అన్వేషించండి

Amritsar Golden Temple: తప్పు చేసిన నాయకులకు ప్రార్థనా మందిరంలో శిక్షలేంటీ- అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి!

Golden Temple Facts: సిక్కుల అత్యంత పవిత్ర స్థలమైన అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ లో సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌  పై కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ ప్రార్థనా మందిరం ప్రత్యేకత ఏంటి? ఇక్కడ శిక్షలేంటీ?

Amritsar Golden Golden Temple interesting Facts: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో పంజాబ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్‌ పార్టీ నేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌  పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. ఆయన సేవాదార్‌గా శిక్ష అనుభవిస్తుండగా ఈ ఘటన జరగడం కలకలంరేపింది. శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయ ప్రవేశద్వారం వద్ద కాపలాదారుగా ఉన్న సుఖ్‌బీర్ ని సమీపించిన ఓ వ్యక్తి కొన్ని అడుగుల దూరంనుంచి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సుఖ్ బీర్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు..నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నారైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. నారైన్ గతంలో ఓ ఇంటర్నేషనల్ ఉగ్రముఠాలో పనిచేసినట్టు సమాచారం.  

Also Read: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్

శిరోమణి అకాలీదళ్ పార్టీ  అధికారంలో ఉన్నప్పుడు సుఖ్ బీర్ మతపరమైన తప్పిదాలు చేసినట్టు తేలడంతో స్వర్ణదేవాలయంలో పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని  అకాల్ తఖ్త్‌ ఆదేశించింది. డిసెంబరు 03 మంగళవారం నుంచి సుఖ్ బీర్ సేవాదార్ గా శిక్ష అనుభవిస్తున్నాడు.  ఈ సమయంలో కాల్పులు జరగడంతో స్వర్ణదేవాలయం గురించి చర్చ జరుగుతోంది. ఏంటి ఈ ప్రార్థనా మందిరం ప్రత్యేకత..ఇక్కడ శిక్షలెందుకు? అమృత్ సర్ స్వర్ణ దేవాలయం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే...

ఈ అమృత్‌స‌ర్‌ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ హర్మందిర్ సాహిబ్ అని పిలుస్తారు. దేశంలోనే అత్యంత అందమైన, ప్రశాంతమైన పవిత్ర ప్రదేశాల్లో ఇదొకటి. సిక్కులకు ప్రధాన గురుద్వార్ కూడా అమృత్ సర్ స్వర్ణ మందిరమే. ఈ ఆలయాన్ని కేవలం సిక్కులుమాత్రమే కాదు ఇతర మతస్తులు కూడా దర్శించుకుంటారు. నిత్యం భక్తులతో, పర్యాటకులతో సందడిగా ఉండే ఈ ప్రదేశంలో అడుగుపెట్టగానే మానసిక ప్రశాంతత లభిస్తుందంటారంతా.  

మనదేశంలో అత్యధిక పర్యాటకులు సందర్శించే ప్రార్థనా స్థలాల్లో టాప్ లో ఉంటుంది అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమలేశుడి సన్నిధిలానే అమృత్ సర్ ప్రార్థనామందిరం కూడా నిత్యం భక్తులు, పర్యాటకులతో కళకళలాడుతుంది. ఈ మందిరానికి దేశం నలుమూలల నుంచే కాదు..విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.

ఒకప్పుడు బుద్ధుడు ధ్యానం చేసిన ప్రదేశం ఇది అని అక్కడ రికార్డుల్లో ఉంది. ప్రస్తుతం గోల్డెన్ టెంపుల్ ఉన్న ప్రదేశం అప్పట్లో దట్టమైన అటవీప్రాంతం ఉండేది. అందుకే ఈ ప్రదేశాన్ని ధ్యానం కోసం ఎంపిక చేసుకున్నాడట బుద్ధుడు.  

Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం

ఈ ప్రార్థనా మందిరానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ బంగారుతాపడం. మొత్తం 24 క్యారెట్ల బంగారు పూతను మందిరం చుట్టూ అద్దారు. అందుకే స్వర్ణ మందిరం అని పిలుస్తారు. మహారాజా రంజిత్ సింగ్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఆలయానికి పసిపి పూత వేయాలనుకున్నాడు. అలా 162 కిలోల బంగారు పూతతో మొదలై..రాను రాను 90ల నాటికి 500 కిలోల బంగారుపూత వేశారు.  
 
ఈ ఆలయంలో నిత్యం వేలమంది భక్తులకు అన్నదానం చేస్తారు. ఇక్కడ ఎవరైనా ఎంత గొప్పవారైనా నేలపై కూర్చునే భోజనం చేయాలి. ఎవరికీ ప్రత్యేక ఏర్పాట్లు ఉండలవు. భక్తులైనా, పర్యాటకులైనా , ఏ మతమైనా అందరూ ఇక్కడ సమానమే.   

స్వర్ణకాంతులు మాత్రమే కాదు..మందిరంలో అణువణువు అద్భుతమే.  హిందూ-మొఘల్ కలయిక శైలిలో నిర్మించిన ఆలయం గోపురం నుంచి కిటికీలు, గుమ్మాల వరకూ అన్నీ మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేలా ఉంటాయ్. ఇక్కడ ఆలయంలోకి వెళ్లేందుకు కనిపించే మెట్లమార్గం కిందకు ఉంటుంది. అంటే తమలో ఉండే అహంకారం, రాగద్వేషాలు వదులుకుని కిందకు దిగిరావాలని భగవంతుడి సందేశం  

ఇక్కడ ఎంట్రీకి కుల, మతాలతో సంబంధం లేదు. ఆలయానికి నాలుగువైపులా ప్రవేశ ద్వారాలుంటాయి. అంటే అన్ని మతాలవారికి ఆహ్వానం పలుకుతున్నాం అని చెప్పడంలో ఆంతర్యం అది. దీని నిర్మాణ సమయంలోనూ గుర్ అర్జున్ దేవ్..సుఫీ సెయింట్ మియాన్ మీర్‌ను  శంకుస్థాపనకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అప్పటి నుంచి అమృత్ సర్ స్వర్ణదేవాలయం అంటే అందరిది అనే భావన కలిగింది. 

ఈ ప్రార్థనామందిరంలో సేవచేయాలనుకుంటే మీరు ఏ కులమైనా, ఏ మతమైనా కానీ ఎలాంటి అభ్యంతరం లేదు..కేవలం సిక్కులే అయి ఉండాల్సిన అవసరం లేదు. మతపరమైన తప్పిదాలు చేసేవారికి శిక్షలో భాగంగా ఇక్కడ సేవాకార్యక్రమాలు చేయిస్తారు. ప్రస్తుతం సుఖ్ బీర్ అనుభవిస్తున్న శిక్ష ఇదే.. భగవంతుడి సన్నిధిలో సేవచేయడమే...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే లోపలి కన్ను రహస్యం!
చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే అంతర్ధృష్టి రహస్యం!
Nag Panchami 2026 Date: నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget