అన్వేషించండి

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. జనవరి 19 వరకూ వైకుంఠ ద్వార దర్శనాలు!

Tirumala News: తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాల రద్దీ కొనసాగుతోంది.. పండుగ సెలవుకు కూడా రావడంతో శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు...

Tirumala: వీకెండ్, సంక్రాంతి సెలవులు కలసిరావడంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జనవరి 10న మొదలైన వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులు క్యూ లైన్లలో నిల్చుని కలియుగ దైవాన్ని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి మొదటి మూడు రోజులకు ముందుగానే టోకెన్లు జారీ చేసిన టీటీడీ..ఆ తర్వాత నుంచి ముందురోజు టోకెన్లు ఇస్తోంది.వైకుంఠ ద్వార దర్శనాలు 19 వ తేదీవరకూ కొనసాగుతాయి. కేవలం ఆరు రోజుల్లో 4 లక్షల 8 వేల మంది భక్తులు శ్రీవారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. 

Also Read: తిరుమల ఆనందనిలయంలో ఏ ఏ విగ్రహాలు ఉన్నాయి - శ్రీవారితో పాటూ ఈ విగ్రహాలను గమనించారా!

సంక్రాంతి సెలవుల సందర్భంగా గురువారం వేకువజాము నుంచి శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. అర్థరాత్రి 12 గంటల వరకూ ఆలయాన్ని తెరిచి ఉంచిన అర్చకులు ధనుర్మాస కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గురువారం వేకువ జామునే మూడు గంటల 50 నిముషాల నుంచి వైకుంఠ ద్వార దర్శనాలకు వీఐపీలను అనుమతించారు. ఆ తర్వాత సర్వ దర్శనం భక్తులను అనుమతించారు.   గతంలో వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనాలు ఉండేవి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు పది రోజుల పాటూ దర్శన ఏర్పాట్లు చేశారు. అందులో భాగమే జనవరి 10 నుంచి 19 వరకూ వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులకు అనుమతి...

Also Read: ముస్లిం భక్తుడు సమర్పించిన బంగారు పూలతోనే దశాబ్ధాలుగా శ్రీవారికి అష్టదళ పద్మారాధన సేవ!

వైకుంఠ ఏకాదశి నుంచి ఆరోరోజు (జనవరి 15)..అధ్యయనోత్సవాల్లో భాగంగా తిరుమలలో ప్రణయ కలహోత్సవం ప్రణయ కలహోత్సవం  నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామి  మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అమ్మవార్లు చెరో పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా  నిల్చున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు ప్రణయకలహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం ఆస్థానం నిర్వహించి...శ్రీ నమ్మాళ్వార్‌ రచించిన ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలోని పాశురాలను నిందాస్తుతి శైలిలో పారాయణం చేశారు. రాత్రి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గోదా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శ్రీకృష్ణుడిని, ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను అలంకరించిన కళ్యాణ వేదికపైకి తీసుకొచ్చి వైభవంగా వేడుక నిర్వహించారు. మహా సంకల్పం, స్వామివార్లు- అమ్మవార్ల ప్రవర, మాంగల్యపూజ అనంతరం మాంగల్య ధారణ నిర్వహించారు.

వెంకటేశ్వర వజ్రకవచం (Sri Venkateshwara Vajra Kavacha Stotram)

(మార్కండేయ ఉవాచ)

నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం
ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ
సహస్ర శీర్షా పురుషో వెంకటేశ శ్శిరోవతు
ప్రాణేశ: ప్రాణనిలయః ప్రాణాన్ రాక్షతుమే హరి:
ఆకాశరాట్ సురానాధ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమ పయాద్దేహం మే వెంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగంబాజాని రీశ్వరః
పాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చుతు
య ఏతద్వజ్రకవచ మభేద్యం వెంకటేశితు:
సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
ఇతి మార్కండేయకృత వెంకటేశ్వర వజ్రకవచం

ఓం నమో వేంకటేశాయ

Also Read: ఏడాదిలో రోజుల సంఖ్య కన్నా తిరుమలేశుడి ఉత్సవాల సంఖ్యే ఎక్కువ!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RaghunathTemple: శ్రీనగర్ లో 36 ఏళ్ల నిరీక్షణకు తెర! కాశ్మీర్ పండిట్ ల ఊచకోతతో మూతపడిన రఘునాథ్ మందిరానికి పూర్వ వైభవం
శ్రీనగర్ లో 36 ఏళ్ల నిరీక్షణకు తెర! కాశ్మీర్ పండిట్ ల ఊచకోతతో మూతపడిన రఘునాథ్ మందిరానికి పూర్వ వైభవం
Architecture Temples : విరూపాక్ష ఆలయం సహా ఈ 8 ఆధ్యాత్మిక కట్టడాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు!
విరూపాక్ష ఆలయం సహా ఈ 8 ఆధ్యాత్మిక కట్టడాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు!
Gas Crisis: అంగారకుడి దృష్టి యుద్ధంపై, శుక్రుడి దృష్టి చమురు, గ్యాస్‌పై !ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుందా?
అంగారకుడి దృష్టి యుద్ధంపై, శుక్రుడి దృష్టి చమురు, గ్యాస్‌పై !ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుందా?
Sri Rama Navami Wishes In Telugu 2026: శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో చెప్పేయండి!
2026 శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో చెప్పేయండి!

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget