అన్వేషించండి

Training For YSRCP MLA PAs : ఎమ్మెల్యేల పీఏలకూ ట్రైనింగ్ - వైఎస్ఆర్‌సీపీ కొత్త వ్యూహం !

ఎమ్మెల్యేల పీఏలకూ ట్రైనింగ్ ఇస్తున్నారు వైఎస్ఆర్‌సీపీ నేతలు. గడప గడపకూ వెళ్తున్న ఎమ్మెల్యేలకు వస్తున్న విజ్ఞప్తులపై వీరు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.


Training For YSRCP MLA PAs :   ఎమ్మెల్యేలకు రాజకీయ పార్టీలు శిక్షణా తరగతులు పెట్టడం చాలా సార్లు జరిగింది. కానీ ఎమ్మెల్యేల పీఏలకు కూడా ఇలా ట్రైనింగ్ క్లాసులు పెట్టడం అరుదు. ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యేల పీఏల విధులు కూడా కీలకం అని భావిస్తోంది. అందుకే ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంది. వారి కోసం తాడేపల్లిలోని వైఎస్ఆర్‌సీపీ ఆఫీసులో ప్రత్యేక్ష శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది.  ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు వర్క్ షాప్ నిర్వహించారు. ఇప్పుడు విజసాయిరెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేల పీఏలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. 

గడప గడపకూ వెళ్తున్న ఎమ్మెల్యేల పీఏలకూ ట్రైనింగ్ 

ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అందరూ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలా వెళ్తున్నప్పుడు ప్రజలు అనేక రకాల సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నారు. వినతి పత్రాలు ఇస్తున్నారు. సీఎం జగన్ ఈ కార్యక్రమం పెట్టిన ఉద్దేశం ప్రజల సమస్యలను గడప వద్దే పరిష్కరించడం.  అయితే జనంలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలు  ప్రజల సమస్యలు, ఆర్జీలను తీసుకుంటున్నారు కానీ పరిష్కారంపై పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు. నిజానికి ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని నోట్ చేసుకోవాల్సింది.. వినతి పత్రాలు తీసుకోవాల్సింది పర్సనల్ అసిస్టెంట్లే. ఎమ్మెల్యేలు ఇతర పనుల వల్ల దృష్టి పెట్టలేకపోయినా పీఏలే వాటి సమస్యల పరిష్కారానికి ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. 

ప్రజల నుంచి వస్తున్న సమస్యల పరిష్కారానికి యాప్ 

ప్రజల సమస్యలకు స్పందించడం కీలకంగా కాబట్టి పీఏల పాత్ర ముఖ్యమైనదని వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు గుర్తించారు. అందుకే ఓ ప్రత్యేకంగా యాప్ కూడా తయారు చేయించారు. ఎమ్మెల్యేలకు గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేసి పరిష్కారనికి ఫాలో అప్ చేసేలా కొన్ని బాధ్యతలు అదనంగా ఇస్తున్నారు. ఈ అంశంపై మరింత ట్రైనింగ్ అవసరం కాబట్టి పీఏలను ఆఫీసుకు పిలిపించి మరీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ట్రైనింగ్‌లో పాల్గొంటున్న ఐప్యాక్ బృందం

గడపగడపూ కార్యక్రమాన్ని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరగడం కీలకమనుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెడుతున్నారు. ఈ విషయంలో ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా పని చేస్తున్న ఐ ప్యాక్ కూడా కొత్త సలహాలు, సూచనలు ఇస్తోంది. ఈ ప్రకారమే గడప గడపలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంటే.. వైఎస్ఆర్‌సీపీలో ఎమ్మెల్యేలే కాదు వారి పీఏలకూ ప్రాధాన్యం ఉందన్నమాట. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Bengal Assembly elections 2026: రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget