అన్వేషించండి

Three Capitals : 3 రాజధానుల ఇష్యూలో ప్రభుత్వానికీ అన్నీ ఎదురు దెబ్బలే - అయినా ఎందుకంత పట్టుదల ?

మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి మొదటి నుంచి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందుకే వెళ్తామంటోంది. దీనికి కారణం ఏమిటి?

 

Three Capitals :  మూడు రాజధానులను పెట్టబోతున్నానని ఏపీ సీఎం జగన్ ప్రకటించి వెయ్యి రోజులు అయింది. కానీ ఇంత వరకూ ఒక్క అడుగు ముందుకేయలేకపోయారు. అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నిర్మించాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది.  అసాధారణంగా రిట్ ఆఫ్ మాండమస్ ... తీర్పు ఇచ్చింది.  అంటే ప్రభుత్వం ఏ విధంగానూ ఇక మూడు రాజధానులు చేయలేదు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఆ తీర్పునూ ఉల్లంఘిస్తామని నిర్మోహమాటంగా చెబుతోంది. మూడు రాజధానులు తధ్యమని వాదిస్తోంది. ఎలా చేసినా అది తీర్పు ఉల్లంఘన.. రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ముందుకెళ్తోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా ఇలా ఎందుకు ప్రభుత్వం ముందుకెళ్తోంది ? 

వెయ్యి రోజుల కిందట..  మూడు రాజధానుల వివాదం !
 
వెయ్యి రోజుల కిందట...ఓ  డిసెంబర్ 17న సీఎం అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయని... అందుకే ఏపీలోనూ పెడుతున్నామని ప్రకటించారు.  అలా ప్రకటించడం ఆలస్యం.. ఇలా వెళ్లిపోదామని  ప్రభుత్వం అనుకుంది.  ఎప్పటికప్పుడు ముహుర్తాలు ఖరారు చేశారు. కానీ..  వెళ్లలేకపోయారు.  మధ్యలో వచ్చిన పాలనాపరమైన.. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించలేకపోయారు. అసలు రాజధాని ఎక్కడ ఉండాలన్నది సమస్యే కాదని.. ఎక్కడ సీఎం ఉంటే అదే రాజధాని అనే వాదన తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకూ సీఎం విశాఖ వెళ్లలేకపోయారు.  ఏపీ రాజధాని ఏది అనే ఓ సస్పెన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. 

 ఎన్నికల్లో గెలిచే వరకూ అమరావతికే మద్దతు.. ఆ తర్వాతే మాట మార్చిన వైఎస్ఆర్‌సీపీ ! 

అమరావతిని గతంలో వైఎస్ఆర్‌సీపీ సమర్థించింది. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్ మద్దతు తెలిపారు. ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలంతా అమరావతే రాజధాని అని.. అన్ని ప్రాంతాల్లో చెప్పారు.  అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు..ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.  అమరావతే రాజధాని అని కుండబద్దలు కొట్టిన నేతలు.. ఇప్పుడు దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అమరావతికి మద్దతు తెలిపిన వీడియోలు..ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సోషల్ మీడియాలో ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నాయి. అయితే అమరావతి రాజధానిగా పనికి రాదని రకరకాల కారణాలు చెప్పారు కానీ ఏదీ శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. కేవలం ఆరోపణలుగానే ఉన్నాయి. దీంతో అమరావతి విషయంలో జగన్ మాట మార్చారని .. ఏపీలో రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు నెలకొల్పారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

మూడున్నరేళ్ల నుంచి అమరావతి నుంచే పాలన..!  
 
గత  ప్రభుత్వానికి అమరావతి మాస్టర్ ప్లాన్ ఫైనల్ అవ్వడానికి, రైతులనుండి భూమి సేకరించడానికి రెండు సంవత్సరాలు పడట్టింది. రాజధానిపై గ్రీన్ ట్రిబ్యూనల్ లో కేసులు వేశారు. దీంతో సమగ్రమయిన ఎత్తిపోతల పధకాన్ని కొండవీటి వాగుకు నిర్మించాకే రాజధాని విషయంలో ముందుకు వెళ్ళాలని హరిత ట్రిబ్యూనల్ ఆదేశించడంతో మరో రెండు సంవత్సరాలు పాటు రాజధాని నిర్మాణం నత్తనడకన సాగింది. ఎత్తిపోతల పధకాన్ని నిర్మించిన తర్వాత రాజధాని పనులు వేగం పుంజుకున్నాయి. పలు బహుళ అంతస్ధుల భవనాలు నిర్మాణం వేగంగా సాగింది. 8నుండి 10 నెలలు కాలంలోనే చాలా భవనాలు 80నుండ 90 ‎శాతం పూర్తయ్యాయి.  ప్రైవేటు వర్సిటీలు ...ప్రభుత్వ భవనాలు...  పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఏ ఇబ్బంది లేకుండా మూడున్నరేళ్ల నుంచి అమరావతి నుంచే పాలన సాగుతోంది. 
 
ఎదురు దెబ్బల నుంచి ప్రభుత్వం ఎందుకు పాఠాలు నేర్చుకోవడం లేదు ?

అమరావతి విషయంలో ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయినప్పటికీ ప్రభుత్వం ఇంకా మొండితనంతో  వ్యవహరిస్తూనే ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. న్యాయపరంగా కూడా దారులు మూసుకుపోయాయి. చట్ట పరంగా చేయలేమని తేలిపోయింది.  రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్‌సీపీ తప్ప.. ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ.. ఇతర సంఘాలు కానీ మూడు రాజధానులకు మద్దతు ఇవ్వడం లేదు. అసలు ఆ కాన్సెప్టే సాధ్యం కాదని చాలా మంది ఉదాహరణలు చెబుతున్నారు. అయినా ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. ఓ వైపు రాజ్యాంగం.. మరో వైపు ప్రభుత్వ పట్టుదల .. ఏపీ రాజధాని విషయంలో ఉన్నాయి. చివరికి ఫలితం ఎటు తేలుతుందో ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Embed widget