అన్వేషించండి

T20 world cup 2024 : కోహ్లీని ఎగతాళి చేసిన బ్రాడ్‌, వెంటనే పోస్ట్‌ డిలీట్‌

Virat Kohli Vs Stuart Broad: క్రికెటర్‌లు ఒక్క టూర్‌లో విఫలమైతే చాలు అన్ని వైపుల నుంచి ప్రశ్నలు విపిస్తాయి. మాటల దాడి మొదలవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాడు కోహ్లీ.

Virat Kohli: ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌నకు ముందు విరాట్‌ కోహ్లీపై ఐసీసీ చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఐసీసీ చేసిన విరాట్‌ కోహ్లీ పోస్ట్‌పై ఇంగ్లాండ్ బౌలర్‌ స్టువర్ట్ బ్రాడ్‌.. తొలుత వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ఆ తర్వాత అభిమానుల దాడి ఊహించి ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశాడు.  
 
ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే
విరాట్ కోహ్లీ కింగ్‌లా ఓ సింహాసనంలో కూర్చున్న ఫొటోను ఐసీసీ తన ఇన్‌ స్టా పేజీలో పోస్ట్‌ చేసింది. విరాట్‌ కోహ్లీ ప్రస్థానాన్ని సూచిస్తున్నట్లుగా వెనక కోహ్లీ ఫొటోలను ఉంచింది. విరాట్‌ బ్యాట్‌ పట్టుకున్నట్లుగా ఒక ఫొటో... నడిచివస్తున్నట్లుగా ఇంకోటి ఇలా ఆ ఫొటోను పోస్ట్ చేసిన ఐసీసీ ఆసక్తికర క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. రాజు కిరీటంలో చివరి ఆభరణం మిస్సైందని.. ఈ టీ 20 ప్రపంచకప్‌ అనే కలికితురాయిని తన కిరీటంలో చేర్చుకునేందుకు కింగ్‌ కేవలం అడుగు దూరంలోనె ఉన్నాడని అర్థం వచ్చేలా ఐసీసీ పోస్ట్‌ చేసింది . ఐసీసీ చేసిన ఈ పోస్ట్‌పై ఇంగ్లాండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ వెంటనే రిప్లై ఇచ్చాడు. ఆ రిప్లై కోహ్లీని ఎగతాళి చేసేలా ఉండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కోహ్లీని ఎగతాళి చేస్తూ ఈ ప్రపంచకప్‌లో కింగ్‌ వైఫల్యాన్ని గుర్తు చేస్తూ బ్రాడ్‌ పోస్ట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోహ్లీ 17 ఏళ్ల ట్రోఫీ కరువును సూచిస్తూ ఆ కలికితురాయి ఐపీఎలా అంటూ బ్రాడ్ పోస్ట్‌ చేశాడు. అలా స్పందించిన బ్రాడ్‌ కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశాడు. కానీ  అప్పటికే చాలామంది ఐసీసీ పోస్ట్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి నెట్టింట వైరల్‌ చేసేశారు. సెమీఫైనల్లో ఓడిపోయిన అక్కస్సుతో బ్రాడ్‌ ఇలాంటి కామెంట్స్‌ చేస్తున్నాడని కింగ్‌ అభిమానులు మండిపడుతున్నారు. యువరాజ్‌ కొట్టిన ఆరు సిక్సర్లు మర్చిపోయావా బ్రాడ్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రపంచకప్‌ ఫైనల్లో విరాట్‌ చెలరేగడం పక్కా అని... ఆ రాజు కిరీటంలో మరో ఆభరణం చేరడం కూడా పక్కా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
 
కోహ్లీ జూలు విదిలిస్తే...
విరాట్ కోహ్లీ ఈ టీ 20 ప్రపంచకప్‌లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 75 పరుగులే చేశాడు. సూపర్ ఎయిట్‌లో బంగ్లాదేశ్‌పై 37 పరుగులే కోహ్లీ అత్యధికం. 2007లో MS ధోని నేతృత్వంలో భారత్‌ T20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటికీ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయలేదు. 2014లో ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌ ట్రోఫీని కైవసం చేసుకునే అవకాశం కోహ్లీకి లభించింది. అయితే ఫైనల్లో భారత్ శ్రీలంక చేతిలో ఓడిపోయింది. 2016లో స్వదేశంలో జరిగిన సెమీఫైనల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోయింది. ఇక 2022లో సెమీస్‌లో జోస్ బట్లర్ సేన చేతిలోనూ భారత్‌ ఓడిపోయింది. అయితే 2011 వన్డే ప్రపంచ కప్‌ను,  2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన జట్టులో కోహ్లీ సభ్యుడిగా ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోహ్లీ 15 ఇన్నింగ్స్‌లలో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. ఇక  బార్బడోస్‌లో జరిగే ఫైనల్‌లో కోహ్లీ టాప్ గేర్‌ను అందుకుంటే చూడాలని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indian Cricketers Marriage: 2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Spirit of cricket: బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Embed widget