అన్వేషించండి

Bhagavad Gita: బాధలో, కష్టంలో ఉన్నప్పుడు 'భగవద్గీత' ఎందుకు చదవమంటారు!

UNESCO Honors Bhagavad Gita: కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు భగవద్గీత చదివితే ఉపశమనం లభిస్తుందని ఎందుకు చెబుతారు? భగవద్గీతలో ఏముంది?

Why You Should Read The Bhagavad Gita

ఎవరైనా ఏదైనా విషయం గురించి తీవ్రమైన ఆలోచనలో ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు ఓ చిన్నమాట చాలు స్వాంతన చేకూరుతుంది

ఎందుకీ జీవితం అనిపించినప్పుడు ఓ చిన్న సూక్తి చాలు.. మొత్తం ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది

సమస్యలు, బాధలు లేని మనిషి అనేవాడు భూమ్మీద ఉంటాడా అసలు? 

అందుకే సమస్య రాకూడదు అనుకోకూడదు..వచ్చిన సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి

అదెలా అనేది నేర్పించేది..వేలుపట్టి నడిపించేదే భగవద్గీత..అందుకే బాధలో ఉన్నప్పుడు భగవద్గీత చదవాలి అని చెబుతారు

శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి...రాజ్యం కోసం వీరిని  వధించాలా అనే బాధతో యుద్ధరంగం నుంచి వెళ్లిపోవాలి అనుకుంటాడు. ఆ సమయంలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు బోధించిన బ్రహ్మజ్ఞానమే భగవద్గీత. ఇది మతగ్రంధం కాదు..మనిషి ఎలా బతకాలో సూచించే గ్రంధం. ఇందులో శ్లోకాలు అన్నీ చదివినా లేకున్నా కొన్నిటి శారాంసం తెలుసున్నా చాలు..

శ్లోకం
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః||

దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించటం  అనుచితం.  వివేకవంతులు అనిత్యములైన శరీరం గురించి కానీ ,  శాశ్వతం అయిన ఆత్మ గురించి కానీ దుఃఖించరాదు.

శ్లోకం
దేహినోऽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి ||

శరీరానికి బాల్యం, యవ్వనం, ముసలితనం ఎలానో జీవుడికి మరో దేహం పొందడం కూడా అంతే. అందుకే ఈ విషయంపై ధీరులు మోహం పెంచుకోరు

శ్లోకం
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోऽపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణా- న్యన్యాని సంయాతి నవాని దేహీ

చినిగిన వస్త్రాలు విడిచి నూతన వస్త్రాలు ఎలా వేసుకుంటారో  ఆత్మ కూడా జీర్ణమైన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది

శ్లోకం
నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః|
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః||

ఆత్మకు నాశనం లేదు, ఆత్మను ఎంత పదునైన శస్త్రాలు  కూడా చేధించలేవు. ఆత్మ అగ్నిలో కాలదు, నీటిలో తడవదు, గాలి నిలువరించలేదు...అందుకే ఆత్మకు నాశనం లేదు

శ్లోకం
జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ|
తస్మాదపరిహార్యేऽర్థే న త్వం శోచితుమర్హసి|| 

జన్మించిన వారికి మరణం తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.

 శ్లోకం
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి|| 

కర్మలను ఆచరించుట యందే నీకు అధికారం ఉందికానీ కర్మ ఫలితముపై లేదు. నీవు కర్మఫలమునకు కారణం కాకూడదు .అలా అని కర్మలను చేయుట మానరాదు.

శ్లోకం
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే|| 

దుఃఖం కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖం  కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడ... రాగం, భయం , క్రోధం లేనివారినే  స్థితప్రజ్ఞుడు అంటారు

శ్లోకం
ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోऽభిజాయతే|| 
 
విషయవాంఛల గురించి నిత్యం మననం చేసేవారికి రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధంగా మాపుతుంది. క్రోధం వల్ల అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితంగా బుద్ధిని కోల్పోయి అధోగతి చెందుతారు

శ్లోకం
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాస్యామన్తకాలేऽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి|| 

ఆత్మజ్ఞానపూర్వక కర్మానుసారం  బ్రహ్మప్రాప్తిసాధనం కలిగిన జీవుడు సంసారంలో పడకుండా సుఖ స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget