అన్వేషించండి

Sabarimala Vanayatra: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..

'ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపం- అజ్ఞాన తిమిరమ్మునణుచు శుభదీపం..ఈ 4దిక్కులు 14భువనాలు పడిమెట్లుగా మారె ఇదో అపురూపం' అంటూ స్వామిని దర్శించుకుంటారు.మరి అయ్యప్ప సన్నిధి చేరేందుకు చేసే వనయాత్ర గురించి తెలుసా

మండల కాలంపాటు‘స్వామియే శరణమయ్యప్ప’అనే శరణు ఘోషతో సాగే  అయ్యప్ప దీక్ష మానవ జీవన సన్మార్గానికి బాటలు వేస్తుంది. కఠోర దీక్ష చేసి, ఇరుమడిని తలపై పెట్టుకుని పదునెట్టాంబడి మీదుగా అయ్యప్పను దర్శించుకోగానే తన్మయత్వం చెందుతారు. అయ్యప్ప దీక్షలో అతి ముఖ్య ఘట్టం వనయాత్ర. స్వామి సన్నిధానానికి చేరుకోగలిగే మార్గాల్లో ఇదొకటి. ఇరుముడిని తలపై ధరించి ‘కల్లుం ముల్లుం కాలికి మెత్తై .. స్వామికే’ అంటూ సాగే వనయాత్రతో కలిగే దివ్యానుభూతి వర్ణించలేం.  పుణ్య నదుల్లో స్నానం, కొండలు, అడవుల్లో ఉండే ఔషధ వృక్షాల నుంచి వీచే స్వచ్ఛమైన గాలివల్ల మనకు తెలియకుండానే శక్తివచ్చేస్తుందట. అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు ఎన్నో మార్గాలున్నా..అత్యంత ముఖ్యమైనది, అతి ప్రాచీనమైన మార్గం ఎరుమేలి నుంచి ప్రారంభమవుతుంది.  ఇది సాక్షాత్తూ అయ్యప్ప స్వామి నడిచి వెళ్లిన వనం అంటారు. 

ఎరుమేలి నుంచి అయ్యప్ప సన్నిధికి మార్గం ఇదే
ఎరుమేలి: ఎరుమేలి నుంచి వనయాత్ర మొదలవుతుంది. భక్తులు తమ శరీరానికి రంగులు పులుముకుని, పేటైకళంలో నృత్యం చేసి, పేటయిల్‌ శాస్తాను, వావరు స్వామిని, దర్శించుకుంటారు. వనంలో ప్రవేశించే తమకు తోడుగా రమ్మని ప్రార్థించి యాత్రను ప్రారంభిస్తారు. 

కోట్టైప్పడి: అయ్యప్ప స్వామికి ప్రథమ సేవకుడు, స్నేహితుడు వావరు స్వామి కొలువుదీరిన పుణ్యస్థలి కోట్టైపడి. ‘పేరూర్‌తోడు’అని పిలిచే ఈ ప్రదేశంలో కాలువల్లో చేపల ఆహారం కోసం మరమరాలు వేస్తుంటారు. 

Also Read: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. పెద్ద పాదం నడకకు రూట్ క్లియర్..
కాళైకట్టి: అయ్యప్ప స్వామి మహిషితో యుద్ధం చేస్తుండంగా సాక్షాత్తూ పరమశివుడు భువికి దిగొచ్చి తన వాహనం నందిని కట్టిన ఉంచి స్థలాన్ని మలయాళంలో కాళై అంటారు. ఇక్కడ అతి పురాతనమైన శివాలంయ ఉంది.  పృథ్వీకి దిగివచ్చి తన వాహనం నందిని కట్టి ఉంచిన స్థలం. మలయాళంలో నందిని ‘కాళై’ అంటారు. ఇక్కడ అతి పురాతన శివాలయం కూడా ఉంది.

అళుదా నది: అయ్యప్పతో యుద్ధం చేసిన మహిషి స్వామి బాణాలకు తాళలేక రోదిస్తూ కన్నీరు కార్చింది. ఆ కన్నీరు అక్కడ ప్రవహిస్తోన్న అలసా నదీలో కలవడం వల్ల దానికి అళుదానది పేరు వచ్చిందంటారు. ఈ నదిలో స్నానం చేసిన భక్తులు రెండు రాళ్లు తీసుకుని యాత్రామార్గంలో ఉన్న కళిడంకుండ్రులో విసురుతారు.

అళుదా మేడు: అళుదా నదిలో స్నానం తర్వాత భక్తులు ఎక్కే నిటారైన కొండే అళుదామేడు. సుమారు 5 కిలోమీటర్ల మేర ఉండే ఈ కొండ ఎత్తైన గుండ్రని రాళ్లతో ఉంటుంది. ఇక్కడ కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఉండదు. 

Also Read: మధుబన్ లో ఏం జరిగింది, సన్నీ లియోన్ సాంగ్ పై ఎందుకీ వివాదం..
కళిడంకుండ్రు
మహిషిని వధించిన స్వామి ఆమె కళేబరాన్ని ఆకాశంపైకి విసరగా అది నేలపై పడిన స్థలమే కళిడంకుండ్రు. బ్రహ్మహత్యా దోషం నుంచి బయటపడటానికి అళుదానదిలో స్నానమాచరిస్తున్న దేవతలు... మహిళి కళేబరం రోజురోజుకీ పెరగడం గమనించి ఆ నదిలోంచి తమ చేతికి దొరికిన రాళ్లను దానిపై వేసి సమాధి చేశారట. అందుకే ఆ నదిలో స్నానం చేసిన తర్వాత రెండు రాళ్లు తీసుకెళ్లి కిల్లుడుకుండ్రుంలో విసిరి మహిషి కళేబరానికి నమస్కరించి, హారతిచ్చి మళ్లీ యాత్ర సాగిస్తారు. 

ఇంజిప్పారకోట
కలిడుంకుండ్రు తర్వాత వనయాత్రలో చేరే ప్రాంతం ఇంజిప్పారకోట. ఇక్కడే అయ్యప్ప స్వామి ఉదయనుడు అనే బందిపోటు దొంగను హతమార్చారట. ఇక్కడ శిథిలమైన కోట అవశేషాలు కూడా ఉన్నాయి. ఇది భక్తులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం. 

కరిమల: ఎత్తైన ఈ కొండ నిట్టనిలువుగా ఉంటుంది. దాదాపు 10కిలోమీటర్లు ఎత్తుకు వెళ్లాక కరిమల శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. కరిమల ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టమయినా కానీ.. శరణుఘోష ముందు ఈ కష్టం దూది పింజలా తేలిపోతుందని చెబుతారు అయ్యప్ప భక్తులు. 

Also Read: అసలు గుడికి ఎందుకు వెళ్లాలి, ఇంత పరమార్థం ఉందా..!
పెరియాన వట్టం
కరిమల దిగిన తర్వాత చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం పెరియాన వట్టం. ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువ. వన్యమృగాలూ సంచరిస్తుంటాయి. చీకటి పడే సమయానికి ఈ ప్రాంతంలో ఉండకుండా ప్లాన్ చేసుకుంటారు స్వాములు. 

చెరియాన వట్టం
ఇక్కడి నుంచి భక్తులు పంబ వరకు విడిది ఏర్పాటు చేసుకుని వంటలు చేసుకుని, తిని విశ్రాంతి తీసుకుంటారు. 

పంబా నది
ఔషధ మూలికల సారంతో ప్రవహించే ఈ నదిలో స్నానం చేస్తే వనయాత్ర అలసట ఒక్కసారి మటుమాయమవుతుందంటారు. దీనినే దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే ఏడు తరాల వారు మోక్షం పొందుతారని నమ్మకం. సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే ఈ నదిలో స్నానమాచరించినట్టు పేర్కొంటారు. అందుకే పంబా తీరంలో రామ పాదాలు దర్శనమిస్తాయి. ఎరుమేలి నుంచి కాలినడకన వచ్చే వారూ, చాలక్కాయం మీదుగా వాహనాల్లో వచ్చేవారంతా ఇక్కడ కలుస్తారు.

Also Read: మంచి భర్త లభించాలన్నా.. సంసార జీవితం సంతోషంగా సాగాలన్నా ఈ నెలరోజులు చాలా ముఖ్యమట...
నీలిమల
సన్నిధానానికి త్వరగా చేరుకోవాలనే ఉత్సాహం, స్వామివారిని ఎంత త్వరగా దర్శించుకుంటామో అనే ఆతృత ఇక్కడి నుంచే మొదలవుతుంది.  రామాయణ కాలంలో దీనిని మాతంగవనం అని పిలిచేవారు. కరిమల కంటే నీలిమల ఎక్కడం ఎంతో కష్టం అంటారు కొందరు భక్తులు.

అపొచ్చిమేడు
దుర్దేవతల ప్రీతికోసం నీలిమల శిఖరం రెండు వైపులా ఉన్న లోయలో భక్తులు బియ్యపు ఉండలు విసురుతారు.  కపట భక్తులకు ఆత్మ ప్రభోద కల్పించేందుకు దేవతలు ఇక్కడ వేచి ఉంటారని భక్తుల విశ్వాసం. 

శబరిపీఠం
శబరిమాత నిర్గుణోపాసనతో అయ్యప్పస్వామి దర్శనం పొందిన ప్రదేశం. శబరిమాత పేరుతో ఇక్కడ విద్యాపీఠం ఏర్పాటు చేసి, పందళ రాజవంశీయులు విద్యాభ్యాసం చేశారని, ఈ ప్రదేశానికి 5వేల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు.

Also Read:కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
శరంగుత్తి
తొలిసారి అయ్యప్పస్వామి మాల ధరించిన భక్తులను కన్నెస్వాములు అంటారు. కన్నెస్వాములు వనంలోని రక్షాదండంగా ఎరుమేలి నుంచి తెచ్చిన శరాలను ఇక్కడ రావి వృక్షంలో గుచ్చుతారు. అప్పటి వరకూ మనకు మార్గం చూపి, వెన్నంట నడిచిన కరుప్పస్వామి అక్కడే ఆగిపోతారని ప్రతీతి.

పదినెట్టాంబడి
వనయాత్రలో అత్యంత ముఖ్యమైనది పదినెట్టాంపడి ఘట్టం. పవిత్రత నిండిన దైవాంశమైన మూడార్ల సోపానాలనీ, ముక్తికి మెట్లనీ వీటిని అంటారు. మండల కాల దీక్షా వ్రతం లేని వారు ఈ మెట్లను ఎక్కడానికి అర్హులు కారు. మెట్లు ఎక్కేముందు కొబ్బరికాయ కొట్టి, కరుప్పస్వామి, కరుప్పాయమ్మలకు నమస్కరించి..ఇరుముడి తలపై ధరించి శరణుఘోషతో మెట్లెక్కాలి.  యాత్రలో ఎక్కేటప్పుడు ఒకసారి, దిగే సమయంలో మరోసారి మాత్రమే ఈ మెట్లను ఉపయోగించాలి.

సన్నిధానం
ఇరుముడితో పదినెట్టాంబడి దాటి సన్నిధానంలోనికి ప్రవేశించిన భక్తులకు మొదట ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆ తర్వాత మణి మండపం, కన్నిమూల గణపతి, సర్పరాజును దర్శిస్తూ ప్రదక్షిణగా వచ్చి చిన్ముద్ర ధారియై ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుని తరిస్తారు. దర్శనానంతరం ఇరుముడి విప్పి అందులో ఉన్నవన్నీ స్వామివారికి అర్పించి.. టెంకాయ కొట్టి అందులో నేతిని స్వామి అభిషేకానికి సమర్పించి.. ఆ కొబ్బరికాయను పదునెట్టాంబడి సమీపంలో  ఉన్న భస్మకుళంలో వేస్తారు. 

ఎరుమేలి నుంచి స్వామి సన్నిధికి చేరడానికి ఇన్ని దాటుకుని రావాలా అని అనుకున్నా.. ఒక్కసారి స్వామివారి దర్శనం జరిగిన తర్వాత ఆ కష్టం ఒక్క క్షణం కూడా గుర్తుకురాకపోగా.. ఈ జీవితానికి ఇంకేం కావాలి అనిపిస్తుందంటారు అయ్యప్ప భక్తులు. అందుకే జీవిత కాలంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలని చెబుతారు. 

Also Read: చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి..
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

వృశ్చిక రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, ఈ వారం మీరు చేసే ఓ పొరపాటు ప్రత్యర్థులకు అవకాశం కల్పిస్తుంది!
వృశ్చిక రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, ఈ వారం మీరు చేసే ఓ పొరపాటు ప్రత్యర్థులకు అవకాశం కల్పిస్తుంది!
తులారాశి వారఫలాలు ఆగస్టు 9-15: ఈ వారంలో మీరు తీసుకునే ఓ నిర్ణయం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది!
తులారాశి వారఫలాలు ఆగస్టు 9-15: ఈ వారంలో మీరు తీసుకునే ఓ నిర్ణయం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది!
కన్యా రాశి వారఫలాలు ఆగస్టు 9-15: గ్రహాల నుంచి అనుకూల సంకేతం! నిలిచిపోయిన పనులు వేగవంతం!
కన్యా రాశి వారఫలాలు ఆగస్టు 9-15: గ్రహాల నుంచి అనుకూల సంకేతం! నిలిచిపోయిన పనులు వేగవంతం!
09-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
09-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget