అన్వేషించండి

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. జనవరి 19 వరకూ వైకుంఠ ద్వార దర్శనాలు!

Tirumala News: తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాల రద్దీ కొనసాగుతోంది.. పండుగ సెలవుకు కూడా రావడంతో శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు...

Tirumala: వీకెండ్, సంక్రాంతి సెలవులు కలసిరావడంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జనవరి 10న మొదలైన వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులు క్యూ లైన్లలో నిల్చుని కలియుగ దైవాన్ని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి మొదటి మూడు రోజులకు ముందుగానే టోకెన్లు జారీ చేసిన టీటీడీ..ఆ తర్వాత నుంచి ముందురోజు టోకెన్లు ఇస్తోంది.వైకుంఠ ద్వార దర్శనాలు 19 వ తేదీవరకూ కొనసాగుతాయి. కేవలం ఆరు రోజుల్లో 4 లక్షల 8 వేల మంది భక్తులు శ్రీవారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. 

Also Read: తిరుమల ఆనందనిలయంలో ఏ ఏ విగ్రహాలు ఉన్నాయి - శ్రీవారితో పాటూ ఈ విగ్రహాలను గమనించారా!

సంక్రాంతి సెలవుల సందర్భంగా గురువారం వేకువజాము నుంచి శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. అర్థరాత్రి 12 గంటల వరకూ ఆలయాన్ని తెరిచి ఉంచిన అర్చకులు ధనుర్మాస కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గురువారం వేకువ జామునే మూడు గంటల 50 నిముషాల నుంచి వైకుంఠ ద్వార దర్శనాలకు వీఐపీలను అనుమతించారు. ఆ తర్వాత సర్వ దర్శనం భక్తులను అనుమతించారు.   గతంలో వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనాలు ఉండేవి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు పది రోజుల పాటూ దర్శన ఏర్పాట్లు చేశారు. అందులో భాగమే జనవరి 10 నుంచి 19 వరకూ వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులకు అనుమతి...

Also Read: ముస్లిం భక్తుడు సమర్పించిన బంగారు పూలతోనే దశాబ్ధాలుగా శ్రీవారికి అష్టదళ పద్మారాధన సేవ!

వైకుంఠ ఏకాదశి నుంచి ఆరోరోజు (జనవరి 15)..అధ్యయనోత్సవాల్లో భాగంగా తిరుమలలో ప్రణయ కలహోత్సవం ప్రణయ కలహోత్సవం  నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామి  మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అమ్మవార్లు చెరో పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా  నిల్చున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు ప్రణయకలహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం ఆస్థానం నిర్వహించి...శ్రీ నమ్మాళ్వార్‌ రచించిన ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలోని పాశురాలను నిందాస్తుతి శైలిలో పారాయణం చేశారు. రాత్రి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గోదా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శ్రీకృష్ణుడిని, ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను అలంకరించిన కళ్యాణ వేదికపైకి తీసుకొచ్చి వైభవంగా వేడుక నిర్వహించారు. మహా సంకల్పం, స్వామివార్లు- అమ్మవార్ల ప్రవర, మాంగల్యపూజ అనంతరం మాంగల్య ధారణ నిర్వహించారు.

వెంకటేశ్వర వజ్రకవచం (Sri Venkateshwara Vajra Kavacha Stotram)

(మార్కండేయ ఉవాచ)

నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం
ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ
సహస్ర శీర్షా పురుషో వెంకటేశ శ్శిరోవతు
ప్రాణేశ: ప్రాణనిలయః ప్రాణాన్ రాక్షతుమే హరి:
ఆకాశరాట్ సురానాధ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమ పయాద్దేహం మే వెంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగంబాజాని రీశ్వరః
పాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చుతు
య ఏతద్వజ్రకవచ మభేద్యం వెంకటేశితు:
సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
ఇతి మార్కండేయకృత వెంకటేశ్వర వజ్రకవచం

ఓం నమో వేంకటేశాయ

Also Read: ఏడాదిలో రోజుల సంఖ్య కన్నా తిరుమలేశుడి ఉత్సవాల సంఖ్యే ఎక్కువ!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget