By: ABP Desam | Updated at : 23 Jan 2022 07:16 AM (IST)
Edited By: RamaLakshmibai
Mystery Of Lord Krishnas Heart
కృష్ణుడు రాజ్య పాలన బాధ్యతలను విరమించుకుని అడవిలో చెట్టు కింద కూర్చుని ఉండగా బోయవాడు వేసిన బాణానికి అవతారం చాలిస్తాడు. కృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ సమయంలో దేహం మొత్తం దహనం అయింది కానీ గుండె మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోయిందంటారు. ఆ గుండెను తీసుకెళ్లి సముద్రంలో కలపగా అటుగా వచ్చిన వేటగాడు దాన్ని తీసుకుంటాడు. అప్పటికే నీలిరంగులో మారిపోయిన ఆ గుండెను తీసుకెల్లి ఓ దైవప్రసాదంగా భావించి ఓ గుహలో ఉంచి నిత్యం పూజచేస్తాడు. ఆ తర్వాత వేటగాళ్ల వారసుల నుంచి ఆ నీలిరంగు పదార్థాన్ని తీసుకున్న పూరీ రాడు... జగన్నాథ స్వామి విగ్రహంలో పెట్టిస్తాడట. ప్రతి పన్నెండేళ్లకు ఓసారి విగ్రహాలను మార్చినప్పుడు శ్రీకృష్ణుడి గుండెను కూడా మారుస్తారని చెబుతారు.
Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5
ఆ గుండెను మారుస్తున్నప్పుడు ఇప్పటివరకూ ఎవరైనా చూశారా అంటే... లేదనే చెప్పాలి. ఎందుకంటే పన్నెండేళ్లకు ఓసారి జగన్నాథుడి విగ్రహం మార్చేసమయంలో పూరీ నగరం మొత్తం చీకటి మయంగా మారుతుందట. నగరంలో విద్యుత్ నిలిపేస్తారట. CRPF సైన్యం అన్ని వైపుల నుంచి ఆలయ ప్రాంగణానని చుట్టుముడతారు...ఆ సమయంలో ఆలయంలోకి ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. దట్టమైన చీకటి ఉన్నప్పటికీ పూజారి కల్లకు గంతలు కట్టుకుంటాడు, చేతులకు తొడుగులు వేసుకుంటాడు. పాత విగ్రహం నుంచి ఆ బ్రహ్మపదార్థం ( శ్రీకృష్ణుడి గుండె) తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారు. వేల సంవత్సరాలుగా ఓ విగ్రహం నుంచి మరో విగ్రహానికి మారుతున్న ఈ బ్రహ్మపదార్థాన్ని ఇప్పటివరకూ ఎవ్వరూ చూడలేదు. ఏ పూజారిని అడిగినా వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాన్ని తాముకూడా ఫాలో అవుతున్నాం అంటారు కానీ అదేంటన్నది పూజారులు కూడా చెప్పలేరు. కొందరు పూజారులైతే.. ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అది కుందేలులా దూకుతున్నట్టు అనిపిస్తుందని, చేతిలో కదులుతూ ఉండే అనుభూతి కలుగుగుతుందని చెబుతారు.
శ్రీ కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత ద్వారక నీటమునిగిందని చెబుతారు. గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం తర్వాత 36 ఏళ్లకు కృష్ణుడు అవతారం చాలించగా... గాంధారి శాపంతో పాటూ సప్తరుషుల శాపం మేరకు ముసలం పుట్టి యాదవవంశం నాశనమైందని ఇంతకుముందు కథనాల్లో చెప్పుకున్నాం.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!
Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్లకు గుడ్న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట
Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు
Today Panchang 27 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం,దారిద్ర్యం నివారించే సిద్దిలక్ష్మీ స్తోత్రం
Horoscope Today 27th May 2022: ఈ రాశులవారికి అనారోగ్య సూచనలున్నాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!