అన్వేషించండి

మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ సరిపోలేదు - మ్యాచ్, సిరీస్ రెండూ మనవే!

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ (106 నాటౌట్: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు) వీరోచితంగా పోరాడి సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సిరీస్‌ను కూడా టీమిండియా 2-0తో దక్కించుకుంది. భారత జట్టు దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి.

238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ మందకొడిగా ప్రారంభం అయింది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేరేసరికే ఓపెనర్ టెంబా బవుమా (0: 7 బంతుల్లో), వన్ డౌన్ బ్యాటర్ రిలీ రౌసో (0: 2 బంతుల్లో) అవుటయ్యారు. ఆ తర్వాత కాసేపటికే ఫాంలో ఉన్న ఎయిడెన్ మార్క్రమ్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. 

దీంతో భారత్ గెలుపు పక్కా అనుకున్నారంతా. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (69 నాటౌట్: 48 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (106 నాటౌట్: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు) దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. 10 ఓవర్లలో విజయానికి 170 పరుగులు అవసరం అయిన దశలో వీరు ఎంతో వేగంగా ఆడారు. ఆఖరి ఐదు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు రాబట్టారు. ఈ క్రమంలోనే మిల్లర్ సెంచరీ పూర్తయింది. కానీ విజయానికి ఈ వేగం సరిపోలేదు. 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 221 పరుగులకే పరిమితం అయ్యారు. దీంతో 16 పరుగులతో గెలుపు టీమిండియా సొంతం అయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు.

అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (57: 28 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), రోహిత్ శర్మ (43: 37 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) చెలరేగి ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. మొదటి వికెట్‌కు 96 పరుగులు జోడించిన అనంతరం కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో రోహిత్ అవుటయ్యాడు.

ఆ తర్వాతి ఓవర్లోనే కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ పూర్తయింది. వెంటనే తను కూడా అవుటయ్యాడు. ఈ దశలో జత కలిసిన సూర్యకుమార్ యాదవ్ (61: 22 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (49 నాటౌట్: 28 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) స్కోరు వేగాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 43 బంతుల్లోనే 102 పరుగులు జోడించడం విశేషం. సూర్యకుమార్ యాదవ్ గ్రౌండ్‌కు అన్ని వైపులా భారీ షాట్లతో చెలరేగాడు. బంతి తన బ్యాట్‌కు తగిలితేనే బౌండరీ వెళ్తుందా అనే రేంజ్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ సాగింది. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో లేని పరుగుకు ప్రయత్నించి సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు.

15వ ఓవర్ నుంచి 18వ ఓవర్ వరకు నాలుగు ఓవర్లలోనే టీమిండియా 76 పరుగులు సాధించడం విశేషం. దీంతో టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

APPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP DesamSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ | ABPSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ను పరిశీలించిన మంత్రి ఉత్తమ్Chicken Biryani and roast Free | గుంటూరు ఉచిత చికెన్ మేళాకు భారీగా భోజన ప్రియులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Hyderabad Metro Rail :హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
 ICC Champions Trophy Aus Vs Eng Result Update: ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
TSRTC Special Buses:4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget