అన్వేషించండి

Chandrababu Politics: ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ - చంద్రబాబు అసలు వ్యూహం అదే!

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. వైసిపి నుండి టీడీపీ కు పెరుగుతున్న వలసలు పెరుగుతున్నాయి. చంద్రబాబు అసలు స్కెచ్ అదే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అమరావతి: వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు రాజ్య సభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. మరో రెండు రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు పోతుల సునీత పార్టీకి రాజీనామా కూడా చేసేశారు. ఇదే బాటలో మరికొంత మంది వైసీపీ ఎమ్మెల్యే లు, ఎంపీలు ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా ప్రచారం జరుగుతోంది.

జగన్ కు షాక్ ఇవ్వబోతున్న మోపిదేవి వెంకట రమణ

వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహిత మిత్రుడు గా పేరున్న మోపిదేవి వెంకటరమణ గత కొంతకాలం నుంచి తీవ్ర అసహనంతో అన్నారు. జగన్ తో పాటు జైలుకు సైతం వెళ్లి వచ్చిన ఆయన 2019 లో మత్స్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జగన్ చేసిన మార్పుతో రాజ్యసభ ఎంపీ అయ్యారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక వేరే వ్యక్తుల అజమాయిషీ ఎక్కువైంది అనేది ఆయన ఫీలింగ్ గా మోపిదేవి సన్నిహితులు చెబుతుంటారు. పేరుకు బీసీల పార్టీ అని చెబుతారు. కానీ కొంతమంది రెడ్ల డామినేషన్ ఎక్కువైపోయింది అని జగన్ తో పాటు జైలుకు వెళ్లి వచ్చింది తామైతే.. ఇప్పుడు బయటినుండి వచ్చిన వాళ్ల ఒత్తిడి తనపై ఎక్కువైంది అని తన ఇన్నర్ సర్కిల్ లో ఉండే వారివద్ద బాధపడ్డట్టు చెబుతుంటారు. దానితో పార్టీ మారడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్టు రేపు లేదా ఎల్లుండి  వైసీపీ పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు ఈ బీసీ నాయకుడు.

వైసీపీకి రాజీనామా చేసేసిన పోతుల సునీత

ఎమ్మెల్సీ పోతుల సునీత ఆల్రెడీ వైసీపీ పార్టీకి రాజీనామా చేసేశారు. గతంలో టీడీపీ నుండి వైసీపీకి వెళ్ళిన ఆమెకు ఎమ్మెల్సీ పదవి దక్కింది.. అయితే 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తరువాత ఆమె కాస్త సైలెంట్ గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా వైసీపీ కు గుడ్ బై చెప్పేశారు. త్వరలో ఆమె కూడా మళ్ళీ టీడీపీ లోకి వెళ్ళిపోయే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు ఆమె సన్నిహితులు.

అదే రూట్ లో మరికొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు
వైసిపి పార్టీకి చెందిన మరికొందరు ఎంపీలు , ఎమ్మెల్యేలు కూడా జంప్ జిలానీ కావడానికి సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందే 11 మంది ఎమ్మెల్యే సీట్లు. వారిలో జగన్ మినహా ఉన్నది 10 మంది ఎమ్మెల్యేలు. మరి వారిలో ఎంతమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారో తెలియాలంటే కాస్త వేచి చూడాలి. అలాగే ఎంపీలు సైతం ముఖ్యంగా రాజ్యసభ నుండి ఎవరెవరు పార్టీ నుండి జంప్ అవుతారు అన్నది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఆశక్తి కరంగా మారింది. అన్నట్టు వీరిలో సింహభాగం టీడీపీ వైపే చూస్తున్నా .. కొందరు మాత్రం జనసేన , బీజేపీల బాట పట్టేందుకు కూడా ఎదురు చూస్తున్నట్టు ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి 

అసలు చంద్రబాబు స్కెచ్ ఏమిటి??

ఆ జంపింగ్ జపాంగ్ లను చంద్రబాబు ఎందుకు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. గతంలో వైసీపీ నుండి ఎమ్మెల్యే లను చేర్చుకుని 2019 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో ఇంచుమించు అలాగే కుదేలయ్యారు జగన్ మోహన్ రెడ్డి. మరి ఏ దైర్యంతో ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది కూటమి పార్టీలంటే కనపడుతున్న ఒకేఒక సమాధానం నియోజక వర్గాల పెంపు.

2029 నాటికి పెరగనున్న నియోజక వర్గాల సంఖ్య
ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ నియోజక వర్గాలు 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. వీటిని పెంచాల్సిన అవసరం ఉందని చాలా ఏళ్లుగా కేంద్రాన్ని అడుగుతోంది ఏపీ. అయితే  2029 వరకూ అది కుదిరేపని కాదని చెప్పిన కేంద్రం గడువు దగ్గర పడుతున్నకొద్దీ ఆ దిశగా అడుగులు వేస్తోంది . త్వరలోనే ఏపీ లో నియోజక వర్గాల సంఖ్య మరో 50 పెరిగి 225 కు చేరుకోనుంది. అప్పుడు రాష్ట్రం లో గెలుపు ఓటముల ఈక్వేషన్స్ మారిపోతాయి. కాబట్టి ఇప్పటినుండే ప్రామినెంట్ లీడర్ల ను పార్టీ లోకి ఆహ్వానించే పనిలో పడ్డారు చంద్రబాబు. ఎలాగూ నియోజక వర్గాలు పెరుగుతాయి కాబట్టి క్రొత్త వాళ్ళు వచ్చినా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరిగే అవకాశం చాలా తక్కువ. అందుకే మాష్టర్ ప్లానర్ గా పేరొందిన చంద్రబాబు ఈ వ్యూహం పన్నారు అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి అవి ఏ మేరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి అంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

Also Read: Allu Aujun: 'అల్లు అర్జున్‌కు మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదు' - మరోసారి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Assam Assembly Elections 2026: అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?

వీడియోలు

ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget