అన్వేషించండి

IND-W vs ENG-W : అదరగొట్టిన భారత మహిళలు , ఒకే రోజు 400కు పైగా పరుగులు

IND vs ENG HIGHLIGHTS: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత మహిళలు అదరగొట్టారు. రికార్డులను బద్దలుగొడుతూ తొలి రోజే 400కుపైగా స్కోరు సాధించి అబ్బుర పరిచారు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత మహిళలు అదరగొట్టారు. రికార్డులను బద్దలుగొడుతూ అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. తొలి రోజే 400కుపైగా స్కోరు సాధించి అబ్బుర పరిచారు. ఏకంగా నలుగురు బ్యాటర్లు అర్ధ సెంచరీలతో చెలరేగి టీమిండియాను తిరుగులేని స్థితిలో నిలిపారు. మహిళల టెస్ట్‌ క్రికెట్‌లో ఒకే రోజు 400కు పైగా పరుగులు సాధించిన రెండో జట్టుగా భారత మహిళలు రికార్డు సృష్టించారు. వందో టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.  తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమ్‌ఇండియా ఏడు వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. 25 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌ ఆ తర్వాత కాసేపటికే మరో వికెట్‌ కోల్పోయింది. 12 బంతుల్లో 17 పరుగులు చేసిన స్మృతి మంధాన అవుటైంది. 30 బంతుల్లో 19 పరుగులు చేసి విధ్వంసకర బ్యాటర్‌ షెఫాలి వర్మ వెనుదిరిగింది. దీంతో 47 పరుగులకే భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. స్మృతీ మంధాన, షఫాలీ వర్మను ఇంగ్లాండ్‌ బౌలర్లు స్వల్ప వ్యవధిలో ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చిన ఆ తర్వాతే వారికి అసలు కష్టాలు మొదలయ్యాయి. వీరి వికెట్ల కోల్పోయిన తర్వాత భారత మహిళల బ్యాటింగ్‌ సాధికారికంగా సాగింది.  తొలి టెస్ట్‌ ఆడుతున్న అరంగేట్ర బ్యాటర్ శుభా సతీష్‌ ఇంగ్లాండ్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ సత్తా చాటింది. కేవలం 76 బంతుల్లో 69 పరుగులు చేసి ధాటిగా బ్యాటింగ్‌ చేసింది. వన్డే తరహాల్లో బ్యాటింగ్‌ చేసిన సతీష్‌ తన తొలి టెస్ట్‌ను మధుర జ్ఞాపకంగా మార్చుకుంది. జెమీమా రోడ్రిగ్స్‌ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. 99 బంతుల్లో 68 పరుగులు జోడించింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 162 పరుగుల వద్ద  శుభా సతీష్‌ వెనుదిరిగింది. 190 పరుగుల వద్ద జెమీమా రోడ్రిగ్స్‌ కూడా అవుటవ్వడంతో  190 పరుగుల వద్ద భారత జట్టు నాలుగో వికెట్‌ కోల్పోయింది. టాప్‌ ఆర్డర్‌లో ఇద్దరు బ్యాటర్లు రాణించడంతో 38 ఓవర్లకు భారత్‌ 190/4 స్కోరు సాధించింది. 

ఆ తర్వాత స్కోరు బోర్డును నడిపించే బాధ్యతను కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ కౌర్..యస్తికా భాటియా తీసుకున్నారు. ఇంగ్లాండ్‌ బౌలర్లను ఈ జోడి సమర్థంగా ఎదుర్కొంది. 81 బంతుల్లో  49 పరుగులు చేసిన హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అర్థసెంచరీకి కేవలం ఒక్క పరుగు ముందు అవుటై నిరాశ పరిచింది. కానీ యాస్తిర్‌ బాటియా 88 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సుతో 66 పరుగులు చేసి సత్తా చాటింది. వీరిద్దరూ భాగస్వామ్యంతో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 313 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత కూడా భారత బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. లోయర్‌ ఆర్డర్‌లో దీప్తి శర్మ 60 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీప్తికి స్నేహ్‌ రాణా అండగా నిలిచింది. స్నేహ్‌ రాణా 73 బంతుల్లో 30 పరుగులు చేసి అవైటనా దీప్తి పట్టు వదలకుండా బ్యాటింగ్‌ చేసి క్రీజులో నిలిచింది. స్నేహ్‌ రాణా అవుటవ్వడంతో  టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. అనంతరం పూజా వస్తాకర్ కూడా పర్వాలేదనిపించింది. 12 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా  ఏడు వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. క్రీజులో దీప్తి శర్మ (60*), పూజా వస్త్రాకర్‌ (4*) ఉన్నారు. మహిళల టెస్టు క్రికెట్‌లో ఒకే రోజు 400కిపైగా పరుగులు సాధించడం ఇది రెండోసారి మాత్రమే. అంతకుముందు 1935లో కివీస్‌పై ఇంగ్లాండ్‌ 431/4 స్కోరు చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget