By: ABP Desam | Updated at : 16 Apr 2023 12:16 PM (IST)
రికీ పాంటింగ్ ( Image Source : Delhi Capitals Twitter )
Delhi Capitals:ఐపీఎల్ -2023 సీజన్ లో ఆడిన ఐదు మ్యాచ్లలోనూ ఓడి ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు అడుగంటే స్థితికి చేరుకుంటున్నది ఢిల్లీ క్యాపిటల్స్. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఆ జట్టు ఈ సీజన్లో ఇంకా బోణీ కొట్టలేదు. ఇంటర్నేషనల్ ప్లేయర్లు, మ్యాచ్ను మలుపు తిప్పగల ఆల్ రౌండర్లు, హిట్టర్లు, వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నా ఆ జట్టు గెలవడానికి నానా తంటాలు పడుతోంది. దీంతో ఢిల్లీ టీమ్తో పాటు ఆ జట్టు హెడ్కోచ్ రికీ పాంటింగ్ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శనివారం ఢిల్లీ.. ఆర్సీబీ చేతిలో ఓడిన తర్వాత టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ పాంటింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచినప్పుడు, 2020లో ప్లేఆఫ్స్ కు వెళ్లినప్పుడు హెడ్కోచ్ గా క్రెడిట్ తీసుకున్న ఆయన ఆ జట్టు ఓటములలో కూడా బాధ్యత వహించాలని అన్నాడు.
ఆర్సీబీతో మ్యాచ్ తర్వాత వీరూ క్రిక్బజ్లో జరిగిన చర్చలో మాట్లాడుతూ.. ‘ఈ విషయం నేను ఇంతకుముందే చెప్పాను. ఒక జట్టు ఓటములకు కోచ్లు క్రెడిట్ తీసుకోవాల్సిందే. పరజయాలకు బాధ్యత తీసుకోవాల్సిందే. గతంలో మనం పాంటింగ్ను ఆహా ఓహో అని పొగిడాం. ఢిల్లీ క్యాపిటల్స్ను ఫైనల్స్కు తీసుకెళ్లాడని, మూడు సీజన్ల పాటు ప్లే ఆఫ్స్కు చేర్చాడని చెప్పుకున్నాం. అప్పుడు క్రెడిట్ అంతా పాంటింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు కూడా పాంటింగ్ ఓటములకు బాధ్యత వహించాలి...
Reflecting on the learnings and staying motivated to perform better 💪
📹 | Head Coach Ricky Ponting spoke to our boys about focusing on the positives from #DCvGT. #YehHaiNayiDilli #IPL2023 pic.twitter.com/nCg9ODj7aS— Delhi Capitals (@DelhiCapitals) April 6, 2023
విజయాలకు క్రెడిట్ తీసుకుని ఓటములను వేరేవాళ్ల మీద తోసేసుందుకు ఇది భారత జట్టు కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఐపీఎల్ లో కోచ్ పాత్ర శూణ్యం. టీమ్ లో ఒక పెద్ద మనిషి తరహాలో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం వారి పని. మ్యాచ్లో వ్యూహాలు రచించడం, వాటిని అమలుపరచడం వరకే వాళ్లు చేయగలిగేది. అయితే ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా చెప్పొచ్చేదేంటంటే.. ఆటగాళ్లు బాగా ఆడితేనే కోచ్ లు మంచిగా కనిపిస్తారు. దురదృష్టవశాత్తూ ఐపీఎల్ లో ఢిల్లీ తరఫున ఇప్పటివరకూ ఇలా జరుగలేదు..’అని చెప్పాడు. ప్రస్తుతం ఢిల్లీ ఈ సీజన్ లో తమ అదృష్టాన్ని మార్చుకోవడానికి ఏమి చేయాలో కూడా తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని తాను భావిస్తున్నట్టు అతడు తెలిపాడు.
Back to the drawing board for us after a tough loss at Chinnaswamy.#YehHaiNayiDilli #IPL2023 #RCBvDC pic.twitter.com/N11n5H10lv
— Delhi Capitals (@DelhiCapitals) April 15, 2023
కాగా ఆర్సీబీ - ఢిల్లీ మధ్య శనివారం బెంగళూరు వేదికగా ముగిసిన మ్యాచ్ లో వార్నర్ సేన 23 పరుగుల తేడాతో ఓడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కోహ్లీ అర్థ సెంచరీ (50) తో రాణించాడు. అనంతరం ఢిల్లీ.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులే చేసింది. మనీష్ పాండే (50) రాణించినా మిగిలిన వారు విఫలమయ్యారు. ఈ సీజన్ లో ఢిల్లీ ఏప్రిల్ 20న కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
ODI World Cup: భారత్కు వస్తానని మాటివ్వు షేర్ఖాన్ - పీసీబీ వద్దకు ఐసీసీ పెద్దలు!
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్లో జీటీపై చెన్నై విక్టరీ!
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు
Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!