అన్వేషించండి

YSRCP Rebel MLAs: అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ను కలిసిన వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు

Andhra News: అనర్హత పిటిషన్లపై వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ వద్ద విచారణకు హాజరయ్యారు. సహజ న్యాయసూత్రాల ప్రకారం తాము కోరిన వెసులుబాటు కల్పించాలని స్పీకర్ కు విన్నవించినట్లు చెప్పారు.

Ysrcp Rebel Mlas Meet Speaker Seetharam: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి సోమవారం స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కలిశారు. తాము ఇది వరకే లేఖలో రాసిన విధంగా 4 వారాల సమయం కోరినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తాము కోరిన వెసులుబాటు కల్పించాలని స్పీకర్ కు విన్నవించినట్లు చెప్పారు. తాము పార్టీ నియమాలు ఉల్లంఘించినట్లు వైసీపీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాల్సిందిగా సభాపతిని, అసెంబ్లీ కార్యదర్శిని కోరామని అన్నారు. సీఎం జగన్ ఒత్తిడి మేరకే స్పీకర్ పని చేస్తున్నారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినా రశీదు అడిగితే మాత్రం ఇవ్వలేదని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఆరోపించారు. స్పీకర్‌ తీరు చూస్తుంటే చట్టాలపై గౌరవం పోతోందని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కావాలనే తమపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలపై ఉన్న గౌరవంతోనే ఆయన్ను కలిసి సమయం కావాలని నేరుగా కోరామని, కానీ ఆయన దీనికి అంగీకరించకపోవడం వల్ల ఇప్పుడు కోర్టును ఆశ్రయించక తప్పదన్నారు. కోర్టులు, ప్రజా కోర్టుల్లోనే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

వారిపైనా చర్యలు తీసుకుంటారా.?

స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సభాపతి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. ఏపీలో స్పీకర్‌ రూల్ బుక్‌ను కూడా విభజించారని ఆయన మండిపడ్డారు. మరో రెండు, మూడు నెలల్లో సభాపతి కాలం ముగిసిపోబోతోందని, చివరి రోజుల్లో అయినా ఆయన చరిత్రలో నిలిచే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు తమకన్నా ఎక్కువ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. 16 నెలల ముందు తాము ఏం చెప్పామో ఇప్పుడు అందరూ అదే చెబుతున్నారన్నారు. వారిపైనా చర్యలు తీసుకుంటారా అని వారు ప్రశ్నించారు.

న్యాయ నిపుణుల సలహా

అంతకు ముందు సభాపతిని కలవడంపై రెబల్ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణులు సలహా తీసుకున్నారు. అనర్హత పిటిషన్‌పై సమయం కావాలని కోరినా స్పీకర్ అంగీకరించకపోవడంతో నేరుగా కలిసి సమయం కోరాలని నిర్ణయించారు. అనర్హతకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించేందుకు.. పేపర్స్, వీడియో క్లిప్పింగుల వాస్తవ నిర్ధారణకు సమయం కావాలని రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి తెలిపారు. తనకు ఆరోగ్యం బాగాలేదని వైద్యులు ఇచ్చిన నివేదికను ఇచ్చినా స్పీకర్‌ పరిగణనలోకి తీసుకోలేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వాపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగే సీక్రెట్ ఓటింగ్‌లో విప్‌ ఉల్లంఘించారని ఎలా నిర్థారిస్తారన్నారు. వైసీపీలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు, చేయని ఎమ్మెల్యేలు కూడా జగన్‌ను విమర్శిస్తున్నారని.. వారిపై లేని చర్యలు తమపై ఎందుకని ఆయన మండిపడ్డారు. కరోనాతో చికిత్స తీసుకుంటున్నానని తెలిపినా, నేరుగా హాజరు కావాల్సిందేనని సభాపతి ఆదేశించారని మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. స్పీకర్‌ ఫార్మెట్‌లో గంటా శ్రీనివాసరావు రాజీనామా ఇచ్చి మూడున్నారేళ్లు అయినా పట్టించుకోని స్పీకర్‌.. తమకు మాత్రం నోటీసులు ఇచ్చి రెండు వారాల్లోనే సమాధానం ఇవ్వాలనడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, టీడీపీని వీడిన ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు వేయాల్సిందిగా ఆ పార్టీ విప్ డోలా వీరాంజనేయస్వామి ఇచ్చిన పిటిషన్ ఆధారంగా నలుగురు ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, కరణం బలరాం సైతం నేరుగా వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా సభాపతి తాఖీదులు జారీ చేశారు. తెలుగుదేశాన్ని వీడిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై న్యాయ నిపుణులతో ఆ పార్టీ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం కీలకంగా మారింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi 7 Appeals: అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Modi Mind Game on Revanth Reddy: మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?
మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget