అన్వేషించండి

Sravana Mangalvaram: సౌభాగ్యం, సత్సంతానం కోసం వివాహితలు ఆచరించే నోము ఇది!

ప్రస్తుతం అధిక శ్రావణమాసం నడుస్తోంది. నిజ శ్రావణమాసం ఆగష్టు 17 గురువారం నుంచి ప్రారంభమవుతుంది. ఏటా శ్రావణంలో ఆచరించే నోములు,పూజలు అప్పుడే మొదలవుతాయి. ఈ ఏడాది శ్రావణ మంగళవారాలు ఎన్నొచ్చాయో తెలుసా!

Sravana Mangalvaram: సౌభాగ్యం, సత్సంతానం, అన్యోన్యదాంపత్యం కోసం ఏటా శ్రావణమాసంలో వివాహితలు ఆచరిస్తారు మంగళ గౌరీ వ్రతం. ఈ సారి అధికశ్రావణం మాసం రావడంతో మొదటి నెల రోజుల్లో ఏ నోమూ నోచరు. మరి నిజ శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలైంది. ఈ ఏడాది ఎన్ని మంగళవారాలు వచ్చాయో చూస్తే...ఆగష్టు 17 గురువారం నుంచి నిజ శ్రావణమాసం మొదలై  సెప్టెంబరు 15 వరకు ఉంటుంది. అంటే ఈ ఏడాది నాలుగు శ్రావణ మంగళవారాలుంటాయి

  • ఆగష్టు  22 -మొదటి శ్రావణ మంగళవారం
  • ఆగష్టు  29 -శ్రావణ మంగళవారం రెండోది
  • సెప్టెంబరు 5 - మూడో శ్రావణ మంగళవారం
  • సెప్టెంబరు 12 - ఆఖరి శ్రావణ మంగళవారం

శ్రావణంలోని ప్రతి మంగళవారం స్త్రీలు మాంగల్యానికి అధిదేవత  అయిన ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. తమ మాంగల్యాన్ని పదికాలాల పాటు  కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు తల్లి దగ్గరుండి చేయించాలి. అలాగే మొదటి వాయనం తల్లికి ఇవ్వడమే శ్రేష్ఠం అంటారు పండితులు. అత్తవారింట్లోనూ, ఇతర ముత్తైదువుల సమక్షంలోనూ నోము ప్రారంభించవచ్చు

Also Read: ఇంట్లో ట్యాపులు లీకవుతూనే ఉన్నాయా - అయితే ఈ సమస్యలు తప్పవు!

వ్రతాన్ని ఆచరించే వారు పాటించాల్సిన నియమాలు

  • మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే వారు ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి
  • వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనం ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనం అందించాలి)
  • శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఐదేళ్లపాటూ నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఏడాదికి ఐదుగురు ముత్తైదువులు చొప్పున మొదటి ఏడాది 5, రెండో ఏడాది 10, మూడో ఏడాది 15 ఇలా  ఆఖరి ఏడాది 25 మంది ముత్తైదువులకు తాంబూలం ఇచ్చుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏడాదికి ఐదుగురు ముత్తైదువులకు మాత్రమే ఇస్తారు.
  • ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించేవారు కొందరైతే... ఏ వారం ఎక్కడున్నా అక్కడ పసుపుతో అమ్మవారిని ఏర్పాటుచేసుకుని పూజ పూర్తిచేసేవారు ఇంకొందరు. ఇది పూర్తిగా మీ ప్రాంతంలో పాటించే నియమాల ఆధారంగా అనుసరించాల్సి ఉంటుంది.

Also Read: స్త్రీలు మంగళసూత్రం విషయంలో సాధారణంగా చేసే పొరపాట్లు ఇవే!

పూజా ఇలా చేసుకోవాలి
ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి, దానిపై గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని తయారు చేసుకుని ముందుగా  వినాయకపూజ చేయాలి. కలశం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి కలశపూజ, షోడశ ఉపచారాలతో అమ్మవారిని ఆరాధించి మంగళ గౌరి అష్టోత్తరం చదువుకోవాలి. తోరాలు తయారు చేసి అమ్మవారి దగ్గర ఉంచి, పిండి దీపారాధనలు తయారు చేసుకుని (బియ్యం పిండి, బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు) పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి ఓ తోరం అమ్మవారికి కట్టి, మరొకటి పూజ చేసుకునేవారు కట్టుకుని మిగిలినవి ముత్తైదువులకు కట్టాలి ( మీరు ఎంతమంది ముత్తైదువులను పిలుస్తారో అన్ని ఉండాలి). ముత్తైదువుకి పసుపు రాసి, బొట్టు పెట్టి , తోరం కట్టి తాంబూలంతో ఇచ్చి ఆమెను గౌరీ స్వరూపంగా భావించి కాళ్లకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవాలి. 

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే.  దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget