అన్వేషించండి

TRS Again Sentiment Plan : ఈ సారి అదే బ్రహ్మాస్త్రాన్ని వాడనున్న టీఆర్ఎస్ ! అదొక్కటే మార్పు - మిగతా అంతా సేమ్ టు సేమ్ !

వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్నే నమ్ముకోవాలని టీఆర్ఎస్ వ్యూహం ఖరారు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ సారి టీఆర్ఎస్ దృష్టిలో తెలంగాణ విలన్ మారనున్నారు.

 
TRS Again Sentiment Plan :  తెలంగాణలో ఎన్నికల వేడి అప్పుడే పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు తమ తమ వ్యూహాలు ఖారారు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఈ విషయంలో కొంత క్లారిటీ ఉంటుంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను తమకు ఓట్లుగా మల్చుకోవడమే వారి టాస్క్. దానికి వారు ఏ మార్గంలో వెళ్తారన్నది డిసైడ్ చేసేసుకున్నారు. వారి మార్గంలో వెళ్తున్నారు. అయితే అధికార పార్టీకి మాత్రం ఇప్పుడు తాము ఏ మాత్రంలో వెళ్లాలన్నది ఇప్పటి వరకూ ఓ చాయిస్‌గా ఉండిపోయింది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. 

రకరకాల ఫార్ములాలు వర్కవుట్ చేసిన కేసీఆర్ !

వచ్చే ఎన్నికల్లో ఏ అంశంపై పోటీ చేయాలన్నదానిపై ఇప్పటి వరకూ టీఆర్ఎస్ రకరకాల సమీకరణఆలపై వర్కవుట్ చేసింది. గత ఎన్నికలకు ముందు రైతు బంధు పథకాన్ని ఎలా ట్రంప్ కార్డ్‌గా ఉపయోగించుకున్నారో ఈ సారి అలాగే దళిత బంధును ఉపయోగించుకోవాలనుకున్నారు. కానీ హుజురాబాద్ మొత్తం అమలు చేసినా సరైన ఫలితం రాకపోవడంతో  ఇప్పుడు అదొక్కటే సరిపోదని డిసైడయ్యారు. దళిత వర్గాన్ని గుంపగుత్తగా సపోర్టర్లుగా మార్చుకోవడంతో పాటు ఇతర సామాజిక సమీకరణాలు వర్కవుట్ చేసి  వాటినే ఎజెండాగా చేసి వెళ్లాలనుకున్నారు. కానీ అనుకున్న ఫలితం రాలేదు. ఓ సారి రైతు అజెండాను హైలెట్ చేయాలని ప్రయత్నం చేశారు. అయితే అదీ వర్కవుట్ కాలేదు. దీంతో కేసీఆర్ ఇప్పుడు తీవ్రంగా ఆలోచించి పాత మార్గంలోనే పయనించాలని నిర్ణయించారు. 

తెలంగాణ సెంటిమెంటే శ్రీరామరక్ష అనుకుంటున్నకసీఆర్ !

టీఆర్ఎస్ అనే పార్టీకి పునాది తెలంగాణ సెంటిమెంట్. ఇప్పుడు వట వృక్షలా ఎదగడానికి కూడా తెలంగాణ సెంటిమెంటే కారణం. ఎన్నికల రాజకీయాల్లో ఎప్పుడు టీఆర్ఎస్ ఘన విజయాలు సాధించినా ఆ క్రెడిట్ తెలంగాణ సెంటిమెంట్‌దే. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ .. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్న ఊపులో విజయం సాధించింది. రెండో సారి గెల్చినప్పుడు సెంటిమెంట్ లేదనుకున్నారు. కానీ ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు..  కేసీఆర్‌తో తానే పోటీపడుతున్నట్లుగా ప్రచారం చేయడంతో కేసీఆర్ ఆ అస్త్రాన్ని అందిపుచ్చుకున్నారు. సెంటిమెంట్‌తో ఘన విజయం సాధించారు. కానీ ఇప్పుడు అప్పటి పరిస్థితులు లేవు. చంద్రబాబు లేరు. ఏపీ రాజకీయ పార్టీలు లేవు. మరి సెంటిమెంట్  ఎలా ? . అందు కోసమే కేసీఆర్ ఇంత వరకూ చేసిన ఢిల్లీ రాజకీయం అని అంచనా వేస్తున్నారు. 

అప్పట్లో ఆంధ్రా పాలకులు.. ఇప్పుడు కేంద్ర పాలకులు !

తెలంగాణ ప్రజలు తాము వివక్షకు గురవుతున్నామని భావిస్తే సహించరు. కచ్చితంగా ఇదే పాయింట్ పట్టుకున్న కేసీఆర్ ఆంధ్ర పాలకులు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం చేశారని ఉద్యమాన్ని నిర్మించగలిగారు. ఇప్పుడు ఆంధ్ర అంశం తెలంగాణలో లేదు కాబట్టి... సెంటిమెంట్  కోసం  కేంద్ర పాలకుల్ని చూపించాలని కేసీఆర్ వ్యూహం అమల్లో పెట్టినట్లుగా భావిస్తున్నారు. కొంత కాలంగా తెలంగాణ విషయంలో కేంద్ర నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ముందు ఇదే అజెండాగా టీఆర్ఎస్ రాజకీయం ఉండే అవకాశం ఉంది. 

అభివృద్ధి ప్రచారంతో కొన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం !

నిజానికి ఓ సందర్భంలో కేసీఆర్ .., తాము సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి మూడోసారి పట్టం కట్టాలని అభ్యర్థించాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో అనూహ్యమైన అభివృద్ధి సాధించింది. హైదరాబాద్ రూపు రేఖలు మారిపోయాయి. విదేశీ లుక్ వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలకే నీటి సమస్యను తీర్చేశారు. రోడ్ల వంటి మౌలిక  సదుపాయాలను భారీగా కల్పించారు. ఎలా చూసినా టీఆర్ఎస్ సర్కార్ పనితీరు బెటర్ గా ఉంది. అయితే అభివృద్ధి అనేది ఎన్నికల్లో గెలవడానికి కొలమానం కాదని.. కొంత వరకూ హెల్ప్ చేయవచ్చు కానీ.. దానిపైనే ఆధారపడలేమన్న కారణంగా మళ్లీ సెంటిమెంట్ పైనే వర్కువుట్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. 

తెలంగాణ సెంటిమెంట్‌ను ఎన్నికల ఎజెండాగా పెట్టుకున్న ప్రతీ సారి టీఆర్ఎస్ ఘన విజయాలుసాధిస్తూ వస్తోంది. ఈ సారి కూడా అదే అస్త్రంరెడీ చేసుకుంటోంది. అయితే ఈ సారి టీఆర్ఎస్ రాజకీయంగా చూపించే విలన్ మాత్రం మారాడు. ఈ ఫైట్‌లో కేసీఆర్ విజయం సాధిస్తారా లేదా అన్నది ఎన్నికల తర్వాత తేలుతుంది.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Assam Assembly Elections 2026: అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget