అన్వేషించండి

T20 World Cup 2024: ఫుల్ ఎమోషన్‌తో భారత్ పాకిస్థాన్ మ్యాచ్- బాబర్‌ను రోహిత్ నవ్విస్తే- నసీమ్ షా మాత్రం కంటతడి పెట్టాడు

Ind vs Pak Match Highlights: మ్యాచ్‌లో భారత్‌ను 119 పరుగులకే పరిమితం అవ్వటానికి కారణం పాక్ పేసర్‌ నసీమ్‌. తన పదునైన పేస్‌తో మూడు వికెట్లు తీసీనా ఫలితం లేకుండా పోవటంతో నసీమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Naseem Shah in Tears : టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup )లో భారత్‌(Team India) జైత్రయాత్రకు పాకిస్థాన్(Pakistan) బలైపోయింది. టీమిండియా బౌలర్ల ముందు పాక్‌ బ్యాటర్ల ఆటలు సాగలేదు. ఈ మ్యాచ్‌లో భారత్‌ను 119 పరుగులకే పరిమితం చేశామన్న సంతోషం... పాక్‌కు మిగలకుండా పోయింది. లక్ష్య ఛేదనలో పాక్‌ 113 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తక్కువ పరుగులకే అవుట్‌ కావడానికి ప్రధాన కారణం పాకిస్థాన్‌ పేసర్‌ నసీమ్‌. తన పదునైన పేస్‌తో నసీమ్‌ మూడు వికెట్లు తీశాడు. అయితే భారత్‌ చేతిలో ఓటమి అనంతరం నసీమ్‌ (Naseem Shah) కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి కేవలం 4 బంతుల్లో పది పరుగులు చేసిన నసీమ్‌ పాక్‌ను గెలిపించలేకపోయాడు. దీంతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత పాక్‌ పేసర్ ఏడ్చేశాడు.

చివరి ఓవర్లో
అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన చివరి ఓవర్లో నసీమ్ షా రెండు సింగిల్స్, రెండు ఫోర్లు బాదాడు. అయినా ఆఖరి బంతికి పాకిస్థాన్ 8 పరుగులు చేయాల్సి ఉండగా ఒక్క పరుగే వచ్చింది. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత విజయం పాక్‌ ఆటగాళ్లకు తీవ్ర నిర్వేదాన్ని మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్‌ను 20 వికెట్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమైంది. భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు మూడు వికెట్లు తీసిన పాకిస్థాన్ పేసర్ నసీమ్ షా బ్యాట్‌తోనూ పర్వాలేదనిపించాడు.
 
నవ్వులు పూయించిన రోహిత్ 
మన హిట్ మ్యాన్ రోహిత్ సంగతి తెలిసిందేగా... గజినీకి కజిన్ బ్రదరులా తయారువుతున్నాడు. అన్నీ మర్చిపోతున్నాడు. అలాగే నిన్న ఇండియా పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో కూడా హడావిడి చేశాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే టాస్ వేయాల్సిన కాయిన్‌ను గ్రౌండ్‌లోకి వచ్చేప్పుడు అంపైరింగ్ స్టాఫ్ రెండు టీమ్స్‌లో ఏదో ఒక కెప్టెన్‌కి అందిస్తారు. అలా నిన్న రోహిత్ శర్మకు టాస్ కాయిన్ ఇచ్చారు. దాన్ని ప్యాంట్ జేబులో వేసుకున్న రోహిత్ శర్మ ఆ సంగతి మర్చిపోయాడు. కామెంటేటర్ రవిశాస్త్రి ఇచ్చిన ఎలివేషన్లకు మొత్తం బ్లాంక్ అయిపోయింది ఏమో. టాస్ వేయండి అన్నప్పుడు కాయిన్ ఎక్కడుంది భాయ్ అని బాబర్ ఆజమ్‌ని అడిగాడు రోహిత్ శర్మ. తర్వాత మళ్లీ తనే ప్యాంటు జేబు వెతుక్కుని సారీ అంటూ నవ్వుతూ కాయిన్ తీసి టాస్ వేశాడు. 
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Star Sports India (@starsportsindia)

రోహిత్ చేష్టలకు బాబర్ ఆజమ్ కూడా హ్యాపీగా నవ్వుకున్నాడు. టాస్ రోహిత్ శర్మ ఓడిపోవటంతో పాకిస్థాన్ బౌలింగ్ తీసుకోవటం టీమిండియా 119 పరుగులకే పరిమితమై పాకిస్థాన్‌కు 120 పరుగుల టార్గెట్ ఇవ్వటం జరిగిపోయాయి. బూమ్ బూమ్ బుమ్రా దయ వల్ల పాకిస్థాన్ టార్గెట్ చేరుకోకుండా కట్టడి చేసిన భారత్ మ్యాచ్ గెలవగా..రోహిత్ శర్మ ఈ టాస్ కాయిన్ మర్చిపోయిన విజువల్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడే కాదు గతంలోనూ చాలా సార్లు రోహిత్ శర్మ గ్రౌండ్ లోకి వచ్చాక ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు అని అడిగితే పేర్లు మర్చిపోయి ఫన్ క్రియేట్ చేస్తాడు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP DesamTirumala Bramhotsavam Simha vahanam | యోగ నారసింహుడి అలంకారంలో తిరుమల శ్రీవారు | ABP DesamPrakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Embed widget