అన్వేషించండి

Telangana BJP : తెలంగాణ బీజేపీలో నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి - కమలంలో రగిలిపోతోందెవరు ?

తెలంగాణ బీజేపీలో నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి ఉందని ఆ పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాత, కొత్త నేతల మధ్య మరోసారి అసంతృప్తి రగులుతోందంటున్నారు.

Telangana BJP :  తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఇప్పుడు మరింత ఎక్కువగా అసంతృప్తి పెరిగిపోతోందన్న సూచనలు కనిపిస్తున్నాయి.  నాయకత్వ మార్పు తర్వాత చంద్రశేఖర్, యెన్నం శ్రీనివాసరెడ్డి వంటి వారు పార్టీ మారిపోయారు. ఇటీవల జరుగుతున్న మార్పులతో మరికొంత మంది సీనియర్ నేతలు కూడా మండిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉందని.. ఎప్పుడైనా బద్దలు కావొచ్చునన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. 

వలస నేతలతోనే అసలు సమస్య 

తెలంగాణలో బీజేపీలో మొదటి నుంచి ఉన్న  నేతలకు  ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులకు మధ్య ఆధిపత్య పోరు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.  ఈటల రాజేందర్‌ కు ఇటీవల ప్రాధాన్యత  పెంచారు. అయితే ఆయన  ప్రతి నిర్ణయంపై అభ్యంతరం చెప్పేందుకు ఇతర నేతలు రెడీగా ఉంటున్నారని అంటున్నారు. అదే సమయంలో  కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరితే, ఇప్పుడు  రెండు పార్టీల మధ్య  ఉన్న రహస్య అవగాహన బట్టబయలైందని కొంత మంది ఇప్పటికీ గొణుక్కుంటున్నారు.  బీజేపీలో ఉంటే కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడలేమన్న అభిప్రాయంలో ఉన్నారు. 

ఆపరేషన్ ఆకర్ష్ లో ఫెయిలయిన ఈటల 

బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ నుంచి భారీ ఎత్తున చీలికలు తెచ్చి, నేతల్ని బీజేపీలోకి తెస్తారని ఆశించారు.  అలాంటిదేం అక్కడ జరక్కపోవడంతో ఈటలపై పార్టీ పెద్దలు కూడా నమ్మకం కోల్పోతున్నారు. ఇటీవల ఖమ్మం సభలో ఇరవై రెండు మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు పార్టీలో చేరుతారని ప్రచారం చేశారు. కానీ.. ఒక్కరు కూడా చేరలేదు. దీంతో ఆయనకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. 

అసలే చేరికల్లేవు.. అరకొర చేరికలతో అనేక సమస్యలు 

 ఈటల రాజేందర్‌ వ్యవహారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డికి ఇబ్బందికరంగా మారినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సీ కృష్ణయాదవ్‌ను బీజేపీలో భూకంపం బీజేపీలోకి తెచ్చేందుకు  ఈటల రాజేందర్‌ పూర్తిస్థాయి కసరత్తు చేశారు. ఆయన పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. కృష్ణయాదవ్‌ కూడా తాను ఆగస్టు 30న బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. దానిలో భాగంగా హైదరాబాద్‌ సిటీలో తనతో పాటు ఈటల రాజేందర్‌, మోడీ, అమిత్‌షా, నడ్డాల ఫోటోలతో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  పార్టీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాక, అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి అడ్డుపడ్డారు.  తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా కృష్ణయాదవ్‌ను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆయన ఈటలతో వాగ్వివాదానికి దిగినట్టు తెలిసింది.  అదే రోజు ఉదయం మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగరరావు కుమారుడిని కాషాయకండువా కప్పి కిషన్‌రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  అక్కడ తుల ఉమకు వేములవాడ టిక్కెట్‌ ఇప్పిస్తాననే హామీతో ఈటల రాజేందర్‌ తనతోపాటు బీజేపీలోకి తెచ్చారు. 

కీలక నేతలు కాంగ్రెస్ లో టచ్‌లో ఉన్నారని ప్రచారం 

యొన్నం శ్రీనివాసరెడ్డి తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ప్రకటించారు.  మరికొంత మంది సీనియర్ నేతలు కూడా అదే బాటలో ఉన్నారంటున్నారు.  తనతో పాటు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జీ వివేక్‌, రవీంద్రనాయక్‌ వంటి నేతలమంతా కలిసి కాంగ్రెస్‌తో చర్చలు జరిపామని  యెన్నం  చెబుతున్నారు.  పార్టీలో చేరతామని చెప్పిన కొందరు మాట తప్పారనీ, తాను మాత్రం కాంగ్రెస్‌లో చేరుతున్నాననీ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ను బీజేపీలో ఉంటే ఎదుర్కోలేమనీ, ఉద్దేశ్యపూర్వకంగానే బీఆర్‌ఎస్‌కు బీజేపీ లోపాయికారి సహకారాన్ని అందిస్తున్నదనీ ఆరోపించారు. రోజులు గడిచే కొద్దీ.. బీజేపీలో పరిస్థితి మరింత దిగజారిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Revanth Reddy: నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Embed widget