అన్వేషించండి

Ranji Trophy 2024: ముంబైతో తలపడేందుకు, బిహార్‌ నుంచి రెండు జట్లు

Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో ముంబై-బిహార్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ముంబైతో టెస్టులో తలపడేందుకు.. రెండు బిహార్‌ జట్లు వచ్చాయి. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో ముంబై-బిహార్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ముంబైతో టెస్టులో తలపడేందుకు.. రెండు బిహార్‌ జట్లు వచ్చాయి. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ గందరగోళంతో తొలి రోజు ఆట కూడా ఆలస్యంగా మొదలైంది. బిహార్‌ – ముంబై మధ్య పాట్నాలోని మోయిన్‌ ఉల్‌ హక్‌ స్టేడియం వేదికగా మ్యాచ్‌ జరిగింది. 
ఇంతకీ ఏం జరిగిందంటే...?!
బిహార్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాకేశ్‌ తివారి- కార్యదర్శి అమిత్‌ కుమార్‌ మధ్య కొద్దిరోజులుగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ విభేదాలతో ఇద్దరు...వేర్వేరుగా రెండు జట్లు ప్రకటించారు. రాకేశ్‌ తివారి, సెకట్రరీ అమిత్‌ కుమార్‌లు పోటాపోటీగా జట్లను ప్రకటించడంతో అసలు ముంబై జట్టుతో ఆడబోయే టీమ్ ఏదంటూ అందరూ గందరగోళంలో పడిపోయారు. తాము సెలక్ట్‌ చేసిన జట్టే మైదానంలో దిగుతుందని రాకేశ్‌ తివారి, అమిత్‌ కుమార్‌ ఆటగాళ్లకు చెప్పారు. వీరిద్దరి అత్యుత్సాహం కారణంగా రెండు జట్లలోని సభ్యులంతా ముంబైతో మ్యాచ్‌ కోసం మోయిన్‌ ఉల్‌ హక్‌ స్టేడియానికి తరలివచ్చారు. చివరికి పోలీసుల రాకతో చేసి సెక్రటరీ అమిత్‌ కుమార్‌ వర్గం సభ్యులను అక్కడ నుంచి పంపించేయడం వల్ల ముంబయి జట్టు రాకేశ్‌ తివారి ప్రకటించిన బిహార్‌ జట్టుతో ప్రస్తుతం మ్యాచ్ ఆడింది.
 
వివాదంపై ఏమన్నారంటే...
ఇప్పటికే సెక్రటరినీ సస్పెండ్ చేశామని, అందుకే ఆయన జట్టును ఎంపిక చేయడం చెల్లదని బీసిఏ అధ్యక్షుడు తివారీ అన్నారు. ఆటగాళ్ల ప్రతిభాపాటవాలను చూసి తుది జట్టును ఎంపిక చేశానంటూ చెప్పుకున్నారు. సెక్రటరీ అమిత్ కుమార్ కూడా ఈ విషయంపై స్పందించారు. తనను సస్పెండ్ చేసే అధికారాలు అధ్యక్షుడికి లేదని పేర్కొన్నారు. తుది జట్టును సెక్రట్రీనే ఎంపిక చేస్తారని, అధ్యక్షుడికి ఆ హక్కు లేదంటూ అమిత్ కుమార్ మండిపడ్డారు. బోర్డు ప్రెసిడెంట్‌ ఎప్పుడైనా జట్టు ఎంపికలో జోక్యం చేసుకుంటారా... బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ భారత జట్టును ప్రకటించడం చూశారా అని కౌంటర్‌ ఇచ్చాడు. మ్యాచ్‌ విషయానికొస్తే మొదటిరోజు ఆటలో టాస్‌ గెలిచిన బిహార్‌ ముంబైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ముంబై జట్టు 76.2 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్‌ కాగా..  తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బిహార్‌ 26 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.
హైదరాబాద్‌ ఘన విజయం
రంజీ ట్రోఫీ 2023-2024 సీజన్‌ను హైదరాబాద్‌ ఘనంగా ప్రారంభించింది.
రెండు రోజుల్లోనే నాగాలాండ్‌ను మట్టికరిపించింది. ఇన్నింగ్స్‌ 194 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. తొలుత రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ డబుల్‌ సెంచరీ... కెప్టెన్‌ తిలక్‌ వర్మ శతకంతో భారీ స్కోరు చేసిన హైదరాబాద్‌... తర్వాత నాగాలాండ్‌ను రెండు ఇన్నింగ్సుల్లోనూ తక్కువ పరుగులకే ఆలౌట్‌ చేసింది. హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి నాగాలాండ్‌ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. హైదరాబాద్‌ బ్యాటర్ రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ 143 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్‌ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్‌ గుర్తింపు పొందాడు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget