అన్వేషించండి

Kurma Jayanti Date 2025: కూర్మ జయంతి ప్రత్యేకం - సుదర్శన చక్రంతో ఏర్పడిన ఈ శ్వేతగుండంలో స్నానమాచరిస్తే చాలు!

Kurma Avatar Kurma Jayanti 2025: ఏటై వైశాఖ పౌర్ణమి రోజు కూర్మ జయంతి జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు ఈ అవతారం ఆంతర్యం, కూర్మ జయంతికి ఉన్న ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలుసుకోండి

Kurma Avatar Kurma Jayanti Date 

మంధనాచల ధారణ హేతో
దేవాసుర పరిపాలవిభో 
కూర్మాకార శరీర నమో
భక్తం తే పరిపాలయమామ్

కృతయుగంలో దేవ, దానవులు అమృతం కోసం క్షీరసాగరం మధించడం ప్రారంభించారు. మందరగిరిని కవ్వంగా , వాసుకిని తాడుగా చేసుకుని చిలికారు.  ఆ సమయంలో మందరపర్వతం కిందకుజారిపోతూ సాగర మధనానికి ఆటంకం కలిగించింది. దాన్నుంచి బయటపడేలా దీవించమని దేవతలంతా శ్రీ మహావిష్ణువుని పూజించారు. అప్పుడు నారాయణుడు కూర్మరూపంలో మందరగిరి కిందకు చేరి తన వీపుపై మోసాడు. ఇలా ఉద్భవించిందే కూర్మావతారం.   

2025 లో కూర్మజయంతిని మే 12 సోమవారం జరుపుకుంటారు
 
ఏటా వైశాఖ పూర్ణిమ రోజు కూర్మజయంతి జరుపుకుంటారు. ఈ రోజు వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకూర్మంలో వైశాఖ పూర్ణిమరోజు కూర్మజయంతి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు.  ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయం ఇది. శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకాకుళం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున కొలువయ్యాడు కూర్మనాథుడు. కృతయుగంలో శ్వేతరాజు ఆయన భార్య    వంశధారల తపస్సుకు మెచ్చిన కూర్మనాథుడు ఈ క్షేత్రంలో పశ్చిమాభిముఖంగా వెలిశాడు. ఈ క్షేత్రం గురించి కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాల్లో ఉంది. ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలుంటాయి. ఈ రెండు ధ్వజస్తంభాలు శివకేశవులకు ప్రతీకలుగా చెబుతారు. 

శ్రీకూర్మం దేవాలయంలో మూలవిరాట్టు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ప్రతిష్టించాడట.ఇక్కడున్న పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. స్వామివారి చేతిలో ఉన్న సుదర్శనచక్రంతో పుష్కరిణి వచ్చిందట. అందుకే ఈ గుండంలో స్నానం ఆచరిస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వసిస్తారు. ఏటా వైశాఖ పౌర్ణమ రోజు, హోలీ పౌర్ణమి రోజు ఆలయంలో భాీగా ఉత్సవాలు జరుగుతాయి.  

శ్రీకూర్మం ఆలయం ఎవరు నిర్మించారన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు కానీ ఏడో శతాబ్ధంలో వెలుగులోకి వచ్చింది..అప్పటి నుంచి  తరతరాలుగా రాజవంశాలు అభివృద్ధి చేస్తూ వచ్చాయి.  కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశ పాలనలో శ్రీ కూర్మం అభివృద్ధి చెందింది. ఆదిశంకరాచార్యులు,  రామానుజాచార్యులు, మధ్వాచార్యుల శిష్యులు వీరంతా శ్రీ కూర్మాన్ని సందర్శించారు.ఆలయం పైభాగం అష్టదళ పద్మాకారంలో ఆకట్టుకునేలా ఉంటుంది.  శిల్పకళ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే..రాతి స్తంభాలు ఏవీ కూడా ఒకదానితో మరొకటి పోలి ఉండదు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేవారంతా అక్కడి నుంచి శ్రీకూర్మం వెళ్లొస్తారు. శ్రీకాకుళం చేరుకుంటే అక్కడి నుంచి బస్సు, కారు సౌకర్యాలున్నాయి.

ప్రతి పౌర్ణమికి సముద్రస్నానం ఆచరిస్తారు హిందువులు.  పౌర్ణమి రోజు సముద్రస్నానం ఆచరిస్తే ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని విశ్వసిస్తారు.
పౌర్ణమి రోజు ఉండే నక్షత్రం ఆధారంగా నెలల పేర్లు ఏర్పరుచుకున్నాం...వాటి అనుగుణంగానే వ్యవసాయ పనులు కొనసాగిస్తారు. 
పౌర్ణమి రోజు చంద్రుడి ప్రభావం మనసుపై ఉంటుంది..అందుకే ఆ మనసుని స్థిరంగా ఉంచేందుకే ప్రత్యేక పూజలు, జపాలు చేస్తారు

వైశాఖపూర్ణిమను మహావైశాఖిగా పిలుస్తారు. ఈ రోజు సముద్రస్నానం ఆచరిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. వైశాక పౌర్ణమి రోజు మహావిష్ణుని ఆరాధిస్తారు, ఈ రోజు కొందరు  సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. వేసవికాలం కాబట్టి  ఆహారం, నీటి కుండ, గొడుగు, చెప్పులు దానం చేస్తే అత్యంత పుణ్యఫలం.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget