అన్వేషించండి

Karnataka Hasanamba Temple: ఈ అత్తా - కోడలు ఓ దగ్గరికి చేరితే యుగాంతమే - సైన్స్ కి అందని మిస్టరీ ఇది!

The Story of Miracles:హాసనాంబ పేరులోనే నవ్వుంది..అమ్మవారి రూపం కూడా చిరుమందహాసంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో ఛేదించలేని రహస్యాలెన్నో. ఏడాదికి ఏడు రోజులు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయం విశిష్టత మీకోసం

Mystery Behind The Hasanamba Temple: కర్ణాటక రాష్ట్రంల హాసన్ నగరంలో కొలువైన అమ్మవారు హాసనాంబ. సప్త మాతృకలలో ఈమె ఒకరు. అమ్మవారి ఏడు రూపాలనే సప్తమాతృకలు అంటారు..వారే..బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారీ, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. ఈ ఏడుగురు ఓసారి  భూలోక సంచారానికి వచ్చినప్పుడు దక్షిణభారతదేశంగుండూ వెళుతూ హాసన్ పట్టణం అందాలు చూసి ముగ్ధులై అక్కడే కొలువై ఉండాలనుకున్నారు. మహేశ్వరి, కౌమారీ, వైష్ణవి...జమ్ము కశ్మీర్ కాట్రాలో కొలువయ్యారు. హాసన్ నగరంలో కూడా హాసనాంబ ఆలయంలో మూడు చీమల పుట్టలుగా ఉన్నారని చెబుతారు. ఇక ఇంద్రాణి, వారాహి, చాముండి  దేవిగెరే హోండాలో ఉన్న మూడు బావుల్లో కొలువుండగా...బ్రాహ్మీ మాత్రం హాసన్ నగరంలోనే ప్రతిష్టితమైంది.  అందుకే ఈ అమ్మవారిని హాసనాంబ అని పిలుస్తారు.

Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!

ఏడాదికి 12 రోజులు దర్శనం

హాసనాంబ ఆలయంలో ప్రధాన గోపురం ద్రావిడ శైలిలో నిర్మించారు. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించేందుకు వచ్చిన ముగ్గురు దొంగలు మూడు రాళ్లుగా మారిపోయారని చెబుతారు...ఆలయంలో ఈ రాళ్లు చూడొచ్చు.  ఇక్కడ అమ్మవారికి ఎన్నో మహిమలున్నాంటారు భక్తులు. ఏటా ఆశ్వయుజమాసం చివర్లో ఏడు రోజుల పాటు ఆలయాన్ని తెరుస్తారు. అంటే దీపావళికి ఆరు రోజుల ముందు ఈ ఆలయాన్ని తెరిచి ప్రత్యేకపూజలు చేసి భక్తులను అనుమతించి...దీపావళి జరిగిన మర్నాడు..కార్తీకమాసం మొదటి రోజు అయిన బలిపాడ్యమి రోజు మూసివేస్తారు. డిప్యూటీ కమిషనర్ సమక్షంలో కానీ  స్థానిక మంత్రి ఆధ్వర్యంలో కానీ ఆలయాన్ని 12 రోజుల పాటూ తెరిచి ప్రత్యేకపూజలు చేస్తారు. ఈ సమయంలో భక్తుల తాకిడిని నియంత్రించేందుకు దాదాపు 1200 మంది పోలీసులు బందోబస్తు ఉంటుంది.  

ఇప్పటికీ వీడని మిస్టరీ

ఒక్కో దేవాలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. చాలా ఆలయాల్లో వీడని చిక్కుముడులెన్నో. శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసినా అంతుచిక్కని రహస్యాలెన్నో. హాసనాంబ దేవాలయంలోనూ అలాంటి ఛేదించలేని రహస్యాలెన్నో ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు తన భక్తులను ఎవరైనా హింసిస్తే వెంటనే ఉగ్రరూపంలో మారిపోతుంది.  దీనికి వెనుక చరిత్ర ఏంటంటే.. హాసనాంబ భక్తులను హాసనాంబ అత్తగారు హింసించేదని ఆమెని రాయిగా మారిపోమని అమ్మవారు శపించిందంటారు. అందుకు నిదర్శనంగా అక్కడ బండరాయిలా మారిపోయిన అత్తగారు రాయిని చూపిస్తారు. అంతేకాదు ఏటా ఈ రాయి గర్భాలయంలో బియ్యపుగింజంత పరిమాణంలో కదులుతూ ఉంటుంది. ఈ రెండు రాళ్లు ఓ దగ్గరికి చేరితే యుగాంతమే అని స్థానిక కథనం. అయితే ఇంతకీ రాళ్లు ఎలా కదులుతాయంటూ ఎన్నో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని ఛేదించలేకపోయారు.  

Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!

ఏడాదైనా ప్రసాదం వేడిగానే ఉంటుంది

హాసనాంబ ఆలయం ఏడాదికి పన్నెండు రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. అలా తెరుచుకున్న ఆలయంలో అమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటీపడతారు. తిరిగి ఆలయాన్ని మూసివేసే రోజు వెలిగించిన దీపం ఏడాది తర్వాత ఆలయాన్ని తిరిగి తెరిచే వరకూ అలాగే వెలుగుతూనే ఉంటుంది. అమ్మవారి దగ్గర ఉంచిన పూలు కూడా తాజాదనం కోల్పోకుండా అలానే ఉంటాయి. మరో విశేషం ఏంటంటే.. అమ్మవారికి నివేదించిన అన్నప్రసాదం వేడి చల్లారకుండా, రుచి మారకుండా ఏడాది తర్వాత కూడా అలానే ఉంటుంది. ఏటా ఆలయాన్ని మూసివేసే ముందు రెండు బస్తాల బియ్యం, నీళ్లు, పూలు, అన్నప్రసాదం నివేదించి తలుపులు మూసివేస్తారు.  

ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు కానీ ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ లేవు. ఈ ఆలయం బెంగళూరు నుంచి దాదాపు 185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget