అన్వేషించండి

Guru Purnima 2025: పతంజలి యోగపీఠ్‌లో ముగిసిన గురు పూర్ణిమ వేడుకలు, గురు-శిష్య సంప్రదాయాన్ని కొనియాడిన రామ్‌దేవ్

Guru Purnima 2025 | ప్రపంచంలో పలు దేశాలు ఆధిపత్య పోరాటంలో ఉన్నాయని యోగా గురు రామ్‌దేవ్ అన్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక నాయకుడిగా భారత్ స్థిరపడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

Guru Purnima 2025 Celebrations:  జూలై 10న దేశవ్యాప్తంగా గురు పూర్ణిమను ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈవెంట్‌ను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున భారత్‌లో జరుపుకుంటారు. మహాభారతంతో పాటు 18 పురాణాల రచయిత అయిన మహర్షి వేద వ్యాసుడు ఈ రోజున జన్మించాడని హిందువులు విశ్వసిస్తారు. అందువల్ల, ఈ రోజును గురువుల ఆరాధనకు అంకితం చేశాం. ఈరోజును వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు.

వేద వ్యాసుడు మొదటి గురువుగా పరిగణిస్తాం. ఈ సందర్భంగా, పతంజలి యోగపీఠ్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు అయిన రామ్‌దేవ్, ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ మార్గదర్శకత్వంలో పతంజలి వెల్నెస్, యోగపీఠ్-2లోని యోగ భవన్ ఆడిటోరియంలో గురు పూర్ణిమ వేడుకను ఘనంగా నిర్వహించారు.

స్వామి రామ్‌దేవ్ ఏమన్నారంటే..

ఈ కార్యక్రమంలో రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ ఒకరినొకరు పూలమాలతో సన్మానించుకుని పరస్పరం గౌరవించుకున్నారు. దేశ ప్రజలకు వీరు గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వామి రామ్‌దేవ్ మాట్లాడుతూ.. గురు పూర్ణిమ అనేది సనాతన ధర్మాన్ని కొనసాగించే పండుగ లాంటిది అన్నారు. ఇది భారతదేశంలో గురు-శిష్యుల గొప్ప సంప్రదాయానికి, శాశ్వత సాంస్కృతిక వారసత్వానికి పరిపూర్ణతను తెచ్చే వేడుక అని పేర్కొన్నారు. 

వేదాలు, గురు ధర్మంలోనూ జాతీయ కర్తవ్య సారం ఉందని బాబా రామ్‌దేవ్ తెలిపారు. ప్రస్తుత ప్రపంచ ఆధిపత్యం కోసం పోరాటానికి సాక్ష్యంగా నిలుస్తోందని, అయితే ఈ ఆధిపత్యం సత్యం, యోగ, ఆధ్యాత్మికత, న్యాయంపై ఆధారపడి ఉంటేనే అందరికీ ప్రయోజనం చేకూరుతుందని రాందేవ్ పేర్కొన్నారు.

గురు పూర్ణిమ ప్రాముఖ్యతపై ఆచార్య బాలకృష్ణ

ఈ సందర్భంగా ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ.. గురు పూర్ణిమ అనేది గురు-శిష్యుల ప్రాముఖ్యత, మన సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగ అన్నారు.  అయితే, ఒకరు పూర్తి నమ్మకంతో తమ గురువు మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ సంప్రదాయానికి నిజమైన అర్థం ఉంటుందని పేర్కొన్నారు. గురు-శిష్యుల వంశపారంపర్యం, యోగ, ఆయుర్వేదం, సనాతన ధర్మం, వేదాల నుంచి లభించిన జ్ఞానం ద్వారా భారతదేశం ప్రపంచానికి పెద్దన్న హోదాను పొందుతుందని ఆయన స్పష్టం చేశారు.

యాత్రికులకు ఆహారం అందిస్తున్న పతంజలి యోగపీఠ్

కన్వర్ యాత్ర కోసం హరిద్వార్‌లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. పవిత్ర జలం కోసం దేశంలోని నలుమూలల నుంచి భక్తులు హరిద్వార్‌కు చేరుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పతంజలి యోగపీఠ్ ఒక నిరంతర కిచెన్ (అఖండ భండారా) ఏర్పాటు చేసింది. దాంతో భక్తులకు పతంజలి యోగపీఠ్ భోజనం అందించి వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget