అన్వేషించండి

Syed Mushtaq Ali Trophy final: ముంబై X మధ్యప్రదేశ్- సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్ ఖరారు.. బ్యాటింగ్ పవర్ తో సెమీస్ లో విజయం

బ్యాటింగ్ లో గర్జించడంతో ముంబై, మధ్య ప్రదేశ్ జట్లు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్ కు చేరుకున్నాయి. ఇరు జట్ల మధ్య ఫైనల్ ఆదివారం జరుగుతుంది. 

Syed Mushtaq Ali Trophy final | దేశవాళీ ప్రతిష్టాత్మ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ ఫైనల్ కు ముంబై, మధ్యప్రదేశ్ చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బరోడాను ఆరు వికెట్లతో ముంబై, ఢిల్లీని ఏడువికెట్లతో మధ్యప్రదేశ్ ఓడించాయి. ఇరుజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. 

రహానే వీరవిహారం..
ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న భారత క్రికెటర్ అజింక్య రహానే (56 బంతుల్లో 98, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఫిఫ్టీతో ముంబైకి దాదాపుగా ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 46, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్సింగ్స్ తో చక్కని సహకారం అందించాడు. రెండోవికెట్ కు వీరిద్దరూ 88 పరుగులు జోడించడంతో సునాయాసంగా ముంబై ఈ మ్యాచ్ లో విజయం సాధించింది. పృథ్వీ షా (8), భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) విఫలమయ్యారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. శివాలిక్ శర్మ (36 నాటౌట్) టాప్ స్కోరర్. కెప్టెన్ క్రునాల్ పాండ్యా (30), అతిత్ సేథ్ (22) తమకు లభించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు.

ముంబై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో బరోడా భారీ స్కోరును సాధించ లేకపోయింది. గతవారం సిక్కింపై ప్రపంచ రికార్డు స్కోరు సాధించిన బరోడా.. ముంబైపై ఆ వాడిని చూపించలేకపోయింది. ఇక ముంబై బౌలర్లలో సుర్యాంశ్ షిగ్ద రెండు వికెట్లతో రాణించాడు. మోహిత్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, తనుష్ , అథర్వ అంకోలేకర్ లకు తలో వికెట్ దక్కింది. అనంతరం ఛేదనను ముంబై 17.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 164 పరుగులు చేసి అలవోకగా ఛేదించింది. రహానే సిక్సర్లతో విరుచుకు పడటంతో బరోడా బౌలర్లు తేలిపోయారు. బౌలర్లలో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, అతిత్, అభిమన్యు, శాశ్వత్ లకు తలో వికెట్ దక్కింది. రహానేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

Also Read: Gukesh Chess Champion: గుకేశ్ గెలుపుపై రష్య ఫెడరేషన్ అక్కసు, దర్యాప్తు చేయాలని వింత కోరిక- ఫ్యాన్స్ మండిపాటు 

రజత్ పాటిదార్ విధ్వంసం..
మరో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ (29 బంతుల్లో 66 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. దీంతో మధ్య ప్రదేశ్.. ఢిల్లీని సునాయాసంగా ఓడించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 146 పరుగుల సాధారణ స్కోరు చేసింది. జట్టులో అనూజ్ రావత్ (33 నాటౌట్) వేగంగా ఆడాడు. మయాంక్ రావత్ (24) ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ ఆయుష్ బదోని (19) విఫలమయ్యాడు. బౌలర్లలో ఐపీఎల్ స్టార్ వెంకటేశ్ అయ్యర్ కు రెండు వికెట్లు దక్కాయి. కుమార్ కార్తికేయ, త్రిపురేశ్, అవేశ్ ఖాన్ లకు తలో వికెట్ దక్కింది. అనంతరం ఛేదనను 15.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 152 పరుగులతో ఎంపీ పూర్తి చేసింది. హర్ప్రీత్ సింగ్ (46 నాటౌట్), హర్ష్ గావ్లి (30) రాణించారు. వెటరణ్ ఇషాంత్ శర్మకు రెండు వికెట్లు దక్కగా, హిమాంశు చౌహాన్ కు ఒక వికెట్ దక్కింది. తాజా విజయాలతో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్ కు ముంబై, ఎంపీ చేరాయి. బెంగళూరు వేదికగా ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 

Also Read: Ind Vs Aus Test Series: బ్రిస్బేన్ టెస్టుకు ఆసీస్ జట్టులో మార్పులు- స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget