు గుప్పించారు. 

ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయబ్‌ అక్తర్ మాట్లాడుతూ.. ‘‘అది ప్రభుత్వానికి సంబంధించింది. బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేదు. ఆ నిర్ణయం బీజేపీ ప్రభుత్వానిదే. వారే నిర్ణయిస్తారు. తెరవెనుక చర్చలు జరుగుతున్నప్పుడు, మనం ఆశ కోల్పోకూడదు, 95-98 శాతం స్పాన్సర్‌షిప్‌ వస్తుంది. అని అన్నారు. 
"భారత్‌ను పాకిస్తాన్‌కు రప్పించలేకపోతే రెండు విషయాలు జరుగుతాయి. మనం ఆతిథ్య దేశానికి వచ్చే 100 మిలియన్ల డాలర్ల స్పాన్సర్‌షిప్‌ను కోల్పోతాము. రెండోది ఆ డబ్బులు హోస్ట్ చేసే దేశానికి వెళ్తాయి. భారతదేశం ఇక్కడకు వచ్చి ఆడితే మంచిదే, కానీ ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినది. దీనికి బీసీసీఐతో సంబంధం లేదు." అని అన్నారు. 

ఓ పెద్ద టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వలేని విధంగా పాకిస్థాన్ ఇమేజ్ ఉందని అక్తర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వలేమనే ట్యాగ్ పాకిస్థాన్‌కు ఉంది. కానీ ఆశగా ఎదురుచూద్దాం.. చివరి క్షణం వరకు వేచిచూద్దాం.. ప్రస్తుతం నన్ను అడిగితే భారత్ వస్తోందని చెబుతా’’ అని అక్తర్ అన్నారు. ఇంకా ఏదీ అధికారిక ప్రకటన రాలేదు. మరి టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. షెడ్యూల్ విడుదలైన తర్వాతే ఓ నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. 

Also Read: రిషభ్ పంత్ కోసం విపరీతమైన పోటీ, కొత్త రికార్డులు సెట్ చేస్తాడా ? ధర గెస్ చేశారా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visakhapatanam Crime News: నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Konaseema Crime News: కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
Amalapuram Crime News:వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
Advertisement

వీడియోలు

Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatanam Crime News: నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Konaseema Crime News: కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
Amalapuram Crime News:వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
విస్కీ vs స్కాచ్: రెండింటి మధ్య తేడా తెలుసా? | స్కాచ్ విస్కీ ప్రత్యేకత, తయారీ విధానం, నియమాలు
స్కాచ్ విస్కీకి, మామూలు విస్కీకి మధ్య తేడాలు తెలుసా? స్కాచ్ ఎందుకు అంత ప్రత్యేకమైనది?
Itlu Me Yedhava Trailer : ఎదవను లవ్ చేసిన అమ్మాయి - టైటిల్ మాత్రమే కాదు... 'ఇట్లు మీ ఎదవ' ట్రైలర్ కూడా డిఫరెంటే...
ఎదవను లవ్ చేసిన అమ్మాయి - టైటిల్ మాత్రమే కాదు... 'ఇట్లు మీ ఎదవ' ట్రైలర్ కూడా డిఫరెంటే...
Ajith Kumar : 'విజయ్'ది మాత్రమే తప్పు కాదు - కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళ స్టార్ అజిత్ రియాక్షన్
'విజయ్'ది మాత్రమే తప్పు కాదు - కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళ స్టార్ అజిత్ రియాక్షన్
Amazing Train Journey Routs in India: జీవితంలో ఒక్కసారైనా ట్రావెల్ చేయాల్సిన ఇండియన్ రైలు మార్గాలు ఇవే! ఎడారి, జలపాతాలు, సముద్రం, మంచు కొండలు ప్రతీ ప్రయాణం ఒక అద్భుతమే!
జీవితంలో ఒక్కసారైనా ట్రావెల్ చేయాల్సిన ఇండియన్ రైలు మార్గాలు ఇవే! ఎడారి, జలపాతాలు, సముద్రం, మంచు కొండలు ప్రతీ ప్రయాణం ఒక అద్భుతమే!
Embed widget