అన్వేషించండి

Ranji Trophy 2024: ముంబైతో తలపడేందుకు, బిహార్‌ నుంచి రెండు జట్లు

Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో ముంబై-బిహార్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ముంబైతో టెస్టులో తలపడేందుకు.. రెండు బిహార్‌ జట్లు వచ్చాయి. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో ముంబై-బిహార్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ముంబైతో టెస్టులో తలపడేందుకు.. రెండు బిహార్‌ జట్లు వచ్చాయి. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ గందరగోళంతో తొలి రోజు ఆట కూడా ఆలస్యంగా మొదలైంది. బిహార్‌ – ముంబై మధ్య పాట్నాలోని మోయిన్‌ ఉల్‌ హక్‌ స్టేడియం వేదికగా మ్యాచ్‌ జరిగింది. 
ఇంతకీ ఏం జరిగిందంటే...?!
బిహార్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాకేశ్‌ తివారి- కార్యదర్శి అమిత్‌ కుమార్‌ మధ్య కొద్దిరోజులుగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ విభేదాలతో ఇద్దరు...వేర్వేరుగా రెండు జట్లు ప్రకటించారు. రాకేశ్‌ తివారి, సెకట్రరీ అమిత్‌ కుమార్‌లు పోటాపోటీగా జట్లను ప్రకటించడంతో అసలు ముంబై జట్టుతో ఆడబోయే టీమ్ ఏదంటూ అందరూ గందరగోళంలో పడిపోయారు. తాము సెలక్ట్‌ చేసిన జట్టే మైదానంలో దిగుతుందని రాకేశ్‌ తివారి, అమిత్‌ కుమార్‌ ఆటగాళ్లకు చెప్పారు. వీరిద్దరి అత్యుత్సాహం కారణంగా రెండు జట్లలోని సభ్యులంతా ముంబైతో మ్యాచ్‌ కోసం మోయిన్‌ ఉల్‌ హక్‌ స్టేడియానికి తరలివచ్చారు. చివరికి పోలీసుల రాకతో చేసి సెక్రటరీ అమిత్‌ కుమార్‌ వర్గం సభ్యులను అక్కడ నుంచి పంపించేయడం వల్ల ముంబయి జట్టు రాకేశ్‌ తివారి ప్రకటించిన బిహార్‌ జట్టుతో ప్రస్తుతం మ్యాచ్ ఆడింది.
 
వివాదంపై ఏమన్నారంటే...
ఇప్పటికే సెక్రటరినీ సస్పెండ్ చేశామని, అందుకే ఆయన జట్టును ఎంపిక చేయడం చెల్లదని బీసిఏ అధ్యక్షుడు తివారీ అన్నారు. ఆటగాళ్ల ప్రతిభాపాటవాలను చూసి తుది జట్టును ఎంపిక చేశానంటూ చెప్పుకున్నారు. సెక్రటరీ అమిత్ కుమార్ కూడా ఈ విషయంపై స్పందించారు. తనను సస్పెండ్ చేసే అధికారాలు అధ్యక్షుడికి లేదని పేర్కొన్నారు. తుది జట్టును సెక్రట్రీనే ఎంపిక చేస్తారని, అధ్యక్షుడికి ఆ హక్కు లేదంటూ అమిత్ కుమార్ మండిపడ్డారు. బోర్డు ప్రెసిడెంట్‌ ఎప్పుడైనా జట్టు ఎంపికలో జోక్యం చేసుకుంటారా... బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ భారత జట్టును ప్రకటించడం చూశారా అని కౌంటర్‌ ఇచ్చాడు. మ్యాచ్‌ విషయానికొస్తే మొదటిరోజు ఆటలో టాస్‌ గెలిచిన బిహార్‌ ముంబైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ముంబై జట్టు 76.2 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్‌ కాగా..  తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బిహార్‌ 26 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.
హైదరాబాద్‌ ఘన విజయం
రంజీ ట్రోఫీ 2023-2024 సీజన్‌ను హైదరాబాద్‌ ఘనంగా ప్రారంభించింది.
రెండు రోజుల్లోనే నాగాలాండ్‌ను మట్టికరిపించింది. ఇన్నింగ్స్‌ 194 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. తొలుత రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ డబుల్‌ సెంచరీ... కెప్టెన్‌ తిలక్‌ వర్మ శతకంతో భారీ స్కోరు చేసిన హైదరాబాద్‌... తర్వాత నాగాలాండ్‌ను రెండు ఇన్నింగ్సుల్లోనూ తక్కువ పరుగులకే ఆలౌట్‌ చేసింది. హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి నాగాలాండ్‌ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. హైదరాబాద్‌ బ్యాటర్ రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ 143 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్‌ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్‌ గుర్తింపు పొందాడు. 

 

టాప్ హెడ్ లైన్స్

Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
KS Bharat Announces Retirement:  ఇండియా టీమ్ కు గుడ్ బై చెప్పేసిన వికెట్ కీపర్.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్
ఇండియా టీమ్ కు గుడ్ బై చెప్పేసిన వికెట్ కీపర్.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్
Virat Kohli Ruled Out: ఆఫ్గాన్ తో  సిరీస్ కు కోహ్లీ దూరం?: గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్.. రోహిత్ పై కూడా వీడని సస్పెన్స్.. 
ఆఫ్గాన్ తో  సిరీస్ కు కోహ్లీ దూరం?: గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్.. రోహిత్ పై కూడా వీడని సస్పెన్స్.. 
Vaibhav Sooryavanshi: చిచ్చరపిడుగు సూర్యవంశీకి మరో అరుదైన ఘనత! అతని మైండ్‌ సెట్‌పై ఐఐఎం ఇండోర్ పరిశోధన!
చిచ్చరపిడుగు సూర్యవంశీకి మరో అరుదైన ఘనత! అతని మైండ్‌ సెట్‌పై ఐఐఎం ఇండోర్ పరిశోధన!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget