అన్వేషించండి

Salaar Like Story in Mahabharata: మహాభారతంలో సలార్ లాంటి స్టోరీ - ఒక్క అవమానం ఇద్దరి స్నేహితుల తలరాతను మార్చేసింది!

Salaar Like Story in Mahabharata: అహం సంబంధాలను నాశనం చేస్తుందని.. క్రమశిక్షణ, సహనం, గౌరవం విజయానికి మార్గం సుగమం చేస్తాయని ద్రోణాచార్యుడు, ద్రుపదుడి కథ బోధిస్తుంది. స్నేహితులు శత్రువులు ఎలా అయ్యారు?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ద్రోణుడు-ద్రుపదుడు బాల్యమిత్రులు, రాజుగా ద్రుపదుడు ద్రోణుని అవమానించాడు.
  • ద్రోణుని గురుదక్షిణగా ద్రుపదుని పట్టుకునే ప్రయత్నంలో కౌరవులు ఓడారు.
  • అర్జునుడు ద్రుపదుని బంధించి, రాజ్యం రెండుగా చీల్చబడింది.
  • ప్రతీకారం కోసం ద్రుపదుడు యాగం, దృష్టద్యుమ్నుడు జన్మించాడు.

Salaar Story in Mahabharata: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ సలార్ స్టోరీ తెలుసుకదా... ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు అనే బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కిన మూవీ. త్వరలో సలార్ - పార్ట్ 2 రాబోతోంది. అయితే ఈ మూవీ కథకు మూలం ఇదేనా అనిపించేలాంటి స్టోరీ మహాభారతంలో ఉంది. అదే  ద్రోణాచార్యుడు, ద్రుపదుడు మధ్య వైరం. మహాభారతంలో ఇది ప్రముఖ ఘట్టం.

బాల్య మిత్రులు

ద్రోణుడు-ద్రుపదుడు ఇద్దరూ బాల్యమిత్రులు. భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఇద్దరూ విద్య అభ్యసించారు. ఆ సమయంలో ద్రుపదుడు వాగ్ధానం చేశాడు..నేను రాజు అయిన తర్వాత నా రాజ్యం నీతో పంచుకుంటాను అని. 

కొన్నాళ్ల తర్వాత..

పేదవాడైన ద్రోణుడు..తన భార్య కృపి, కొడుకు అశ్వత్థాముడి కోసం సహాయం కోరుతూ ద్రుపదుడి వద్దకు వెళ్లాడు. ఇచ్చిన వాగ్ధానం మరిచిపోయిన ద్రుపదుడు.. ద్రోణుడిని అవమానించాడు. స్నేహం ఎప్పుడూ సమానుల మధ్యే ఉంటుంది.. నువ్వు బ్రాహ్మణుడిని, నేను రాజును.. మనం సమానులం కాదని చెప్పి ఓ గోవుని బహుమతిగా ఇచ్చి పంపించేశాడు. ఈ అవమానం ద్రోణుడి హృదయంలో నాటుకుపోయింది.

ప్రతీకారం మొదలు..

హస్తినాపురం చేరుకున్న ద్రోణాచార్యుడు పాండవులు, కౌరవులకు గురువుగా మారాడు. విద్యలు నేర్పించారు. ఆ తర్వాత గురుదక్షిణగా    పాంచాల రాజు ద్రుపదుడిని తీసుకురావాలని కోరాడు.  ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, సంవత్సరాల క్రితం జరిగిన అవమానానికి ప్రతీకారం కూడా. 

పాంచాల రాజుతో యుద్ధం

గురువు ఆజ్ఞలు విన్న వెంటనే, కౌరవులు, పాండవులు ఇద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు.  దుర్యోధనుడు, కర్ణుడు, ఇతర కౌరవ యోధులు ద్రుపదుడిని సులభంగా ఓడించగలమనే నమ్మకంతో, ఒక భారీ సైన్యాన్ని నడిపించి పాంచాల రాజ్యంపై దాడి చేశారు. అయితే, పాంచాల సైన్యం గట్టి ప్రతిఘటనను ఎదుర్కోవడంతో, యుద్ధ గమనం మారడం ప్రారంభమైంది. ద్రుపద మహారాజు స్వయంగా యుద్ధభూమిలోకి ప్రవేశించి అద్భుతమైన శౌర్యాన్ని ప్రదర్శించాడు. అతని బాణాలు, యుద్ధ నైపుణ్యం కౌరవ సైన్యాన్ని అడ్డుకోలేకపోయాయి. దుర్యోధనుడు, అతని సహచర యోధులు వెనుదిరగవలసి వచ్చింది. కౌరవుల ఈ ఓటమి అందరికీ పెద్ద దెబ్బగా పరిణమించింది. 

రంగంలోకి అర్జునుడు

కౌరవుల వైఫల్యాన్ని చూసి, అర్జునుడు యుద్ధ పరిస్థితిని అంచనా వేశాడు. కేవలం సైన్యంతో పోరాడటం సరిపోదని అతను గ్రహించాడు. అర్జునుడు తన సోదరులతో కలిసి, ద్రుపదుడిని నేరుగా సమీపించి పట్టుకోవడానికి ఒక వ్యూహాన్ని రచించాడు. యుద్ధ సమయంలో, భీమసేనుడు తన గదను ధరించి శత్రు సైన్యంపై దాడి చేశాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు భయభ్రాంతులకు గురయ్యాయి. పాంచాల సైన్యంలోని చాలా మంది యోధులు భయభ్రాంతులకు గురయ్యారు. భీముని ఈ భయంకరమైన రూపం పాండవుల విజయానికి మార్గం సుగమం చేసింది. అర్జునుడు, ద్రుపద మహారాజు యుద్ధభూమిలో ఒకరినొకరు ఎదుర్కొన్నారు. ఇరువైపుల నుంచి బాణాల వర్షం కురిసింది. ద్రుపదుడు తన సర్వశక్తులు ఒడ్డి పోరాడాడు, కానీ అర్జునుడి సాటిలేని ధూపవిద్య ముందు అతని వ్యూహం తడబడటం ప్రారంభమైంది. యుద్ధంలో నిర్ణయాత్మక ఘట్టం ఇప్పుడు సమీపించింది. అర్జునుడు తన పదునైన, గురితప్పని బాణాలతో ద్రుపదుని ధనుస్సును ఖండించాడు. ఆ తరువాత వేగంగా కదిలి, రాజును చుట్టుముట్టి బంధించాడు. పాంచాల సైన్యం తమ రాజును రక్షించడంలో విఫలమైంది. ఈ విధంగా, గురుదక్షిణ నెరవేర్చే దిశగా అతిపెద్ద అడుగు పడింది. 

రెండుగా చీలిన పాంచాల రాజ్యం

అర్జునుడు బందీగా ఉన్న ద్రుపదుడిని ద్రోణాచార్యుడి ముందుకు తీసుకువచ్చాడు. ద్రోణుడు తన పాత మిత్రుడికి, గతంలో అతను చేసిన స్నేహ ద్రోహాన్ని గుర్తు చేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడి రాజ్యంలో సగభాగాన్ని స్వాధీనం చేసుకుని, మిగిలిన సగభాగాన్ని తిరిగి ఇచ్చేశాడు. ఈ సంఘటన వారిద్దరి మధ్య కొత్త శకానికి శత్రుత్వానికి పునాది వేసింది. 

ద్రుపదుడి యాగం

ద్రోణుడిపై పగ పెంచుకున్న ద్రుపదుడు..తనను చంపగల సమర్థుడికోసం యాగం చేశాడు. ఆయాగం ఫలితంగా దృష్టద్యుమ్నుడు ( ద్రౌపది సోదరుడు) జన్మించాడు. కురుక్షేత్రం సంగ్రామంలో ద్రోణుడిని చంపినది ధృష్టద్యుమ్నుడే.

ద్రోణాచార్యుడు, ద్రుపదుడి ఈ కథ స్నేహంలో అహంకారానికి, అగౌరవానికి అవకాశం ఇవ్వకూడదని తెలియజేస్తుంది. విజయం కేవలం బలంతో కాకుండా, క్రమశిక్షణ, అంకితభావం ,సరైన వ్యూహంతోనే సాధ్యమవుతుందని అర్జునుడి ఉదాహరణ బోధిస్తుంది.  

బాధలో, కష్టంలో ఉన్నప్పుడు 'భగవద్గీత' ఎందుకు చదవమంటారు!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.  

Frequently Asked Questions

ద్రోణుడు, ద్రుపదుడు బాల్యంలో ఎలా ఉండేవారు?

ద్రోణుడు, ద్రుపదుడు బాల్యమిత్రులు. భరద్వాజ మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసేటప్పుడు, రాజు అయిన తర్వాత రాజ్యం పంచుకుంటానని ద్రుపదుడు ద్రోణుడికి వాగ్దానం చేశాడు.

ద్రోణుడు సహాయం కోసం ద్రుపదుడి వద్దకు వెళ్ళినప్పుడు ఏమి జరిగింది?

పేదవాడైన ద్రోణుడు తన భార్య, కుమారుడి కోసం సహాయం కోరగా, ద్రుపదుడు తన వాగ్దానాన్ని మరిచిపోయి ద్రోణుడిని అవమానించాడు. స్నేహం సమానుల మధ్యే ఉంటుందని చెప్పి, ఒక గోవును ఇచ్చి పంపించేశాడు.

ద్రోణాచార్యుడు గురుదక్షిణగా ఏమి కోరాడు? అర్జునుడు దానిని ఎలా నెరవేర్చాడు?

ద్రోణాచార్యుడు గురుదక్షిణగా పాంచాల రాజు ద్రుపదుడిని బందీగా తీసుకురావాలని కోరాడు. కౌరవులు విఫలమయ్యాక, అర్జునుడు తన వ్యూహంతో ద్రుపదుడిని యుద్ధంలో ఓడించి బంధించాడు.

ద్రోణుడి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ద్రుపదుడు ఏమి చేశాడు?

ద్రోణుడిపై పగ పెంచుకున్న ద్రుపదుడు, అతడిని చంపగల సమర్థుడి కోసం యాగం చేశాడు. ఆ యాగం ఫలితంగా ధృష్టద్యుమ్నుడు జన్మించాడు, ఇతడు కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుడిని చంపాడు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget