అన్వేషించండి

BRS Back Track : బీజేపీతో "దర్యాప్తు యుద్ధం"లో కేసీఆర్ బిజీ - జాతీయ పార్టీ కసరత్తు నెమ్మెదించిందా ?

బీఆర్ఎస్ విషయంపై ఆలోచించడానికి కూడా టీఆర్ఎస్ నేతలకు సమయం చిక్కడం లేదు. కేసీఆర్ కూడా "దర్యాప్తు వార్‌"పైనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

 

BRS Back Track :   తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ ముందు ఇప్పుడు పెసు సవాళ్లు ఉన్నాయి. ఓ వైపు కేంద్రంతో రాజకీయ యుద్ధంతో పాటు మరో వైపు దర్యాప్తు సంస్థలతోనూ పోటీ పడుతున్నారు. వీటితో పాటు పాలనా వ్యవహారాలు... చూసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో జాతీయ పార్టీ సన్నాహాలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. బీఆర్ఎస్ ఆవిర్భావం ఓ రేంజ్‌లో ఉండేలా చూసుకోవాలనుకుంటున్నా..  సన్నాహాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. షెడ్యూల్ ప్రకారం అయితే.. వచ్చే నెల మొదటి వారంలో అంటే ఏడో తేదీలోపు టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలన్నదానిపై కేసీఆర్ ఇంకా ఎలాంటి స్పష్టతకు రాలేకపోతున్నారు. 

ఢిల్లీలో బహిరంగసభ ఉన్నట్లా ? లేనట్లా ?

డిసెంబర్ ఏడో తేదీ లోపున తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్ర సమితిగా మారిపోతుంది. వెంటనే తొమ్మిదో తేదీన ఢిల్లీలో భారీ బహిరంగసభ పెట్టి విధి విధానాలు ప్రకటించాలని అనుకున్నారు. బీఆర్ఎస్ గురించి కేసీఆర్ రాష్ట్ర స్థాయిలో ప్రకటించాలనుకోవడం లేదు. అది జాతీయ స్థాయిలోనే ఉండాలనుకుంటున్నారు. అందుకే ఇప్పటి వరకూ బీఆర్ఎస్ గురించి కేసీఆర్ బయట ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేశ ప్రజలందరి ముందే తన ఆలోచనలు.. జెండా, అజెండా ప్రకటించాలనుకుకుంటున్నారు. డిసెంబర్ 9వ తేదీ దాని కోసం ముహుర్తం అనుకున్నట్లుగా గతంలో చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలంగాణలో దర్యాప్తు సంస్థలు ఒకరి తర్వాత ఒకరు టీఆర్ఎస్ లీడర్లను టార్గెట్ చేస్తున్నాయి. ఈ అంశంపైనా కేసీఆర్ దృష్టి సారించాల్సి వస్తోంది. 

జాతీయ దర్యాప్తు సంస్థల దూకుడును అడ్డుకునేందుకు కేసీఆర్ వ్యూహాలు !

కేసీఆర్ రోజువారీ దినచర్యలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేయబోతున్నాయి.. ఎలా ఎదుర్కోవాలి.... పార్టీ నేతలకు ఎలా భరోసా ఇవ్వాలన్న అంశంపైనే ఎక్కువగా సమాలోచనలు జరుపుతున్నారు. బీజేపీ దర్యాప్తు సంస్థలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా..  టీఆర్ఎస్ చేతిలో ఎమ్మెల్యేలకు ఎర కేసు ఉంది. ఈ కేసు విషయంలో ఆయన బీజేపీ పెద్దలకు షాకిచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారు. స్వయంగా కేసీఆర్ ఈ కేసు దర్యాప్తుపై అప్ డేట్స్ తెలుసుకుని ప్రత్యేకమైన సూచనలు ఇస్తున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో.. ఐటీ, ఈడీ దాడుల వ్యవహారాలను తెలుసుకుని.. పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల హిట్ లిస్ట్‌లో తర్వాత ఎవరు ఉన్నారు.. వారెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో బీజీగా ఉండటంతో  బీఆర్ఎస్‌పై జరగాల్సినంత మేథోమథనాన్ని జరపలేకపోతున్నారని అంటున్నారు. 

ఢిల్లీలో అందర్నీ సమన్వయం చేసుకునేదెప్పుడు ?

టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన వెంటనే.. వివిధ రాష్ట్రాల ఇంచార్జులను ప్రకటించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలపై ఓ స్పష్టత వచ్చింది. రైతు సంఘాల నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో చిన్న పార్టీలతో కలిసి నడుస్తారు. అయితే ఇలాంటి వారందరితో కేసీఆర్ ఢిల్లీలో  చర్చలు జరపాల్సి ఉంది. ఇందు కోసం ఆయన ఢిల్లీ వెళతారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. 

డిసెంబర్‌ 5న ప్రధానితో భేటీకి వెళ్తారా ?

డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం ఉంది. జీ 20 దేశాల కూటమికి ప్రస్తుతం భారత్ నేతృత్వం వహిస్తోంది.  ప్రధాని మోదీ ఈ నాయకత్వాన్ని .. ప్రపంచంలో భారత్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేలా చేయాలనుకుంటున్నారు. అందు కోసం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్‌కూ కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి.. ఆహ్వానించారు. అయితే మోదీతో సమావేశం అంటే.. కేసీఆర్ ఇటీవలి కాలంలో పూర్తి స్థాయిలో దూరం పాటిస్తున్నారు. ఈ సమావేశానికీ వెళ్లరని భావించవచ్చు. అయితే ఇది దేశానికి సంబంధించిన అంశం కాబట్టి వెళ్లే అవకాశం ఉండొచ్చంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

New Political Parties in Telangana: తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
Almatti Dam Height Dispute 2026: దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
Telangana Cabinet Expansion Postponed 2026: తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
Modi Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget