అన్వేషించండి

Duleep Trophy: అనంతపురానికి రోహిత్‌, కోహ్లీ, దేశవాళీ క్రికెట్​కు కొత్త జోష్ !

Indian Team: దేశవాళీ క్రికెట్‌లో భారత అగ్రశ్రేణి క్రికెటర్ల ఆట జోష్ పెంచబోతోంది. అంతే కాదు ఈ టోర్నీకి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వేదికగా నిర్ణయించటంతో తెలుగు ఫాన్స్ మరింత జోష్ మీదున్నారు.

Indian Players In Duleep Trophy 2024: సాధారణంగా  సిరీస్‌ల మధ్య ఎక్కువ  గ్యాప్ వస్తూ ఉంటే ఫిట్‌నెస్, ఫామ్‌ కోసం క్రికెటర్లు దేశవాళీలో ఆడుతుంటారు. ఎవరో కొంతమంది స్టార్ క్రికెటర్లకు మాత్రమే  అందులో పాల్గొనకుండా   వెసులుబాటు  దక్కుతుంది. అయితే ఇంతకు ముందు బిసిసిఐ(BCCI) చీఫ్ జై షా(Jai Shah) అన్న మాటల ప్రభావమో , ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌(Gautam Gambhir) వచ్చిన ఫలితమో గానీ  టీమ్ఇండియా  కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) బరిలో దిగనున్నారు. 

భారత జట్టు ఇటీవల శ్రీలంక(Sri lanka)తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడింది. దీని తర్వాత బంగ్లాదేశ్‌(Bangladesh)తో టెస్టు, టీ20 సిరీస్‌లు ఆడనుంది. అయితే శ్రీలంక సిరీస్ తర్వాత బంగ్లాదేశ్ సిరీస్‌ మధ్యలో  దాదాపు 40 రోజుల గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ గ్యాప్‌లో, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీతో సహా చాలా మంది భారతీయ స్టార్లు దేశీయ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ 2024 ఆడటం చూడవచ్చు. నివేదికల ప్రకారం, బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతాయి. 

దీనిబట్టి  రోహిత్ శర్మ దాదాపు 9ఏళ్ల తర్వాత డొమెస్టిక్ టోర్నీలో ఆడనున్నాడు.  అయితే రోహిత్, కోహ్లీలు సాధారణ  జట్ల సభ్యులుగా ఉంటారా, లేదా  కెప్టెన్లుగా బరిలో దిగుతారా అన్నదానిపై  క్లారిటీ లేదు. రవీంద్ర జడేజా,  శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌ను దులీప్ ట్రోఫీలో ఆడనుండగా,  స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం ఈ టోర్నీ నుంచి మినహాయింపు ఉన్నట్లు సమాచారం.

ఈ టోర్నీని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వేదికగా నిర్ణయించారు. అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి చెందిన స్టేడియం.. ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది.  సెప్టెంబర్ 5వ తేదీన దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ జరుగనుంది.  ఈ ట్రోఫీ  22వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే దాదాపుగా మూడు వారాల పాటు జాతీయ జట్టు క్రికెటర్లు అనంతపురంలో మకాం ఉండబోతోన్నారు. మొదటి రౌండ్ లో లేకపోయినా సెప్టెంబర్ 12 నుంచి జరగనున్న టోర్నీ రెండో రౌండ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆడటం చూడవచ్చు.  అయితే ఇప్పుడు ఈ లొకేషన్  మార్చనున్నట్టు  కూడా సమాచారం.  క్రిక్‌బజ్‌లో వచ్చిన కథనం ప్రకారం, వేదికలో మార్పు ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడికి అంతర్జాతీయ విమానాలకు అవకాశం లేకపోవటం కారణం కావచ్చు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం వరకు అయితే  టోర్నీలో ఒక రౌండ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించనున్నారు.

 అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ దులీప్‌ ట్రోఫీ కోసం నాలుగు జట్లను ఎంపిక చేస్తుందని తెలుస్తోంది. ఇండియా ఎ,  బి,   సి,  డి జట్లలో టీమిండియా స్టార్స్ ఆడనున్నారు. దులీప్‌ ట్రోఫీలో ఆడటం వల్ల బంగ్లాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది.  

Also Read: Paris Olympics 2024: భారత్‌కు ఆ ఏడు పతకాలు వచ్చుంటే, వెంట్రుకవాసిలో చేజారిన పతకాలు

టాప్ హెడ్ లైన్స్

Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Kishan Viral Video: ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో
ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Embed widget