అన్వేషించండి

Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా 2025లో రెండో అమృత స్నానం - యూపీ సర్కారు భారీ ఏర్పాట్లు

Maha Kumbh Mela 2025 : ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా రెండో అమృత స్నానం జనవరి 29న మౌని అమావాస్య రోజున జరుగుతుంది. ఇందుకోసం విచ్చేసే భక్తులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Maha Kumbh Mela 2025 : జనవరి 29న మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళా (Maha Kumbh Mela) లో రెండో అమృత స్నానం జరగనుంది. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేకంగా ఈ పవిత్ర స్నానం సందర్భంగా మరో వెయ్యి బస్సులను నడపాలని ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ (Uttar Pradesh Transport Department) నిర్ణయించింది. మౌని అవావాస్య రోజు 7వేల బస్సులు నడపాలని గతంలోనే నిర్ణయించినప్పటికీ.. భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున ఈ బస్సుల సంఖ్యను మరింత పెంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanadh) తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

భక్తుల కోసం బస్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు

మహా కుంభమేళాను పురస్కరించుకుని ప్రయాగ్ రాజ్ లో 9 తాత్కాలిక బస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ (Dayashankar Singh) ఆదేశించారు. ఈ స్టేషన్లలో బస, దుప్పట్లు, టీ వంటి తదితర సౌకర్యాలు ఉంటాయి. వీటితో పాటు బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ (First Aid Box)లు, అగ్ని మాపక భద్రతా పరికరాల ఏర్పాట్లను పటిష్టం చేయాలని, అంబులెన్స్ లు, క్రేన్ లను అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. మరో పక్క భక్తుల సౌకర్యాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే (Indian Railway) కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తేవడంతో పాటు నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది.

Also Read: మన పెద్దవాళ్లు ఎక్కడికీ ముగ్గురిని వెళ్లనివ్వరు, ఎందుకు - అసలు 3 అనే సంఖ్య శుభమా, అశుభమా - ఇందులో ఉన్న నిజమెంత ?

ప్రయాగ్ రాజ్ లో జరిగే మహా కుంభమేళాకు విచ్చేసే భక్తుల కోసం రైల్వే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాగ్ రాజ్ (Prayag Raj) తో పాటు చుట్టుపక్కల స్టేషన్లలోనూ సౌకర్యాలను పెంచింది. ఈ క్రమంలో ఢిల్లీలోని హౌరా రైలు మార్గంలో అత్యంత రద్దీగా ఉండే పండిట్ దీన్ దయాళ్ ఉపాద్యాయ్ జంక్షన్ నుంచి కుంభమేళాకు గంట గంటకూ ఓ ప్రత్యేక రైలు నడిచేలా ఏర్పాట్లు చేసింది.

కుంభమేళాలో స్నానమాచరించిన అమిత్ షా (Amit Shah)

ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబంతో కలిసి మహాకుంభమేళాకు వెళ్లారు. పవిత్ర త్రివేణి సంగమంలో ఆయన పుణ్య స్నానమాచరించారు. అనంతరం అమిత్‌ షాతో పాటు ఆయన మనుమడికి కూడా సాధు ప్రముఖలు తిలకం దిద్దారు. ఇకపోతే ఫిబ్రవరి 5వ తేదీన మహాకుంభమేళాకు ప్రధాని మోదీ (PM Modi) రానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అందుకు కావల్సిన ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

Also Read : SEBI New Chief: మాధబి పురి బచ్‌కు టాటా - సెబీ కొత్త ఛైర్మన్ పదవికి దరఖాస్తులు ఆహ్వానం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 LSG Vs DC Result Update: ఢిల్లీని గెలిపించిన అశుతోష్.. క్యాపిటల్స్ అద్భుత విజ‌యం.. పూర‌న్, మార్ష్ విధ్వంస‌క ఫిఫ్టీలు
ఢిల్లీని గెలిపించిన అశుతోష్.. క్యాపిటల్స్ అద్భుత విజ‌యం.. పూర‌న్, మార్ష్ విధ్వంస‌క ఫిఫ్టీలు
AP Liquor Scam: దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
Revanth in delhi: ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
Nara Lokesh: ఉత్తరాంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్సిటీ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు
ఉత్తరాంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్సిటీ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs LSG Match Highlights IPL 2025 | సంచలన రీతిలో లక్నోపై గెలిచేసిన ఢిల్లీ | ABP DesamSunita Williams Return to Earth | నాసాకు కూడా అంతు చిక్కని Communication Blackout  | ABP DesamMS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 LSG Vs DC Result Update: ఢిల్లీని గెలిపించిన అశుతోష్.. క్యాపిటల్స్ అద్భుత విజ‌యం.. పూర‌న్, మార్ష్ విధ్వంస‌క ఫిఫ్టీలు
ఢిల్లీని గెలిపించిన అశుతోష్.. క్యాపిటల్స్ అద్భుత విజ‌యం.. పూర‌న్, మార్ష్ విధ్వంస‌క ఫిఫ్టీలు
AP Liquor Scam: దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
Revanth in delhi: ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
Nara Lokesh: ఉత్తరాంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్సిటీ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు
ఉత్తరాంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్సిటీ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
Gajwel Politics: కేసీఆర్‌పై అనర్హతా వేటు వేయాలని గజ్వేల్ కాంగ్రెస్ కార్యకర్తల పాదయాత్ర - చిల్లర రాజకీయం అని హరీష్ ఆగ్రహం
కేసీఆర్‌పై అనర్హతా వేటు వేయాలని గజ్వేల్ కాంగ్రెస్ కార్యకర్తల పాదయాత్ర - చిల్లర రాజకీయం అని హరీష్ ఆగ్రహం
Balabhadrapuram Cancer Cases:  బలభద్రపురానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసా, భారీగా వైద్య బృందాల మోహరింపు
బలభద్రపురానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసా, భారీగా వైద్య బృందాల మోహరింపు
Sunny Deol: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
Embed widget