అన్వేషించండి

Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా 2025లో రెండో అమృత స్నానం - యూపీ సర్కారు భారీ ఏర్పాట్లు

Maha Kumbh Mela 2025 : ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా రెండో అమృత స్నానం జనవరి 29న మౌని అమావాస్య రోజున జరుగుతుంది. ఇందుకోసం విచ్చేసే భక్తులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Maha Kumbh Mela 2025 : జనవరి 29న మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళా (Maha Kumbh Mela) లో రెండో అమృత స్నానం జరగనుంది. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేకంగా ఈ పవిత్ర స్నానం సందర్భంగా మరో వెయ్యి బస్సులను నడపాలని ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ (Uttar Pradesh Transport Department) నిర్ణయించింది. మౌని అవావాస్య రోజు 7వేల బస్సులు నడపాలని గతంలోనే నిర్ణయించినప్పటికీ.. భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున ఈ బస్సుల సంఖ్యను మరింత పెంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanadh) తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

భక్తుల కోసం బస్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు

మహా కుంభమేళాను పురస్కరించుకుని ప్రయాగ్ రాజ్ లో 9 తాత్కాలిక బస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ (Dayashankar Singh) ఆదేశించారు. ఈ స్టేషన్లలో బస, దుప్పట్లు, టీ వంటి తదితర సౌకర్యాలు ఉంటాయి. వీటితో పాటు బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ (First Aid Box)లు, అగ్ని మాపక భద్రతా పరికరాల ఏర్పాట్లను పటిష్టం చేయాలని, అంబులెన్స్ లు, క్రేన్ లను అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. మరో పక్క భక్తుల సౌకర్యాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే (Indian Railway) కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తేవడంతో పాటు నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది.

Also Read: మన పెద్దవాళ్లు ఎక్కడికీ ముగ్గురిని వెళ్లనివ్వరు, ఎందుకు - అసలు 3 అనే సంఖ్య శుభమా, అశుభమా - ఇందులో ఉన్న నిజమెంత ?

ప్రయాగ్ రాజ్ లో జరిగే మహా కుంభమేళాకు విచ్చేసే భక్తుల కోసం రైల్వే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాగ్ రాజ్ (Prayag Raj) తో పాటు చుట్టుపక్కల స్టేషన్లలోనూ సౌకర్యాలను పెంచింది. ఈ క్రమంలో ఢిల్లీలోని హౌరా రైలు మార్గంలో అత్యంత రద్దీగా ఉండే పండిట్ దీన్ దయాళ్ ఉపాద్యాయ్ జంక్షన్ నుంచి కుంభమేళాకు గంట గంటకూ ఓ ప్రత్యేక రైలు నడిచేలా ఏర్పాట్లు చేసింది.

కుంభమేళాలో స్నానమాచరించిన అమిత్ షా (Amit Shah)

ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబంతో కలిసి మహాకుంభమేళాకు వెళ్లారు. పవిత్ర త్రివేణి సంగమంలో ఆయన పుణ్య స్నానమాచరించారు. అనంతరం అమిత్‌ షాతో పాటు ఆయన మనుమడికి కూడా సాధు ప్రముఖలు తిలకం దిద్దారు. ఇకపోతే ఫిబ్రవరి 5వ తేదీన మహాకుంభమేళాకు ప్రధాని మోదీ (PM Modi) రానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అందుకు కావల్సిన ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

Also Read : SEBI New Chief: మాధబి పురి బచ్‌కు టాటా - సెబీ కొత్త ఛైర్మన్ పదవికి దరఖాస్తులు ఆహ్వానం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget