అన్వేషించండి

ICC Test Rankings News: భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక

ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఎనిమిదేళ్ల తర్వాత భారత్ కు ఘోర పరాభవం దక్కింది. 2016 నుంచి ఇప్పటివరకు టాప్-2 ప్లేసుల్లో ఉంటూ వచ్చిన టీమిండియా తొలిసారి తన ర్యాంకింగ్స్ లో తన స్థానం దిగజారింది. 

Team India BGT Update: ఆస్ట్రేలియా పర్యటనలో ఓడి సిరీస్ కోల్పోవడంతోపాటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (World Test Championship) ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న భారత్ కు మరో షాక్ తగిలింది. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ కు మూడో స్థానానికి దిగజారింది. 2016 తర్వాత ఈ ర్యాంకుకు చేరుకోవడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. ముఖ్యంగా 2024 సెకండ్ హాఫ్ లో భారత్ ఆడిన ఎనిమిది టెస్టుల్లో ఆరింటిలో ఓడిపోయి, కేవలం ఒక్కదానిలో మాత్రమే గెలవడం ర్యాంకింగ్స్ పై ప్రభావం చూపించింది. మరో మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఇక ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరి జోరు మీదున్న ప్రొటీస్.. తాజాగా పాకిస్థాన్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడం కూడా కలిసొచ్చింది. దీంతో ర్యాంకింగ్స్ లో ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది. 

ఫైనల్ కు టాప్-2 జట్లే..
ఇక ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా టాప్ లో నిలిచింది. రెండోస్థానంలో ఉన్న సౌతాఫ్రికా కంటే 14 పాయింట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 122 పాయింట్లు ఉన్నాయి. సౌతాఫ్రికా (112), భారత్ (109), ఇంగ్లాండ్ (106), న్యూజిలాండ్ (96) టాప్‌-5లో ఉన్నాయి. శ్రీలంక (87), పాకిస్థాన్ (83), వెస్టిండీస్ (75), బంగ్లాదేశ్‌ (65), ఐర్లాండ్ (26) వరుసగా తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. దీంతో టాప్-2లో నిలిచిన ఆసీస్, ప్రొటీస్ జట్లే ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ను ఆడనుండటం విశేషం. వచ్చే జూన్ లో లార్డ్స్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. డబ్ల్యూటీసీ టేబుల్లో ప్రస్తుతం సౌతాఫ్రికా టాప్ లో ఉండగా, ఆసీస్ రెండోస్థానాన్ని దక్కించుకుంది. భారత్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో వరుసగా మూడోసారి ఫైనల్ కు చేరుకోవాలని భావించిన భారత్ ఆశలు ఆవిరయ్యాయి. 

ఐసీసీ అవార్డుకు బుమ్రా నామినేట్..
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా హవా కొనసాగుతోంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో 32 వికెట్లతో సత్తాచాటిన బుమ్రా, తాజాగా డిసెంబర్ నెలకుగాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. బీజీటీలో బుమ్రానే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అవార్డు దక్కించుకునేందుకుగాను ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, డ్యాన్ పాటర్సన్ (సౌతాఫ్రికా)లతో పోటీ పడనున్నాడు.

మరోవైపు సిడ్నీలో జరిగిన చివరి టెస్టులో గాయపడిన బుమ్రా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తను వచ్చేనెలలో జరిగే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగడంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దుబాయల్ ఈ టోర్నీ పోరును భారత్ మొదలు పెడుతుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్తాన్ లతో భారత్ తలపడుతుంది. 

Also Read: BCCI Desicion On Seniors: రోహిత్ వాదనను పట్టించుకోని బీసీసీఐ.. సీనియర్లపై వేటుకు రంగం సిద్ధం! 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
What Indians Ate On New Year: సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Embed widget