అన్వేషించండి

Jagan : "సీఎంగా జగన్‌ ఉండి ఉంటే" వైసీపీకి కొత్త నినాదం ఇచ్చిన అధినేత

YSRCP: అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలు ప్రజలకు గుర్తు చేస్తూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా కొత్త నినాదం అందుకుంది వైసీపీ. ఇప్పుడు తాను అధికారంలో ఉండి ఉంటే చాలా పథకాలు అమలు అయ్యేవన్నారు.

Andhra Pradesh: ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి వైసీపీ శ్రేణులను జగన్ సిద్దం చేశారు. కూటమి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ గతంలో ఇచ్చిన పథకాలను గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేశారు. దీని కోసం జగన్ ఉండి ఉంటే అనే నినాదాన్ని తీసుకొచ్చారు. 

పథకాల అమలు ఎప్పుడు

శుక్రవారం మీడియాతో మాట్లాడిన జగన.. తమ హయాంలో చేసిన పథకాలను వివరించారు. హామీలను అమలు చేసే ఉద్దేశం లేకపోవడంతోనే శ్వేతపత్రం అని ఆర్థిక విధ్వంసం అంటూ కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు జగన్. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతుందని ఇప్పటి వరకు పథకాలకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వడం లేదన్నారు. 

Also Read: మదనపల్లి అగ్ని ప్రమాదంపై స్పందించిన జగన్ - ఏపీకి కొత్త అర్థం చెప్పిన మాజీ సీఎం

జగన్ పథకాలు గుర్తు చేసే వ్యూహం

పథకాలు అమలు కావడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వైసీపీ హయాంలో అమలు చేసిన పథకాలు గుర్తు చేస్తున్నారు. జగన్ ఉండి ఉంటే అనే నినాదాన్ని అందుకున్నారు. ఇప్పుడు అధికారంలో జగన్ ఉండి ఉంటే చాలా పథకాలు ప్రజలకు అందేవని బలంగా తీసుకెళ్లనున్నారు. ఇదే విషయం ప్రెస్‌మీట్లో జగన్‌ వివరించారు. 

తల్లికి వందనం ఎప్పుడు

రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉండి ఉంటే అమ్మఒడి వచ్చేదని ప్రజలు అనుకుంటున్నారని జగన్‌ అభిప్రాయపడ్డారు. తల్లికి వందనం పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రతి ఇంటికి వెళ్లిన టీడీపీ నేతలు ఎంత మంది పిల్లలు ఉంటే అందరికి డబ్బులు వస్తయని లెక్కలు వేసి మరీ చెప్పారని అన్నారు. తాము అధికారంలో ఉండి ఉంటే జూన్‌లో విద్యార్థుల తల్లలు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవి అన్నారు.

Also Read: హామీలు అమలు చేయాల్సి వస్తుందనే బడ్జెట్‌ పెట్టడం లేదు- చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు

ఇప్పుడు డేటా అంటూ తప్పించుకుంటున్నారని ఆరోపించారు. డేటా ఏముందని ప్రతి ఊరిలో సచివాలయం ఉందని వారి వద్ద మొత్తం డేటా ఉంటుందని అడిగిన క్షణాల్లో వారు ఇచ్చేస్తారని చెప్పారు. ఇవ్వాలనుకుంటే ఒక్కరోజులో ప్రక్రియ పూర్తి చేయవచ్చని సూచించారు.  తల్లికి వందనం కోసం 43 లక్షల మంది తల్లులు, 82లక్షల మంది పిల్లలు ఎదురుచూస్తున్నారని లెక్కలు చెప్పారు. 

 

సీఎంగా జగన్ ఉండి ఉంటే...

సీఎంగా జగన్ ఉండి ఉంటే... విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చేదని తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఉందన్నారు జగన్. ఇప్పటి వరకు విద్యాదీవెన, వసతి దీవెన ఇవ్వలేదని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోగా కాలేజీలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జగన్‌ సీఎంగా ఉండి ఉంటే విద్యాదీవెన కింద ఫీజు, ఒక విడత లాడ్జింగ్, బోర్డింగ్‌ ఖర్చులకు డబ్బులు వచ్చేవని అన్నారు. 

వైసీపీ అధికారంలో ఉండి ఉంటే... మహిళలకు సున్నా వడ్డీ రుణాలు వచ్చేవన్నారు జగన్. రైతులకు రైతుభరోసా వచ్చేదని అన్నారు. రైతులకు 20వేలు ఇస్తామన్న చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. రైతు బీమా కూడా వచ్చేదని చెప్పుకొచ్చారు. అసలు ఇప్పటి వరకు రైతుల బీమా ప్రీమియం కట్టలేదని ఆరోపించారు. తాము అధికారంలో ఉండి ఉంటే కచ్చితంగా అది కూడా జరిగేదన్నారు. 

ఇలా అన్నింటినీ గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. పథకాలపై ప్రజల్లో చర్చ మొదలయ్యేలా చేస్తున్నారు. సూపర్‌ సిక్స్‌పై ప్రజలు ప్రశ్నించేలా చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget