అన్వేషించండి

Chandrababu: 'సీఎం జగన్ హయాంలో అప్పుల కుప్పగా ఏపీ' - వైసీపీ ఐదేళ్ల పాలనపై చంద్రబాబు ప్రశ్నల వర్షం

Andhrapradesh News: వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆలూరు ప్రజాగళం సభలో ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Chandrababu Slams Cm Jagan In Aluru Meeting: రాష్ట్రంలోనే అత్యంత ధనికుడు సీఎం జగన్ (Cm Jagan) అని.. రాష్ట్రాన్ని ఆయన రూ.13 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరులో (Aluru) శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ భవిష్యత్ మార్చే ఎన్నికలని అన్నారు. వైసీపీ పాలనలో ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలకు ప్రాధాన్యం ఇస్తామని.. గ్రామాల్లో సర్పంచ్ లకే అధికారం ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కూడా అవసరమని.. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు భారీ సంఖ్యలో టీడీపీ అభిమానులు, శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు.

వైసీపీపై ప్రశ్నల వర్షం

ఈ సందర్భంగా వైసీపీపై చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. 'అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఆ హామీ ఏమైంది.?. వైసీపీ పాలనలో ప్రజల ఆదాయం పెరిగిందా.?. విద్యపై పెట్టిన ఖర్చు ఎంత.?. వచ్చిన ఫలితాలేంటి.?. ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు దాచింది ఎంత.?. దోచుకున్నది ఎంత.?. ఇష్టానుసారంగా భూములు దోచుకున్నారు. సీఎం జగన్ చెప్పే మాటలు చేసే పనులకు పొంతన ఉందా.?. రాయలసీమకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు ఇవ్వలేదు. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా.?. యువతకు ఉద్యోగాలు ఇచ్చారా.? ఆరోగ్య శ్రీ బిల్లులు సైతం చెల్లించలేదు.' అని చంద్రబాబు మండిపడ్డారు. ఎంపీటీసీని ఎంపీగా నిలబెట్టి గెలిపించబోతున్నామని అన్నారు. టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలో సీఎం జగన్ అన్ని రంగాలను, వ్యవస్థలను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు.

బాలుడి మృతిపై దిగ్భ్రాంతి

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ (10) అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 'సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడం, బాలుడిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం బాధాకరం. కన్ను మిన్ను కానరాక ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం ఒకటైతే.. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని పాలనా నిర్లక్ష్యం మరొకటి. ఈ రెండూ కలిసి ఎంతో భవిష్యత్తు ఉన్న పసివాడి జీవితాన్ని బలి తీసుకున్నాయి. భరద్వాజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.' అని ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read: Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Embed widget