అన్వేషించండి

YSRCP Leaders : కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?

Andhra Politics: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా కేసుల వలలో ఉన్నా హైకమాండ్ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అందుకే వారంతా సైలెంట్ అయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

YSRCP high command not helping the YCP leaders and cadre: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పుడు మాట్లాడేందుకు ఎవరు బయటకు వస్తున్నారు అని చూస్తే.. కళ్ల ముందు ఒక్క అంబటి రాంబాబు మాత్రమే కనిపిస్తున్నారు. అప్పుడప్పుడూ రోజా వస్తున్నారు. మహిళల్ని అరెస్టు చేయవద్దని చంద్రబాబు స్పష్టం చేశారన్న విషయం బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎక్కువగా మీడియా ముందుకు వస్తున్నారు. అయితే మిగతా అగ్రనేతలు ఎవరూ ప్రభుత్వంపై పోరాటానికి ముందుకు రావడం లేదు. చివరికి విజయసాయిరెడ్డి వంటి నేతలు రాజకీయ సన్యాసం ప్రకటించేస్తున్నారు. దీనంతటికి కారణం హైకమాండ్ అండగా ఉంటామన్న భరోసా ఇవ్వకపోవడమేనని ఆ  పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. 

పేర్ని నాని నుంచి పెద్దిరెడ్డి వరకూ అందరికీ ఎన్నో సమస్యలు !

పేర్ని నాని గతంలో తరచుగా మీడియా ముందుకు వచ్చేవారు. ఇప్పుడు ఆయన కూడా కనిపించడం లేదు. ఆయనపై బియ్యం మాయం కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో కిందా మీదా పడి ఆయన కుటుంబం అరెస్టు కాకుండా రక్షించుకునేందుకు ఎవరికీ కనిపించకుండా తిరిగారు. ఎలాగోలా అరెస్టు నుంచి రక్షణ పొందినా ఆయన మీడియా ముందుకు రావడం లేదు. నియోజకవర్గంలో పెద్దగా తిరగడం లేదు. ఒక్క పెద్దిరెడ్డి కాదు శ్రీకాకుళంలో ధర్మాన దగ్గర నుంచి కడపలో శ్రీకాంత్ రెడ్డి వరకూ అందరూ వీలైనంత వరకూ మౌనం పాటిస్తున్నారు. దీంతో వైసీపీ పూర్తి స్తబ్దతగా మారిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనంతటికి కారణం అధికారం పోవడం వల్ల వచ్చి పడిన ఒత్తిళ్లే. అధికారంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని కార్యకలాపాల వల్ల ఇప్పుడు వారు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. 

కేసుల్లో పార్టీ నుంచి వారికి లభిస్తున్న సహకారం శూన్యం ! 

పార్టీ ముఖ్యనేతలు కేసుల పాలైనా పార్టీ నుంచి సహకారం అందకపోవడం చాలా మంది సీనియర్ నేతల్ని కూడా అసంతృప్తికి గురి చేస్తోందని చెబుతున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ .. అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఐదు నెలల పాటు జైల్లో ఉన్నారు. మొదట్లో ఆయనకు మద్దతుగా వైసీపీ నుంచి కాస్త సహకారం లభించినప్పటికీ తర్వాత వారు కూడా పట్టించుకోలేదు. చివరికి నందిగం సురేష్ భార్య పోరాడి .. ఎలాగోలా బెయిల్ తెచ్చుకున్నారని చెబుతున్నారు. బెయిల్ పై నందిగం సురేష్ బయటకు వచ్చే సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక్క వైసీపీ నేత కూడా ఆయనకు స్వాగతం చెప్పేందుకు రాలేదు. దీంతో ఆయన హతాశుడయ్యారు. రాజకీయ పరమైన కేసు అని ప్రజల్లోకి వెళ్లాలంటే పార్టీ సపోర్టు ఉండాలని లీడర్లు కోరుకుంటారు.కానీ పార్టీ సపోర్టు లేకపోవడంతో వారు వీలైనంత వరకూ సైలెంట్ గా ఉండాలని అనుకుంటున్నారు. 

క్యాడర్ నూ పట్టించుకోకపోవడంతో సమస్యలు 

లీడర్లతో పాటు క్యాడర్ కూడా సమస్యల్లో ఉంది. పార్టీ అధికారం పోయిన వెంటనే చాలా మంది సోషల్ మీడియా కార్యకర్తలు అకౌంట్లను డీయాక్టివేట్ చేసుకుని ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే కొంత మంది మాత్రం పార్టీ అండగా ఉంటుందని నిలబడి పోరాడాలనుకున్నారు. వారిపై కేసులు నమోదు కావడంతో చాలా రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ప్రత్యేకంగా లాయర్ల బృందాన్ని పెట్టినట్లుగా ప్రకటించినప్పటికీ ఆ సహకారం ఎవరికీ అందలేదు. దీంతో వైసీపీ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. హైకమాండ్ పార్టీ నేతలు, కార్యకర్తలకు అండగా ఉండకపోవడం వల్లే ఈ సమస్యలు వచ్చాయని ఆ పార్టీ వారు అనుకుంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Assam Assembly Elections 2026: అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget