అన్వేషించండి

YS Jagan: మదనపల్లి అగ్ని ప్రమాదంపై స్పందించిన జగన్ - ఏపీకి కొత్త అర్థం చెప్పిన మాజీ సీఎం

YSRCP Chief Jagan: విషయాన్ని డైవర్ట్ చేయడంలో ఆరితేరిన చంద్రబాబు మదనపల్లి అగ్ని ప్రమాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు జగన్. కేవలం రషీద్ ఇష్యూను డైవర్ట్ చేయడానికి యత్నించారన్నారు.

Andhra Pradesh: వినుకొండలో రషీద్ అనే దారుణంగా హత్య చేశారు. అందులో నిందితుడు టీడీపీ నాయకులకు సన్నిహితుడు. కానీ కేసులో వారిపై కేసులు పెట్టలేదు. ఎమ్మెల్యే బంధువులపై కానీ, ఇతరులపై కేసులు లేవు. వీటిపై ప్రశ్నిస్తుంటే టాపిక్‌ డైవర్షన్‌ కోసం మదనపల్లిలో జరిగిన ఇష్యూను తీసుకున్నారు. సీఎం రెండుసార్లు రివ్యూ చేశారు. డీజీపీని ప్రత్యేక హెలికాప్టర్‌లో పంపించి హడావుడి చేశారు. పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి చేశారని ఆరోపిస్తూ ఆరోపిస్తారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే ఫైల్స్‌ ఆన్‌లైన్లో ఉంటాయి కదా... అని ప్రశ్నించారు. దానికి ఇంత హడావుడి దేనికి అని నిలదీశారు. ఇన్నిసార్లు గెలుస్తున్నారంటే వాళ్లకు ప్రజల్లో మంచి పేరు ఉందనే కదా అర్థమన్నారు. నియోజకవర్గంలో తిరగకుండా చేస్తూ వాళ్లపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. 

మదనపల్లి కేసు డైవర్షన్

తనకు నష్టం జరిగే విషయాల నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పారు జగన్. వినుకొండ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడానికే మదనపల్లె సబ్‌ కలెక్టర్‌లో ఫైర్ యాక్టిడెంట్‌కు హైప్‌ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇందులో పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. పెద్దిరెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యే, మిథున్‌రెడ్డి మూడుసార్లు ఎంపీగా విజయం సాధించారంటే ప్రజల్లో మంచి పేరు ఉందని గ్రహించాలన్నారు. వాళ్లను అభాసుపాలు చేసేందుకు వాళ్లపై దాడి చేసి రివర్స్‌లో కేసులు పెడతున్నారని ఆరోపించారు. 

దిశా ఎక్కడ?

'మచ్చుమర్రిలో బాలికను వెతికడానికి చంద్రబాబుకు మనసు రాదు కానీ డీజీపీకి ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి మదనపల్లి పంపిచారని ఆరోపించారు. మచ్చుమర్రి కేసులో నిందితుడిని లాకప్‌డెత్‌ చేశారని విమర్శించారు. బాధితులు ఆందోళన చేయడంతో పోలీసులపై చర్యలు తీసుకున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయి  క్షీణించాయని ఆరోపించారు జగన్. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. 45 రోజుల్లో  12 మందిపై అత్యాచారాలు జరిగాయని వివరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ యాప్‌,పని చేసేవని ఎక్కడ నేరాలు జరగకుండా పోలీసులు వెంటనే వెళ్లేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆరోపించారు. మహిళలకు వరంలా ఉండాల్సిన వీటిని జగన్‌కు పేరు వస్తుందని పని చేయకుండా చేశారని విమర్శించారు. 

Also Read: "జగన్‌ ఉండి ఉంటే" వైసీపీకి కొత్త నినాదం ఇచ్చిన అధినేత

ఏపీ అంటే ?

ఏపీ అంటే అరాచక పాలన, ఆటవిక పాలనగా మారిందని కొత్త అర్థం చెప్పారు. ప్రస్తుతం ఏపీలో రెడ్‌బుక్‌ పాలన నడుస్తోందని అన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడాన్ని జగన్ ఖండించారు. అక్రమ కేసులు పెట్టి ఆయన్ని అరెస్టు చేయడాన్ని తప్పుపెట్టారు. అనుకూలంగా ఉండే అధికారులను అక్కడకు ట్రాన్స్‌ఫర్ చేసి ఇదంతా నడిపిస్తున్నారని చెప్పారు. శ్రీనివాసులు అనే అధికారి ఎస్పీగా వచ్చిన తర్వాతే వినుకొండలో రషీద్‌ హత్య జరిగిందని గుర్తు చేశారు జగన్. 

చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ రెడ్‌బుక్ పేరుతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు జగన్. ఆ రెడ్‌ బుక్‌ను గ్రామాల్లో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ఎవరూ మాట్లాడకూడదు. ఎవరూ ప్రశ్నించకూడదనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇలాంటి పరిణామాలు ఉంటాయని ఏకంగా చంద్రబాబు లాంటి వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: హామీలు అమలు చేయాల్సి వస్తుందనే బడ్జెట్‌ పెట్టడం లేదు- చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Vijayawada Crime News: ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ విచారణలో విస్తుపోయే అంశాలు: సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ
ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు!

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Embed widget