అన్వేషించండి

అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు - నడ్డా నివాసంలో తెలంగాణ నేతల కీలక భేటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్ఠానం తెలంగాణ నేతలతో గురువారం భేటీ అయింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తే, కాంగ్రెస్ పార్టీ 55 నియోజకవర్గాలకు పేర్లు ప్రకటించింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై కాషాయ పార్టీ అధిష్ఠానం గురువారం తెలంగాణ నేతలతో భేటీ అయింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ వ్యవహారాల బాధ్యులు సునీల్‌ భన్సల్‌, తరుణ్‌ చుగ్‌, ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్‌ జావడేకర్‌ సమావేశంలో పాల్గొన్నారు. 

ర్యాలీలు ఎక్కడెక్కడ నిర్వహించాలి

సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏయే నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలి ? అభ్యర్థుల బలాబలాలు ఏంటి ? ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ? ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పాల్గొనే ప్రచార ర్యాలీలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై కసరత్తు చేశారు. రాష్ట్ర విభజన సందర్బంగా తెలంగాణకు ఇచ్చిన హామీలపై చర్చించింది. నిజామాబాద్ లో ఏర్పాటు చేయనున్న పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా ములుగు జిల్లాలో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్శిటీకి కేంద్ర మంత్రి వర్గం అమోదముద్ర వేసింది. పసుపు బోర్డు, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చర్చించినట్లు తెలుస్తోంది. 

గజ్వేల్ నుంచి బరిలోకి ఈటల ?

గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటంతో అదే స్థానం నుంచి ఢీ కొట్టాలని ఈటల రాజేందర్ పట్టుదలగా ఉన్నారు. హుజురాబాద్ తో పాటు గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు ఈటల రాజేందర్ ఆసక్తి చూపిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్, అంబర్ పేట నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆర్మూరు నుంచి ఎంపీ ధర్మపురి అర్వింద్, మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, ధర్మపురి నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

ప్రచారంలో దూకుడు పెంచిన బీఆర్ఎస్, కాంగ్రెస్

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు సాధించడమే లక్ష్యంగా గులాబీ బాస్ క్యాంపెయిన్ చేస్తున్నారు. మెజార్టీ సీట్లు సిట్టింగ్ లకు ఇవ్వడంతో ఆయన గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. పార్టీ నేతలు నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొంటున్నారు. అధికార పార్టీ అక్రమాలు, అవినీతిపై విమర్శలు గుప్పిస్తున్నారు. 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Revanth Master Plan: ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
Embed widget