అన్వేషించండి

Duleep Trophy: అనంతపురానికి రోహిత్‌, కోహ్లీ, దేశవాళీ క్రికెట్​కు కొత్త జోష్ !

Indian Team: దేశవాళీ క్రికెట్‌లో భారత అగ్రశ్రేణి క్రికెటర్ల ఆట జోష్ పెంచబోతోంది. అంతే కాదు ఈ టోర్నీకి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వేదికగా నిర్ణయించటంతో తెలుగు ఫాన్స్ మరింత జోష్ మీదున్నారు.

Indian Players In Duleep Trophy 2024: సాధారణంగా  సిరీస్‌ల మధ్య ఎక్కువ  గ్యాప్ వస్తూ ఉంటే ఫిట్‌నెస్, ఫామ్‌ కోసం క్రికెటర్లు దేశవాళీలో ఆడుతుంటారు. ఎవరో కొంతమంది స్టార్ క్రికెటర్లకు మాత్రమే  అందులో పాల్గొనకుండా   వెసులుబాటు  దక్కుతుంది. అయితే ఇంతకు ముందు బిసిసిఐ(BCCI) చీఫ్ జై షా(Jai Shah) అన్న మాటల ప్రభావమో , ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌(Gautam Gambhir) వచ్చిన ఫలితమో గానీ  టీమ్ఇండియా  కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) బరిలో దిగనున్నారు. 

భారత జట్టు ఇటీవల శ్రీలంక(Sri lanka)తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడింది. దీని తర్వాత బంగ్లాదేశ్‌(Bangladesh)తో టెస్టు, టీ20 సిరీస్‌లు ఆడనుంది. అయితే శ్రీలంక సిరీస్ తర్వాత బంగ్లాదేశ్ సిరీస్‌ మధ్యలో  దాదాపు 40 రోజుల గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ గ్యాప్‌లో, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీతో సహా చాలా మంది భారతీయ స్టార్లు దేశీయ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ 2024 ఆడటం చూడవచ్చు. నివేదికల ప్రకారం, బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతాయి. 

దీనిబట్టి  రోహిత్ శర్మ దాదాపు 9ఏళ్ల తర్వాత డొమెస్టిక్ టోర్నీలో ఆడనున్నాడు.  అయితే రోహిత్, కోహ్లీలు సాధారణ  జట్ల సభ్యులుగా ఉంటారా, లేదా  కెప్టెన్లుగా బరిలో దిగుతారా అన్నదానిపై  క్లారిటీ లేదు. రవీంద్ర జడేజా,  శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌ను దులీప్ ట్రోఫీలో ఆడనుండగా,  స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం ఈ టోర్నీ నుంచి మినహాయింపు ఉన్నట్లు సమాచారం.

ఈ టోర్నీని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వేదికగా నిర్ణయించారు. అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి చెందిన స్టేడియం.. ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది.  సెప్టెంబర్ 5వ తేదీన దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ జరుగనుంది.  ఈ ట్రోఫీ  22వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే దాదాపుగా మూడు వారాల పాటు జాతీయ జట్టు క్రికెటర్లు అనంతపురంలో మకాం ఉండబోతోన్నారు. మొదటి రౌండ్ లో లేకపోయినా సెప్టెంబర్ 12 నుంచి జరగనున్న టోర్నీ రెండో రౌండ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆడటం చూడవచ్చు.  అయితే ఇప్పుడు ఈ లొకేషన్  మార్చనున్నట్టు  కూడా సమాచారం.  క్రిక్‌బజ్‌లో వచ్చిన కథనం ప్రకారం, వేదికలో మార్పు ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడికి అంతర్జాతీయ విమానాలకు అవకాశం లేకపోవటం కారణం కావచ్చు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం వరకు అయితే  టోర్నీలో ఒక రౌండ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించనున్నారు.

 అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ దులీప్‌ ట్రోఫీ కోసం నాలుగు జట్లను ఎంపిక చేస్తుందని తెలుస్తోంది. ఇండియా ఎ,  బి,   సి,  డి జట్లలో టీమిండియా స్టార్స్ ఆడనున్నారు. దులీప్‌ ట్రోఫీలో ఆడటం వల్ల బంగ్లాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది.  

Also Read: Paris Olympics 2024: భారత్‌కు ఆ ఏడు పతకాలు వచ్చుంటే, వెంట్రుకవాసిలో చేజారిన పతకాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం, విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిన ఉద్యోగి
Tirumala News: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం, విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిన ఉద్యోగి
Daaku Maharaaj Twitter Review - 'డాకు మహారాజ్' ఆడియన్స్ రివ్యూ: బాలయ్య మాస్‌కు మ్యూజిక్‌తో తమన్ దబిడి దిబిడి - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
'డాకు మహారాజ్' ఆడియన్స్ రివ్యూ: బాలయ్య మాస్‌కు మ్యూజిక్‌తో తమన్ దబిడి దిబిడి - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
Vande Bharat: రైల్వేశాఖ గుడ్ న్యూస్, సికింద్రాబాద్‌ - విశాఖపట్నం వందేభారత్‌ కోచ్‌లు రెట్టింపు, భారీగా పెరిగిన సీట్లు
రైల్వేశాఖ గుడ్ న్యూస్, సికింద్రాబాద్‌ - విశాఖపట్నం వందేభారత్‌ కోచ్‌లు రెట్టింపు, భారీగా పెరిగిన సీట్లు
Viral Videos: డాకు మహారాజ్ కోసం పొట్టేలు బలి,  మాన్షన్ హౌస్ మందుతో బాలయ్య కటౌట్‌కు అభిషేకం
డాకు మహారాజ్ కోసం పొట్టేలు బలి, మాన్షన్ హౌస్ మందుతో బాలయ్య కటౌట్‌కు అభిషేకం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sobhan Babu House Vlog | చిన నందిగామ లో నటభూషణ్  కట్టిన లంకంత ఇల్లు | ABP DesamKondapochamma Sagar Tragedy | కొండపోచమ్మసాగర్ లో పెను విషాదం | ABP DesamNagoba Jathara Padayathra | ప్రారంభమైన మెస్రం వంశీయుల గంగాజల పాదయాత్ర | ABP DesamPawan Kalyan vs BR Naidu | టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు కోరేలా చేసిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం, విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిన ఉద్యోగి
Tirumala News: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం, విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిన ఉద్యోగి
Daaku Maharaaj Twitter Review - 'డాకు మహారాజ్' ఆడియన్స్ రివ్యూ: బాలయ్య మాస్‌కు మ్యూజిక్‌తో తమన్ దబిడి దిబిడి - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
'డాకు మహారాజ్' ఆడియన్స్ రివ్యూ: బాలయ్య మాస్‌కు మ్యూజిక్‌తో తమన్ దబిడి దిబిడి - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
Vande Bharat: రైల్వేశాఖ గుడ్ న్యూస్, సికింద్రాబాద్‌ - విశాఖపట్నం వందేభారత్‌ కోచ్‌లు రెట్టింపు, భారీగా పెరిగిన సీట్లు
రైల్వేశాఖ గుడ్ న్యూస్, సికింద్రాబాద్‌ - విశాఖపట్నం వందేభారత్‌ కోచ్‌లు రెట్టింపు, భారీగా పెరిగిన సీట్లు
Viral Videos: డాకు మహారాజ్ కోసం పొట్టేలు బలి,  మాన్షన్ హౌస్ మందుతో బాలయ్య కటౌట్‌కు అభిషేకం
డాకు మహారాజ్ కోసం పొట్టేలు బలి, మాన్షన్ హౌస్ మందుతో బాలయ్య కటౌట్‌కు అభిషేకం
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Daaku Maharaaj OTT: 'డాకు మహారాజ్' ఓటీటీ డీల్ సెట్... బాలకృష్ణ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
'డాకు మహారాజ్' ఓటీటీ డీల్ సెట్... బాలకృష్ణ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Sankranti 2025: సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
Ind Vs Eng Series: వన్డే జట్టు నుంచి జడేజా ఔట్- అతని ప్లేస్ కోసం పోటీపడుతున్న ఇద్దరు ప్లేయర్లు
వన్డే జట్టు నుంచి జడేజా ఔట్- అతని ప్లేస్ కోసం పోటీపడుతున్న ఇద్దరు ప్లేయర్లు
Embed widget