అన్వేషించండి

Uncle Percy Death: అంకుల్‌ పెర్సీ ఇక లేరు, లంక ఆటగాళ్ల భావోద్వేగం

Uncle Percy Death: శ్రీలంక క్రికెట్‌ జట్టు వీరాభిమాని పెర్సీ అబేశేఖర ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొలంబోలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

 శ్రీలంక క్రికెట్‌ జట్టు వీరాభిమాని పెర్సీ అబేశేఖర ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొలంబోలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అబేశేఖరను క్రికెట్ అభిమానులు ముద్దుగా అంకుల్ పెర్సీ అని పిలుచుకునేవారు. శ్రీలంక మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడ అంకుల్‌ పెర్సీ వాలిపోయేవాడు. గత ఏడాదిగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 87 ఏళ్ల అంకుల్‌ పెర్సీ తుదిశ్వాస విడిచినట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. శ్రీలంక క్రికెట్ బోర్డు ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్విట్టర్లో ఫొటో పోస్టు చేసింది. ఆయన వైద్యంకోసం క్రికెట్‌ శ్రీలంక రూ.50 లక్షలు ఆర్ధికసాయం కూడా చేసింది. 


టీమిండియాతోనూ అనుబంధం
పెర్సీ అంకుల్’ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వీరాభిమాని. ఈ క్రమంలో ఈ ఏడాది ఆసియాకప్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా అంకుల్‌ పెర్సీని తన నివాసంలో కలిశారు. అంకుల్‌ పెర్సీతో కలిసి దిగిన ఫోటోను రోహిత్ శర్మ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. 2015లో శ్రీలంక పర్యటన సందర్భంగా విరాట్ కోహ్లీ.. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో పెర్సీతో ముచ్చటించారు. వారిద్దరూ కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు.


43 ఏళ్లపాటూ జట్టుతోనే..
  1936లో జన్మించిన పెర్సీ.. 1979 వన్డే ప్రపంచకప్ నుంచి శ్రీలంక జట్టును ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వచ్చేవారు. గత 40 ఏళ్లుగా శ్రీలంక క్రికెట్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్లి ఉత్సాహపరిచేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని స్టేడియాల్లో అంకుల్ పెర్సీ శ్రీలంక జాతీయజెండాను రెపరెపలాడించేవారు. 1979 నుంచి గతేడాది వరకు పెర్సీ 43 ఏళ్లపాటు పెర్సీ మ్యాచులను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చారు. గతేడాది వరకు జట్టుతో కలిసి ప్రయాణం చేసిన అంకుల్ పెర్సీ గత ఏడాది నుంచి అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమయ్యారు.  శ్రీలంక మాజీ క్రికెటర్లు అర్జున రణతుంగ, సనత్ జయసూర్య, కుమార సంగక్కర వంటి వారితో పెర్సీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పలువురు భారత ఆటగాళ్లతోనూ పెర్సీకి సత్సంబంధాలు ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ గతంలో పెర్సీని కలిసి ముచ్చటించారు.


లంక ఆటగాళ్ల నివాళులు
పెర్సీ అంకుల్ మృతిపట్ల శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు సనత్ జయసూర్య, రస్సెల్ ఆర్నాల్డ్, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. పెర్సీ మరణం పట్ల శ్రీలంక మాజీ క్రికెటర్లు సనత్ జయసూర్య, కుమార సంగక్కర, మహేల జయవర్దనే సంతాపం తెలిపారు. శ్రీలంక క్రికెటర్లకు అంకుల్ పెర్సీ 12వ ఆటగాడన్న జయవర్ధనే.. తన కెరీర్ ఆసాంతం ఆయన ఉత్సాహపరిచాడన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆయన తమను నవ్వించే వాడన్నారు. పెర్సీ అంకుల్ మరణం పట్ల భావోద్వేగానికి గురైన సంగక్కర.. తాను క్రికెట్లోకి అడుగుపెట్టిన దగ్గర్నుంచి రిటైరయ్యే వరకూ పెర్సీ అంకుల్ సపోర్ట్ మాత్రం నిలకడగా కొనసాగిందన్నారు. జెర్సీ ధరించిన ఆటగాళ్ల కంటే ఆయన ఏ విధంగానూ తక్కువ కాదన్నారు. అంకుల్‌ పెర్సీ మరణం తమను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని పలువురు క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget