అన్వేషించండి

AP Politics: జగన్ శాశ్వత మిత్రుడన్న వివాదంతో బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు? పవన్ ప్రశ్నకు సమాధానం ఎవరిస్తారు?

Alliance Government: నేరుగా అమిత్ షా పేరు వాడుకుని జగన్‌కు బీజేపీ శాశ్వత స్నేహితుడని ప్రచారం చేస్తే బీజేపీ నేతలు స్పందించడం లేదు.దీనిపై పవన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మనసులో ఏముంది?

Pawan Kalyan: "బీజేపీకి జగన్ మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు" అంటూ  ఒక రాజకీయ విశ్లేషకుడు చేసిన విశ్లేషణ తెలుగు రాష్ట్రాల్లో అగ్గి రాజేసింది. అయితే, ఈ వివాదంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం బీజేపీ వైఖరి. ఏపీలో కూటమి భాగస్వాములైన టీడీపీ, జనసేనలు  విశ్లేషకుడిపై  యుద్ధం ప్రకటిస్తుంటే, బీజేపీ మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించింది. జగన్ విషయంలో తమ వైఖరి ఏంటనేది స్పష్టం చేయకుండా బీజేపీ సైలెంట్‌గా ఉండటం, కూటమిలోని ఇతర పార్టీలకు మింగుడుపడటం లేదు.  అసలు నాగేశ్వర్ వ్యాఖ్యలను బీజేపీ ఎందుకు ఖండించడం లేదు? జగన్ తమకు మిత్రుడు కాదని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతోంది?  ఇదే విషయాన్ని నేరుగా పవన్ ప్రశ్నించారు. 

పవన్ నిలదీత.. సమాధానం ఎవరి దగ్గర? 

మంగళగిరి వేదికగా పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలు నేరుగా బీజేపీ వైఖరిని కూడా తట్టిలేపేలా ఉన్నాయి.  ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ఆయన సూటిగానే ప్రశ్నించారు. "మేము ఢిల్లీ వెళ్తే కేవలం జగన్ అరెస్టు గురించే మాట్లాడతామా?" అని పవన్ ప్రశ్నించడం ద్వారా, తాము కూటమి ధర్మాన్ని పాటిస్తున్నామని చెప్పారు. కానీ,  వాళ్లు  ఆరోపించినట్లు.. బీజేపీ అధిష్టానం నిజంగానే వైసీపీ పట్ల మెతక వైఖరితో ఉందా? అనే అనుమానం సామాన్య ప్రజల్లో కూడా మొదలైంది. పవన్ అడిగిన ప్రశ్నలకు రాజకీయంగా విలువున్నా, దానికి అసలైన సమాధానం చెప్పాల్సింది మాత్రం   బీజేపీ నాయకత్వమే. అయితే, వారు నోరు మెదపకపోవడం పవన్ వంటి మిత్రపక్ష నేతలను ఆత్మరక్షణలో పడేస్తోంది.

 మురళీధర్ రావు ట్విస్ట్.. కూటమిలో చిచ్చు? 

ఏపీ బీజేపీ నేతలు మౌనంగా ఉంటే, తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత మురళీధర్ రావు ఏకంగా నాగేశ్వర్‌ను సమర్థించడం కూటమిలో కొత్త చర్చకు దారితీసింది. ఇది కేవలం నాగేశ్వర్ వ్యక్తిగత గౌరవం గురించిన విషయమా లేక బీజేపీ అంతర్గతంగా వైసీపీకి అనుకూలంగా ఉందనే సంకేతమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో టీడీపీ-జనసేనలతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న బీజేపీ, తెలంగాణకు వచ్చేసరికి భిన్నమైన గొంతు వినిపించడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. నాగేశ్వర్‌పై కేసులు పెట్టడాన్ని తప్పుబట్టడం ద్వారా, ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో తమకు సంబంధం లేదని బీజేపీ చెప్పకనే చెబుతోంది.

 తెలంగాణ వర్సెస్ ఏపీ.. ప్రాంతీయ చిచ్చు 

ఈ వివాదాన్ని తెలంగాణ 'ప్రైడ్' ఇష్యూగా మార్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. నాగేశ్వర్ వంటి మేధావిపై ఏపీ పోలీసులు కేసు పెట్టడాన్ని తెలంగాణ ఆత్మగౌరవంపై దాడిగా ఇక్కడి నేతలు అభివర్ణిస్తున్నారు. ఇది చినికి చినికి గాలివానలా మారి, రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలకు దారితీసే ప్రమాదం ఉంది. నాగేశ్వర్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారం తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ అదే జరిగితే, తెలంగాణలో ఉన్న ఏపీ వ్యతిరేక శక్తులకు అది పెద్ద ఆయుధంగా మారుతుంది.  విశ్లేషణలో నిజముందో లేదో పక్కన పెడితే, ఇంత తీవ్రంగా స్పందించడం వల్ల "జగన్-బీజేపీ రహస్య స్నేహం" అనే వార్తకు ప్రభుత్వం తానే స్వయంగా ప్రాచుర్యం కల్పించినట్లయింది.  
 
చివరికి తేలేదేమిటంటే.. పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏపీ పోలీసుల దగ్గరో లేక కోర్టుల దగ్గరో లేదు, అది కేవలం బీజేపీ అగ్రనాయకత్వం దగ్గరే ఉంది. జగన్ తమకు మిత్రుడు కాదని వారు బహిరంగంగా ప్రకటించే వరకు నాగేశ్వర్ వంటి విశ్లేషకులు చేసే వ్యాఖ్యలకు బలం చేకూరుతూనే ఉంటుంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడంలో బీజేపీ విఫలమైతే, అది కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల ప్రతిష్టకు తీరని నష్టం కలిగిస్తుందని అనుకోవచ్చు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
Telangana Political Narrative : రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
JC Prabhakar Reddy Tadipatri Politics: తాడిపత్రి చదరంగం - వైసీపీతో కాదు.. పెద్దారెడ్డితోనే ఫైట్! జేసీ మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఇదీ
తాడిపత్రి చదరంగం - వైసీపీతో కాదు.. పెద్దారెడ్డితోనే ఫైట్! జేసీ మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఇదీ
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget