అన్వేషించండి

Capitals Resign Politics : రాజీనామాలపై రాజీ పడ్డ వైఎస్ఆర్‌సీపీ - "వికేంద్రీకరణ" ఉద్యమంలో పదవీ త్యాగాలు లేనట్లే !

వికేంద్రీకరణ కోసం అవసరమైతే రాజీనామా చేస్తామన్న వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇప్పుడు అలాంటిదేమీ లేదంటున్నారు. రాజీనామాల వల్ల ఉపయోగం ఏముందంటున్నారు ? ఒక్క సారిగా ఈ మార్పు ఎందుకొచ్చింది ?

Capitals Resign Politics :  మూడు రాజధానుల కోసం రాజీనామాలకు సిద్దం అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించిన తర్వాతి రోజే ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా లే్ఖ జేఏసీకి ఇవ్వడంతో ఒక్క సారిగా హీట్ పెరిగింది. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తాము రాజీనామాలకు సిద్ధమన్నారు. ఇతర ప్రాంతాల వైసీపీ నేతలు కూడా రెడీ అన్నారు. దీంతో ఇక మూడు ప్రాంతాల్లో ఉపఎన్నికలు రావడమో లేకపోతే నేరుగా ముందస్తు ఎన్నికలు రావడమో ఖాయమన్న వాతావరణం కనిపించింది. అయితే మళ్లీ ఒక్క రోజులోనే అనూహ్యంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు మాట మార్చారు. తాము రాజీనామాలు చేస్తామని ఎప్పుడూ చెప్పలేదంటున్నారు. నేరుగా చెప్పింది.. జేఏసీకి లేఖలిచ్చింది...  కళ్ల ముందు ఉండగానే వారిలా ఎందుకు మాట్లాడుతున్నారు ? రాజీనామాల వ్యూహం ఎదురు తన్నిందా ? టీడీపీని ఫిక్స్ చేద్దామనుకుంటే తామే ఫిక్సయ్యే పరిస్థితి రావడంతోనే ప్లేట్ ఫిరాయించారా ?

రాజీనామాల సవాళ్లపై వైఎస్ఆర్‌సీపీ యూటర్న్ !

మూడు రాజధానుల కోసం వైఎస్ఆర్‌సీపీ రాజధానుల వ్యూహం ఎంచుకుందని రెండు, మూడు రోజులుగా ఏపీలో జరిగిన ఘటనలు చూసి రాజకీయవర్గాలు ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చాయి. పార్టీ  హైకమాండ్ అనుమతి లేకుండా రాజీనామాల ప్రకటనలు.. రాజీనామాల పత్రాలు ఇవ్వడం లాంటివి ఆ పార్టీ నేతలు చేయరు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు ఇలా రాజీనామా సవాళ్లు చేసి ఉంటారని డిసైడయ్యారు. అయితే ఒక్క రోజులోనే వారు మాట మార్చేశారు. మంత్రులు బొత్స, అమర్నాత్ అసలు ధర్మాన రాజీనామాల ప్రస్తావనే తేలేదని చెప్పేందుకు ప్రయత్నించారు. రాజీనామాల వల్ల ఏం వస్తుందని ఎదురు ప్రశ్నించారు. 

టీడీపీని ఫిక్స్ చేద్దామనుకున్న వ్యూహం తేడా కొట్టిందా ?

కరణం ధర్మశ్రీ జేఏసీకి రాజీనామా పత్రం ఇవ్వగానే.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతుందని వైఎస్ఆర్‌సీపీ నేతలు అంచనా వేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తాయనుకున్నారు. కానీ ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు గతంలో తాము అమరావతికే మద్దతని చెప్పామని ఇప్పుుడు కూడా అదే చెబుతామని..అమరావతికి మద్దతు ప్రకటించి ఇప్పుడు మూడు రాజధానులని మాట మార్చింది మీరే కాబట్టి రాజీనామాలు చేయాలని అంటున్నారు. అదే సమయంలో ప్రజల్లో కూడా రాజీనామాల ఎపిసోడ్‌లో అనుకున్నంత స్పందన రాలేదు. కరణం ధర్మశ్రీ రాజీనామా నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో అదంతా ఉత్త రాజకీయం అనే అనుకున్నారు. 

ఒక్కరెందుకు.. అందరూ రాజీనామాలు చేయాలని టీడీపీ సవాళ్లు !

మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నది ఒక్క ఎమ్మెల్యేనేనా అన్న సెటైర్లు కరణం ధర్మశ్రీ రాజీనామా లేఖ ఇచ్చినప్పటి నుండి వచ్చాయి. మిగిలిన వారందరూ అమరావతికి మద్దతు ఇచ్చినట్లేనా అన్న విశ్లేషణలు చేశారు. ఈ పరిస్థితి వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా మారింది. ఇతరులతో రాజీనామా చేయించలేరు.. అందుకే్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. నిజానికి తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా వైఎస్ఆర్‌సీపీకి ఒకటే సవాల్ చేస్తోంది. మూడు రాజధానుల ఎజెండాగా.. రిఫరెండం  అనుకుని.. మళ్లీ ఎన్నికలకు వెళదాం రమ్మని సవాల్ చేస్తోంది.  ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీనే రాజీనామాల అంశం తేవడంతో టీడీపీకి కొత్త హుషారు వచ్చినట్లయింది. మరింత  దూకుడుగా సవాళ్లు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఉపఎన్నికలు .. లేదా ముందస్తు ఎన్నికలను వైఎస్ఆర్‌సీపీ కోరవడం లేదు కాబట్టి.. ఈ వయూహం విషయంలో వెంటనే వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. 

పులి మీద సవారీ చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ !

ప్రాంతాల మధ్య పోటీ పెట్టి.. ప్రజల మధ్య విద్వేషాలు రేగేలా రాజధానుల వివాదం తీసుకు రావడం ద్వారా వైఎస్ఆర్‌సీపీ పులి మీద స్వారీ చేస్తున్నట్లుగా అవుతోంది. ఏ మాత్రం తేడా వచ్చినా..  మూడు ప్రాంతాల ప్రజలకూ వ్యతిరేకతవుతారు. ఓ చోట సెంటిమెంట్ రేకెత్తించడానికి ప్రయత్నిస్తే మరో చోట ప్రజలు వ్యతిరేకమవుతారు. ఇప్పటికిప్పుడు బయట పడకపోవచ్చు కానీ ఎన్నికల్లో ఈ అంశం ప్రభావితం చేస్తే వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana drugs case politics: అసెంబ్లీ సమావేశాల ముందు కాంగ్రెస్‌కు అంది వచ్చిన డ్రగ్స్ కేసు - బీఆర్ఎస్ పార్టీ చిక్కుల్లో పడుతుందా?
అసెంబ్లీ సమావేశాల ముందు కాంగ్రెస్‌కు అంది వచ్చిన డ్రగ్స్ కేసు - బీఆర్ఎస్ పార్టీ చిక్కుల్లో పడుతుందా?
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Revanth Reddy: నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Embed widget