అన్వేషించండి

Three Capitals : 3 రాజధానుల ఇష్యూలో ప్రభుత్వానికీ అన్నీ ఎదురు దెబ్బలే - అయినా ఎందుకంత పట్టుదల ?

మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి మొదటి నుంచి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందుకే వెళ్తామంటోంది. దీనికి కారణం ఏమిటి?

 

Three Capitals :  మూడు రాజధానులను పెట్టబోతున్నానని ఏపీ సీఎం జగన్ ప్రకటించి వెయ్యి రోజులు అయింది. కానీ ఇంత వరకూ ఒక్క అడుగు ముందుకేయలేకపోయారు. అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నిర్మించాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది.  అసాధారణంగా రిట్ ఆఫ్ మాండమస్ ... తీర్పు ఇచ్చింది.  అంటే ప్రభుత్వం ఏ విధంగానూ ఇక మూడు రాజధానులు చేయలేదు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఆ తీర్పునూ ఉల్లంఘిస్తామని నిర్మోహమాటంగా చెబుతోంది. మూడు రాజధానులు తధ్యమని వాదిస్తోంది. ఎలా చేసినా అది తీర్పు ఉల్లంఘన.. రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ముందుకెళ్తోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా ఇలా ఎందుకు ప్రభుత్వం ముందుకెళ్తోంది ? 

వెయ్యి రోజుల కిందట..  మూడు రాజధానుల వివాదం !
 
వెయ్యి రోజుల కిందట...ఓ  డిసెంబర్ 17న సీఎం అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయని... అందుకే ఏపీలోనూ పెడుతున్నామని ప్రకటించారు.  అలా ప్రకటించడం ఆలస్యం.. ఇలా వెళ్లిపోదామని  ప్రభుత్వం అనుకుంది.  ఎప్పటికప్పుడు ముహుర్తాలు ఖరారు చేశారు. కానీ..  వెళ్లలేకపోయారు.  మధ్యలో వచ్చిన పాలనాపరమైన.. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించలేకపోయారు. అసలు రాజధాని ఎక్కడ ఉండాలన్నది సమస్యే కాదని.. ఎక్కడ సీఎం ఉంటే అదే రాజధాని అనే వాదన తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకూ సీఎం విశాఖ వెళ్లలేకపోయారు.  ఏపీ రాజధాని ఏది అనే ఓ సస్పెన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. 

 ఎన్నికల్లో గెలిచే వరకూ అమరావతికే మద్దతు.. ఆ తర్వాతే మాట మార్చిన వైఎస్ఆర్‌సీపీ ! 

అమరావతిని గతంలో వైఎస్ఆర్‌సీపీ సమర్థించింది. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్ మద్దతు తెలిపారు. ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలంతా అమరావతే రాజధాని అని.. అన్ని ప్రాంతాల్లో చెప్పారు.  అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు..ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.  అమరావతే రాజధాని అని కుండబద్దలు కొట్టిన నేతలు.. ఇప్పుడు దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అమరావతికి మద్దతు తెలిపిన వీడియోలు..ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సోషల్ మీడియాలో ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నాయి. అయితే అమరావతి రాజధానిగా పనికి రాదని రకరకాల కారణాలు చెప్పారు కానీ ఏదీ శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. కేవలం ఆరోపణలుగానే ఉన్నాయి. దీంతో అమరావతి విషయంలో జగన్ మాట మార్చారని .. ఏపీలో రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు నెలకొల్పారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

మూడున్నరేళ్ల నుంచి అమరావతి నుంచే పాలన..!  
 
గత  ప్రభుత్వానికి అమరావతి మాస్టర్ ప్లాన్ ఫైనల్ అవ్వడానికి, రైతులనుండి భూమి సేకరించడానికి రెండు సంవత్సరాలు పడట్టింది. రాజధానిపై గ్రీన్ ట్రిబ్యూనల్ లో కేసులు వేశారు. దీంతో సమగ్రమయిన ఎత్తిపోతల పధకాన్ని కొండవీటి వాగుకు నిర్మించాకే రాజధాని విషయంలో ముందుకు వెళ్ళాలని హరిత ట్రిబ్యూనల్ ఆదేశించడంతో మరో రెండు సంవత్సరాలు పాటు రాజధాని నిర్మాణం నత్తనడకన సాగింది. ఎత్తిపోతల పధకాన్ని నిర్మించిన తర్వాత రాజధాని పనులు వేగం పుంజుకున్నాయి. పలు బహుళ అంతస్ధుల భవనాలు నిర్మాణం వేగంగా సాగింది. 8నుండి 10 నెలలు కాలంలోనే చాలా భవనాలు 80నుండ 90 ‎శాతం పూర్తయ్యాయి.  ప్రైవేటు వర్సిటీలు ...ప్రభుత్వ భవనాలు...  పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఏ ఇబ్బంది లేకుండా మూడున్నరేళ్ల నుంచి అమరావతి నుంచే పాలన సాగుతోంది. 
 
ఎదురు దెబ్బల నుంచి ప్రభుత్వం ఎందుకు పాఠాలు నేర్చుకోవడం లేదు ?

అమరావతి విషయంలో ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయినప్పటికీ ప్రభుత్వం ఇంకా మొండితనంతో  వ్యవహరిస్తూనే ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. న్యాయపరంగా కూడా దారులు మూసుకుపోయాయి. చట్ట పరంగా చేయలేమని తేలిపోయింది.  రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్‌సీపీ తప్ప.. ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ.. ఇతర సంఘాలు కానీ మూడు రాజధానులకు మద్దతు ఇవ్వడం లేదు. అసలు ఆ కాన్సెప్టే సాధ్యం కాదని చాలా మంది ఉదాహరణలు చెబుతున్నారు. అయినా ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. ఓ వైపు రాజ్యాంగం.. మరో వైపు ప్రభుత్వ పట్టుదల .. ఏపీ రాజధాని విషయంలో ఉన్నాయి. చివరికి ఫలితం ఎటు తేలుతుందో ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
TPCC అధ్యక్షుడ్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆ మీడియాలో కథనాలతో బద్నాం చేయాలని చూస్తున్నారా?
TPCC అధ్యక్షుడ్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆ మీడియాలో కథనాలతో బద్నాం చేయాలని చూస్తున్నారా?
Arava Sridhar Resignation: అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget