అన్వేషించండి

Three Capitals : 3 రాజధానుల ఇష్యూలో ప్రభుత్వానికీ అన్నీ ఎదురు దెబ్బలే - అయినా ఎందుకంత పట్టుదల ?

మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి మొదటి నుంచి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందుకే వెళ్తామంటోంది. దీనికి కారణం ఏమిటి?

 

Three Capitals :  మూడు రాజధానులను పెట్టబోతున్నానని ఏపీ సీఎం జగన్ ప్రకటించి వెయ్యి రోజులు అయింది. కానీ ఇంత వరకూ ఒక్క అడుగు ముందుకేయలేకపోయారు. అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నిర్మించాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది.  అసాధారణంగా రిట్ ఆఫ్ మాండమస్ ... తీర్పు ఇచ్చింది.  అంటే ప్రభుత్వం ఏ విధంగానూ ఇక మూడు రాజధానులు చేయలేదు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఆ తీర్పునూ ఉల్లంఘిస్తామని నిర్మోహమాటంగా చెబుతోంది. మూడు రాజధానులు తధ్యమని వాదిస్తోంది. ఎలా చేసినా అది తీర్పు ఉల్లంఘన.. రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ముందుకెళ్తోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా ఇలా ఎందుకు ప్రభుత్వం ముందుకెళ్తోంది ? 

వెయ్యి రోజుల కిందట..  మూడు రాజధానుల వివాదం !
 
వెయ్యి రోజుల కిందట...ఓ  డిసెంబర్ 17న సీఎం అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయని... అందుకే ఏపీలోనూ పెడుతున్నామని ప్రకటించారు.  అలా ప్రకటించడం ఆలస్యం.. ఇలా వెళ్లిపోదామని  ప్రభుత్వం అనుకుంది.  ఎప్పటికప్పుడు ముహుర్తాలు ఖరారు చేశారు. కానీ..  వెళ్లలేకపోయారు.  మధ్యలో వచ్చిన పాలనాపరమైన.. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించలేకపోయారు. అసలు రాజధాని ఎక్కడ ఉండాలన్నది సమస్యే కాదని.. ఎక్కడ సీఎం ఉంటే అదే రాజధాని అనే వాదన తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకూ సీఎం విశాఖ వెళ్లలేకపోయారు.  ఏపీ రాజధాని ఏది అనే ఓ సస్పెన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. 

 ఎన్నికల్లో గెలిచే వరకూ అమరావతికే మద్దతు.. ఆ తర్వాతే మాట మార్చిన వైఎస్ఆర్‌సీపీ ! 

అమరావతిని గతంలో వైఎస్ఆర్‌సీపీ సమర్థించింది. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్ మద్దతు తెలిపారు. ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలంతా అమరావతే రాజధాని అని.. అన్ని ప్రాంతాల్లో చెప్పారు.  అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు..ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.  అమరావతే రాజధాని అని కుండబద్దలు కొట్టిన నేతలు.. ఇప్పుడు దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అమరావతికి మద్దతు తెలిపిన వీడియోలు..ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సోషల్ మీడియాలో ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నాయి. అయితే అమరావతి రాజధానిగా పనికి రాదని రకరకాల కారణాలు చెప్పారు కానీ ఏదీ శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. కేవలం ఆరోపణలుగానే ఉన్నాయి. దీంతో అమరావతి విషయంలో జగన్ మాట మార్చారని .. ఏపీలో రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు నెలకొల్పారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

మూడున్నరేళ్ల నుంచి అమరావతి నుంచే పాలన..!  
 
గత  ప్రభుత్వానికి అమరావతి మాస్టర్ ప్లాన్ ఫైనల్ అవ్వడానికి, రైతులనుండి భూమి సేకరించడానికి రెండు సంవత్సరాలు పడట్టింది. రాజధానిపై గ్రీన్ ట్రిబ్యూనల్ లో కేసులు వేశారు. దీంతో సమగ్రమయిన ఎత్తిపోతల పధకాన్ని కొండవీటి వాగుకు నిర్మించాకే రాజధాని విషయంలో ముందుకు వెళ్ళాలని హరిత ట్రిబ్యూనల్ ఆదేశించడంతో మరో రెండు సంవత్సరాలు పాటు రాజధాని నిర్మాణం నత్తనడకన సాగింది. ఎత్తిపోతల పధకాన్ని నిర్మించిన తర్వాత రాజధాని పనులు వేగం పుంజుకున్నాయి. పలు బహుళ అంతస్ధుల భవనాలు నిర్మాణం వేగంగా సాగింది. 8నుండి 10 నెలలు కాలంలోనే చాలా భవనాలు 80నుండ 90 ‎శాతం పూర్తయ్యాయి.  ప్రైవేటు వర్సిటీలు ...ప్రభుత్వ భవనాలు...  పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఏ ఇబ్బంది లేకుండా మూడున్నరేళ్ల నుంచి అమరావతి నుంచే పాలన సాగుతోంది. 
 
ఎదురు దెబ్బల నుంచి ప్రభుత్వం ఎందుకు పాఠాలు నేర్చుకోవడం లేదు ?

అమరావతి విషయంలో ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయినప్పటికీ ప్రభుత్వం ఇంకా మొండితనంతో  వ్యవహరిస్తూనే ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. న్యాయపరంగా కూడా దారులు మూసుకుపోయాయి. చట్ట పరంగా చేయలేమని తేలిపోయింది.  రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్‌సీపీ తప్ప.. ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ.. ఇతర సంఘాలు కానీ మూడు రాజధానులకు మద్దతు ఇవ్వడం లేదు. అసలు ఆ కాన్సెప్టే సాధ్యం కాదని చాలా మంది ఉదాహరణలు చెబుతున్నారు. అయినా ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. ఓ వైపు రాజ్యాంగం.. మరో వైపు ప్రభుత్వ పట్టుదల .. ఏపీ రాజధాని విషయంలో ఉన్నాయి. చివరికి ఫలితం ఎటు తేలుతుందో ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
Dutch mayor search for birth mother in Nagpur: ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
Dutch mayor search for birth mother in Nagpur: ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Tesla Full Self Driving Software :టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌పై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం! సభ్యత్వం తీసుకుంటేనే సర్వీస్‌!
టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌పై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం! సభ్యత్వం తీసుకుంటేనే సర్వీస్‌!
Cyber ​​Truck in Amalapuram: అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ - గోదావరి జిల్లాల వాళ్లతో మామూలుగా ఉండదు మరి !
అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ - గోదావరి జిల్లాల వాళ్లతో మామూలుగా ఉండదు మరి !
ED vs I-PAC: మమతా బెనర్జీది దొంగతనమే - ఈడీ వాదనలు - సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మమతా బెనర్జీది దొంగతనమే - ఈడీ వాదనలు - సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Embed widget