అన్వేషించండి

Kalki 2898 AD Dulquer Salmaan : కల్కి 2898 AD లో దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ పురాణాల్లో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. పార్ట్ 2 లో కీలక రోల్ ఇది!

Kalki 2898 AD Dulquer Salmaan: కల్కి 2898 AD సినిమాలో చాలా గెస్ట్ రోల్స్ ఉన్నాయి. వాటన్నింటినీ ఎక్కడికక్కడ ముగించేశాడు డైరెక్టర్. కానీ దుల్కర్ సల్మాన్ ఇంకా ఉన్నాడు..పురాణాల్లో తనెవరో తెలుసా...

Kalki 2898 AD Dulquer Salmaan  as Parashurama

కల్కి 2898 AD సినిమా చూశారా?
ఇందులో ఉన్న గెస్ట్ రోల్స్ అన్నింటినీ ఎక్కడిక్కడ ముగించేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్..
కానీ దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ మాత్రం చంపలేదు. ఎందుకో తెలుసా? ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటో అర్థమైందా?
అసలు దుల్కర్ సల్మాన్ ని ఏదో గెస్ట్ రోల్ మాత్రమే అనుకుంటున్నారా?..అస్సలు కాదు..
నాగ్ అశ్విన్ పురాణాలను ఎంత క్షుణ్ణంగా చదివి ఈ స్టోరీ రాసుకున్నాడో చెప్పేందుకు కల్కి 2898 AD మూవీలో ఉండే ప్రతి పాత్ర బ్యాగ్రౌండ్ పరిశీలిస్తే అర్థమవుతుంది. అందులో అత్యంత ముఖ్యమైనది దుల్కర్ సల్మాన్..

Also Read: మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఎక్కడుంది..ఎలా వెళ్లాలి..అక్కడ చూసేందుకు ఏమున్నాయ్?

సినిమా మొదలైన కొద్దిసేపటికి  మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇస్తుంది.  గర్భిణిగా కనిపించే  ఆమెను చూసి శంబల నుంచి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ తాము వెతుకుతున్న అమ్మ అనుకుంటాడు.  అయితే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ దేవుడు కాదని క్లారిటీ వస్తుంది.  అక్కడి నుంచి వెళ్లిపోవాలనే ప్రయత్నంలో భాగంగా...మృణాళ్ ..ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ సుప్రీమ్ యాస్కిన్ అనుచరుల చేతిలో ప్రాణాలు కోల్పోతారు..  శంబలలో అమ్మకోసం ఎదురుచూస్తున్న మరియం క్యారెక్టర్లో నటించింది శోభన. ఎట్టకేలకు అమ్మ శంబలలో అడుగుపెడుతుంది. ఆ ఆనందంలో ఉన్న సమయంలో భైరవ కారణంగా సుప్రీమ్ యాస్కిన్ మనుషులు ఎంట్రీ ఇస్తారు...వారితో పోరాటంతో ప్రాణాలు కోల్పోతుంది మరియం. ‘కల్కి 2898 AD’లో కైరాగా నటించింది మల్లూవుడ్ బ్యూటీ ఆన్నా బెన్. అమ్మగా నటించిన దీపికను శంబలకు తీసుకెళ్లే ప్రయత్నంలో సుప్రీమ్ యాస్కిన్ మనుషులతో  పోరాడి ప్రాణాలు వదిలేస్తుంది.. ఇక రాజమౌళి, ఆర్జీవీ, బ్రహ్మానందం వీళ్లు.. ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచేందుకు వచ్చిపోయే పాత్రలుగా చూపించారు.  కానీ దుల్కర్ సల్మాన్ రోల్ అలా కాదు..ఇంతకీ తనెవరంటే... సప్త చిరంజీవుల్లో ఒకడైన పరశురాముడు..

పరశురాముడి క్యారెక్టర్లో దుల్కర్ సల్మాన్

రేణుక-జమదగ్ని మహర్షి ఐదో సంతానం పరశురాముడు. ఇప్పటికీ భూమ్మీద బతికి ఉన్న ఏడుగురు చిరంజీవుల్లో ఒకడు పరశురాముడు.  తండ్రి  జమదగ్ని మహర్షి దగ్గర్నుంచి దౌర్జన్యంగా కామధేనువుని తీసుకెళ్లిపోయిన మాహిష్మతి మహారాజు అయిన కార్తావీర్యార్జునుడిపై దండయాత్ర చేసి చంపేస్తాడు పరశురాముడు. అందుకు ప్రతిగా కార్తావీర్యార్జునుడి తనయులు...జమగద్ని మహర్షి తలనరికేస్తారు. అప్పటి నుంచి క్షత్రియుల అంతమే లక్ష్యంగా వరుస దండయాత్రలు చేస్తాడు పరశురాముడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడికి సకల విద్యలు నేర్పించిన పరశురాముడు..కలియుగంలో కల్కిగా జన్మించబోతున్న శ్రీ మహావిష్ణువుకి  విద్యలు నేర్పించేది కూడా పరశురాముడే.

Also Read: మహాభారత విషాద వీరుడు సూర్య పుత్ర కర్ణుడిని ముంచేసిన మూడు శాపాలు ఇవే!

దుల్కర్ సల్మాన్...పరశురాముడు ఎలా అయ్యాడంటే!
 
కల్కిలో భైరవుడిగా నటించిన ప్రభాస్..గడిచిన యుగంలో కర్ణుడు. అప్పుడు కర్ణుడికి విద్యలు నేర్పించిన గురువు, అబద్ధం చెప్పాడని శాపం ఇచ్చిన గురువు పరశురాముడే. ఈ మూవీలో భైరవగా నటించిన ప్రభాస్ ని చేరదీసి సకల విద్యలు నేర్పిస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడిని అని అబద్ధం చెబుతాడు..ఈ మూవీలో భైరవ తన గురువుని కాంప్లెక్స్ కి అమ్మేస్తాడు. అన్ని క్యారెక్టర్స్ ని ఎక్కడికక్కడ చంపేసిన నాగ్ అశ్విన్.. దుల్కర్ సల్మాన్ ని మాత్రం బంధించి తీసుకెళ్లిపోతారంతే. 

Also Read: కర్ణుడు - అర్జునుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు? కల్కి 2898 AD సినిమాలో ఏం చూపించారు - పురాణాల్లో ఏముంది?

కల్కి 2898 AD పార్ట్ 2 లో దుల్కర్ పాత్ర కీలకం

ప్రస్తుతం థియేటర్లో ఉన్న కల్కి మూవీలో అమ్మను..భైరవ తీసుకెళ్లడంతో సినిమా ముగిసింది. రెండో భాగంలో కల్కి జన్మించిన తర్వాత .. గురుకులానికి బయలుదేరే సమయంలో పరశురాముడు ఎంట్రీ ఇచ్చి కల్కిని తీసుకెళ్లి విద్యలు నేర్పించి.. కల్కి జననం వెనుకున్న ఆంతర్యం వివరిస్తాడు. అప్పటి నుంచి అశ్వత్థామ సహాయంతో ధర్మసంస్థాపన మొదలవుతుంది. అంటే పార్ట్ 2 లో కథను కీలక మలుపు తిప్పబోయేది దుల్కర్ సల్మానే. ప్రస్తుతం కాంప్లెక్స్ మనుషుల చేతిలో ఉన్న కెప్టెన్... అక్కడి నుంచి బయటపడి కల్కిని ఎలా చేరుకుంటాడో వెయిట్ అండ్ సీ...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget