అన్వేషించండి

Gundla Brahmeswaram Temple: అడవిలో ఆధ్యాత్మిక క్షేత్రం! అశ్వత్ధామ ప్రతిష్టించిన శివలింగం , ఏడాదికి 2 రోజులే దర్శనానికి అనుమతి!

Gundla Brahmeswara Temple: దట్టమైన అడవిలో వెలసిన క్షేత్రం. శివయ్యపై భక్తితో కుదిరినప్పుడల్లా వెళ్లి దర్శనం చేసుకుంటానంటే కుదరదు. ఏడాదికి రెండు రోజులు మాత్రమే అనుమతి. ఎక్కడుందా ఆలయం..

Gundla Brahmeswara Swamy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బండి ఆత్మకూరు మండల పరిధిలో నల్లమల అడవిలో ఉంది గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రం. ఈ దేవాలయం ఏడాదికి రెండ రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే అటవీ అధికారుల అనుమతి తప్పనిసరి. 

దట్టమైన అడవిలో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయాన్ని కాకతీయ, విజయనగర రాజులు పునర్నిర్మించినట్టు శిలాశాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ పరమేశ్వరుడే బ్రహ్మేశ్వరుడి రూపంలో కొలువై ఉన్నాడు. మహాభారత కురుక్షేత్ర సంగ్రామం తర్వాత అశ్వత్థాముడు ( యుద్ధసమయం ముగిసిన తర్వాత ఉప పాండవులను చంపిన పాప ప్రక్షాళన కోసం) శ్రీకృష్ణుడి ఆదేశానుసారం గుండ్లకమ్మ నదితీరంలో శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం.  జన్మస్థానతీరాన శివలింగాన్ని ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండ్లబ్రహ్మేశ్వరుడిగా  కొలువైన శివయ్యతో పాటూ  రాజరాజేశ్వరిదేవి, అశ్వత్థామ, వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, నవగ్రహాలను దర్శించుకోవచ్చు. 

ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. మహా శివరాత్రి సమయంలో రెండు రోజుల పాటు భక్తులకు ప్రవేశం ఉంటుంది. అప్పుడు కూడా అటవీ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. 

గుండ్ల బ్రహ్మేశ్వరస్వామి దేవాలయం సందర్శం కేవలం ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు ఇక్కడ ప్రకృతి మైమరపిస్తుంది. ఎన్నో వృక్షజాతులు, జంతువులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో దాదాపు 353కి పైగా వృక్షజాతులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.  పులులు సంచరించే ప్రదేశం ఇది...ఇంకా మచ్చలపిల్లి, దుప్పులు ఇతర అటవీ జంతువులను చూడొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 23 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్న లెక్క. 

ఆలయం సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నది నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల వరకూ ప్రవహిస్తుంది. ఈ నదిపై కందుల ఓబుళరెడ్డి గుండ్లకమ్మ జలాశయం ఏర్పాటు చేశారు. ఈ జలాశయంతో ప్రకాశం జిల్లా పరిధిలో ఎన్నో గ్రామాలకు తాగు, సాగునీరు అందుతోంది
 
గుండ్ల బ్రహ్మేశ్వరస్వామి దేవాలయానికి ఎలా వెళ్లాలి?

ముందుగా నంద్యాల జిల్లా వెలుగోడు చేరుకోవాలి. అక్కడి నుంచి గట్టుతండా మీదుగా నేరుగా ఈ క్షేత్రానికి ట్రాక్టర్లు సహా వివిధ వాహనాలుంటాయి.  గతంలో ఆర్టీసీ బస్సులతో పాటూ అన్ని వాహనాలు ఈ క్షేత్రానికి వెళ్లేవి. తెలుగుగంగ రిజర్వాయర్‌ నిర్మాణం,  పులుల సంరక్షణ కేంద్రంగా ఈ క్షేత్రాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించడంతో రహదారిని మూసి వేశారు. ఏటా మహాశివరాత్రి సందర్భంగా అయినా అనుమతించాలన్న భక్తుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని ఏడాదికి 2 రోజులు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ఇంకా నంద్యాల - వెలుగోడు - ఆత్మకూరు - సంతజూటూరు  నుంచి పెద్దదేవలాపురం  మీదుగా ఈ ఆలయానికి వెళ్లొచ్చు.  ఇంకా నంద్యాల నుంచి గాజులపల్లె మీదుగా గిద్దలూరు దిగువమెట్టు నుంచి కూడా గుండ్లబ్రహ్మేశ్వరం చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి అయితే అన్ని రకాల వాహనాలు వెళతాయి. 42 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం 6 గంటలు బయలుదేరి వెళ్లి సాయంత్రం 6 లోపు వచ్చేయాల్సి ఉంటుంది. అప్పటివరకూ మాత్రమే అనుమతి.  

ఒకప్పుడు కార్తీమాసం, మాఘమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తుల సందడి ఉండేది. కానీ ఇప్పుడు అటవీ అధికారులు అనుమతి నిరాకరించడంతో ఏడాదిలో రెండు రోజులే వెళ్లే అవకాశం వస్తోంది. నిత్యం భక్తులు సందర్శించుకునే ఏర్పాట్లు చేస్తే ఆలయం అభివృద్ధి చెందుతుందంటున్నారంతా. అయితే పులుల సంరక్షణ కేంద్రం కావడంతో ఏడాదికి రెండు రోజులే అనుమతి అని అటవీ అధికారులు స్పష్టంగా చెప్పేస్తున్నారు. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Rahu Gochar 2026: UPSC, బ్యాంకింగ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్, ముఖ్యంగా ఈ 5 రాశులవారికి!
UPSC, బ్యాంకింగ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్, ముఖ్యంగా ఈ 5 రాశులవారికి!
05-07-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
05-07-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
Amarnath Yatra 2026: అమర్‌నాథ్ యాత్ర 2026 - ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్! జనాన్ని చూస్తేనే ఓం నమః శివాయ అనేస్తారు!
అమర్‌నాథ్ యాత్ర 2026 - ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్! జనాన్ని చూస్తేనే ఓం నమః శివాయ అనేస్తారు!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget