అన్వేషించండి

అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు - నడ్డా నివాసంలో తెలంగాణ నేతల కీలక భేటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్ఠానం తెలంగాణ నేతలతో గురువారం భేటీ అయింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తే, కాంగ్రెస్ పార్టీ 55 నియోజకవర్గాలకు పేర్లు ప్రకటించింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై కాషాయ పార్టీ అధిష్ఠానం గురువారం తెలంగాణ నేతలతో భేటీ అయింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ వ్యవహారాల బాధ్యులు సునీల్‌ భన్సల్‌, తరుణ్‌ చుగ్‌, ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్‌ జావడేకర్‌ సమావేశంలో పాల్గొన్నారు. 

ర్యాలీలు ఎక్కడెక్కడ నిర్వహించాలి

సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏయే నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలి ? అభ్యర్థుల బలాబలాలు ఏంటి ? ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ? ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పాల్గొనే ప్రచార ర్యాలీలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై కసరత్తు చేశారు. రాష్ట్ర విభజన సందర్బంగా తెలంగాణకు ఇచ్చిన హామీలపై చర్చించింది. నిజామాబాద్ లో ఏర్పాటు చేయనున్న పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా ములుగు జిల్లాలో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్శిటీకి కేంద్ర మంత్రి వర్గం అమోదముద్ర వేసింది. పసుపు బోర్డు, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చర్చించినట్లు తెలుస్తోంది. 

గజ్వేల్ నుంచి బరిలోకి ఈటల ?

గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటంతో అదే స్థానం నుంచి ఢీ కొట్టాలని ఈటల రాజేందర్ పట్టుదలగా ఉన్నారు. హుజురాబాద్ తో పాటు గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు ఈటల రాజేందర్ ఆసక్తి చూపిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్, అంబర్ పేట నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆర్మూరు నుంచి ఎంపీ ధర్మపురి అర్వింద్, మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, ధర్మపురి నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

ప్రచారంలో దూకుడు పెంచిన బీఆర్ఎస్, కాంగ్రెస్

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు సాధించడమే లక్ష్యంగా గులాబీ బాస్ క్యాంపెయిన్ చేస్తున్నారు. మెజార్టీ సీట్లు సిట్టింగ్ లకు ఇవ్వడంతో ఆయన గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. పార్టీ నేతలు నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొంటున్నారు. అధికార పార్టీ అక్రమాలు, అవినీతిపై విమర్శలు గుప్పిస్తున్నారు. 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Reshuffle: మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
Roja Tamil politics: రోజా తమిళ రాజకీయాల్లోకి వెళ్తారా ..? డీఎంకే తరపున ఎందుకు ప్రచారం చేస్తున్నారు?
రోజా తమిళ రాజకీయాల్లోకి వెళ్తారా ..? డీఎంకే తరపున ఎందుకు ప్రచారం చేస్తున్నారు?
బీఆర్ఎస్‌ను మళ్లీ TRS గా పేరు మార్చడంపై ఆలోచిస్తున్నాం.. పాదయాత్ర చేస్తా: కేటీఆర్
బీఆర్ఎస్‌ను మళ్లీ TRS గా పేరు మార్చడంపై ఆలోచిస్తున్నాం.. పాదయాత్ర చేస్తా: కేటీఆర్
Revanth Plan With KK: ఇంటర్ ఫలితాలను కేకే రిలీజ్ చేయడం వెనుక రాజకీయం - రేవంత్ ప్రాధాన్యత దేనికి సంకేతం?
ఇంటర్ ఫలితాలను కేకే రిలీజ్ చేయడం వెనుక రాజకీయం - రేవంత్ ప్రాధాన్యత దేనికి సంకేతం?

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
Revanth Plan With KK: ఇంటర్ ఫలితాలను కేకే రిలీజ్ చేయడం వెనుక రాజకీయం - రేవంత్ ప్రాధాన్యత దేనికి సంకేతం?
ఇంటర్ ఫలితాలను కేకే రిలీజ్ చేయడం వెనుక రాజకీయం - రేవంత్ ప్రాధాన్యత దేనికి సంకేతం?
Palnadu Crime News: లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
పల్నాడులో లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
Inter Student Suicide: ఫెయిల్ భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, రిజల్ట్స్ చూస్తే పాస్.. ఖమ్మం జిల్లాలో ఘటన
ఫెయిల్ భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, రిజల్ట్స్ చూస్తే పాస్.. ఖమ్మం జిల్లాలో ఘటన
బీఆర్ఎస్‌ను మళ్లీ TRS గా పేరు మార్చడంపై ఆలోచిస్తున్నాం.. పాదయాత్ర చేస్తా: కేటీఆర్
బీఆర్ఎస్‌ను మళ్లీ TRS గా పేరు మార్చడంపై ఆలోచిస్తున్నాం.. పాదయాత్ర చేస్తా: కేటీఆర్
Khajipet Inter Girl Murder Case: నా కొడుకు అమాయకుడు.. నన్ను హత్తుకుని ఏడ్చాడు: ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి ఆవేదన
నా కొడుకు అమాయకుడు.. నన్ను హత్తుకుని ఏడ్చాడు: ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి ఆవేదన
TS Inter Supplementary Exam Date 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
Adivi Sesh: సుప్రియా... నువ్వు నాకెంతో ముఖ్యం - ఓపెన్‌గా చెప్పిన అడివి శేష్
సుప్రియా... నువ్వు నాకెంతో ముఖ్యం - ఓపెన్‌గా చెప్పిన అడివి శేష్
Embed widget