అన్వేషించండి

Khairatabad Ganesh immersion: గంగమ్మ ఒడికి చేరుకున్న విశ్వశాంతి మహాశక్తి గణపతి - భక్తి ఉత్సాహంతో సాగనంపిన భక్తులు!

Ganesh immersion : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనుకున్న విధంగా పూర్తి అయింది. భక్తులు ఆనంద ఉత్సాహాలతో గంగమ్మ ఒడికి విశ్వశాంతి మహాశక్తి గణపతిని సాగనంపారు.

Khairatabad Ganesh immersion completed :ఖైరతాబాద్ బడా గణేశుని నిమజ్జన శోభాయాత్ర 2 భక్తి ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగింది.  69 అడుగుల ఎత్తైన విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహం నిమజ్జన శోభాయాత్ర  నిర్విఘ్నంగా పూర్తి అయింది.  71వ ఏడాది జరుపుకుంటున్న ఈ గణేశోత్సవం, లక్షలాది భక్తులను ఆకర్షించింది. హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం కోసం ఈ శోభాయాత్ర ఉదయం 7:44 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి బయలుదేరింది. మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో క్రేన్ నెంబర్ 4  వద్ద నిమజ్జనం పూర్తి అయింది. 

లక్షలాది మంది భక్తులు గణేశుడికి వీడ్కోలు పలికారు. గంగమ్మఒడికి సాగనంపారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు 69 అడుగుల ఎత్తుతో "విశ్వశాంతి మహాశక్తి గణపతి" థీమ్‌తో రూపొందించారు.  విగ్రహం చుట్టూ పూరీ జగన్నాథ్ స్వామి, లలితా త్రిపుర సుందరి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలు ఏర్పాటు చేశారు.   ఇవి శోభాయాత్రకు అదనపు ఆకర్షణను జోడించాయి. శోభాయాత్ర ఖైరతాబాద్ మండపం నుంచి సెక్రటేరియట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా హుస్సేన్ సాగర్‌లోని క్రేన్ పాయింట్ నంబర్ 4 వద్దకు చేరుకున్న తరవాత నిమజ్జనం  పూర్తి అయింది. 

శోభాయాత్ర ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, శుక్రవారం రాత్రి భక్తుల భారీ రద్దీ కారణంగా వెల్డింగ్ పనులు ఆలస్యమవడంతో గంట విళంబంగా 7:44 గంటలకు బయలుదేరింది. "గణపతి బప్పా మోరియా" నినాదాలు, డప్పు చప్పుళ్లు, సాంప్రదాయ నృత్యాలతో శోభాయాత్ర ఉత్సాహకర వాతావరణంలో సాగింది. రోడ్ల వెంట, ఇళ్ల పైకప్పులపై భక్తులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే అనుకున్న సమయానికే నిమజ్జనం పూర్తి చేసేందుకు వేగంగా  యాత్రను కొనసాగించారు.  శోభాయాత్ర 2.5 కిలోమీటర్ల దూరంలో హుస్సేన్ సాగర్‌లోని నిమజ్జన పాయింట్‌కు మధ్యాహ్నం 1 గంటలకు చేరుకుంది. ఒకటిన్నరకల్లా నిమజ్జనంపూర్తి అయింది. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశ విగ్రహం సహజ మట్టి, సేంద్రీయ రంగులు, గడ్డి ఊకతో రూపొందించారు. 

ట్యాంక్ బండ్ పై మొత్తం   134 స్టాటిక్ క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జన ప్రక్రియ కోసం ఏర్పాటు చేశారు.  హుస్సేన్ సాగర్‌లో సుమారు 50,000 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి, ఈ ప్రక్రియ 40 గంటలపాటు కొనసాగుతుందని అధికారులు అంచనా వేశారు.  హుస్సేన్ సాగర్‌తో పాటు 20 ప్రధాన సరస్సులు, 72 కృత్రిమ కొలనులలో నిమజ్జనం జరిగేలా GHMC ఏర్పాట్లు చేసింది, దీనివల్ల సహజ జలవనరులపై ఒత్తిడి తగ్గింది.  

ఖైరతాబాద్ బడా గణేశుని నిమజ్జన శోభాయాత్ర హైదరాబాద్‌లో భక్తి, సాంస్కృతిక సంబరాలకు ప్రతీకగా నిలిచింది. లక్షలాది భక్తులు, భారీ భద్రత, పర్యావరణ హిత ఏర్పాట్లతో ఈ ఉత్సవం దేశవ్యాప్తంగా ఆదర్శనీయంగా మారింది. ఈ శోభాయాత్ర హైదరాబాద్ యొక్క సామాజిక, సాంస్కృతిక ఐక్యతను ప్రతిబింబిస్తూ, భక్తులకు మరపురాని అనుభవాన్ని అందించింది.           

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vastu Tips for Puja Room: ఇంట్లో పూజ గదికి సంబంధించి ముఖ్యమైన వాస్తు నియమాలు - మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో!
ఇంట్లో పూజ గదికి సంబంధించి ముఖ్యమైన వాస్తు నియమాలు - మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో!
శని అనుగ్రహం పొందడం అత్యంత సులభం! మీ జీవితంలో మార్పులు తెచ్చే రహస్యాలు, పరిహారాలు తెలుసుకోండి!
శని అనుగ్రహం పొందడం అత్యంత సులభం! మీ జీవితంలో మార్పులు తెచ్చే రహస్యాలు, పరిహారాలు తెలుసుకోండి!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!
Car Number Plate Astrology: మీ కారు/బైక్ నంబర్ ప్లేట్ లో మీ అదృష్టం! సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోండి!
మీ కారు/బైక్ నంబర్ ప్లేట్ లో మీ అదృష్టం! సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోండి!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Embed widget