అన్వేషించండి

Chandrababu: 'సీఎం జగన్ హయాంలో అప్పుల కుప్పగా ఏపీ' - వైసీపీ ఐదేళ్ల పాలనపై చంద్రబాబు ప్రశ్నల వర్షం

Andhrapradesh News: వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆలూరు ప్రజాగళం సభలో ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Chandrababu Slams Cm Jagan In Aluru Meeting: రాష్ట్రంలోనే అత్యంత ధనికుడు సీఎం జగన్ (Cm Jagan) అని.. రాష్ట్రాన్ని ఆయన రూ.13 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరులో (Aluru) శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ భవిష్యత్ మార్చే ఎన్నికలని అన్నారు. వైసీపీ పాలనలో ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలకు ప్రాధాన్యం ఇస్తామని.. గ్రామాల్లో సర్పంచ్ లకే అధికారం ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కూడా అవసరమని.. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు భారీ సంఖ్యలో టీడీపీ అభిమానులు, శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు.

వైసీపీపై ప్రశ్నల వర్షం

ఈ సందర్భంగా వైసీపీపై చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. 'అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఆ హామీ ఏమైంది.?. వైసీపీ పాలనలో ప్రజల ఆదాయం పెరిగిందా.?. విద్యపై పెట్టిన ఖర్చు ఎంత.?. వచ్చిన ఫలితాలేంటి.?. ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు దాచింది ఎంత.?. దోచుకున్నది ఎంత.?. ఇష్టానుసారంగా భూములు దోచుకున్నారు. సీఎం జగన్ చెప్పే మాటలు చేసే పనులకు పొంతన ఉందా.?. రాయలసీమకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు ఇవ్వలేదు. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా.?. యువతకు ఉద్యోగాలు ఇచ్చారా.? ఆరోగ్య శ్రీ బిల్లులు సైతం చెల్లించలేదు.' అని చంద్రబాబు మండిపడ్డారు. ఎంపీటీసీని ఎంపీగా నిలబెట్టి గెలిపించబోతున్నామని అన్నారు. టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలో సీఎం జగన్ అన్ని రంగాలను, వ్యవస్థలను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు.

బాలుడి మృతిపై దిగ్భ్రాంతి

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ (10) అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 'సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడం, బాలుడిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం బాధాకరం. కన్ను మిన్ను కానరాక ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం ఒకటైతే.. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని పాలనా నిర్లక్ష్యం మరొకటి. ఈ రెండూ కలిసి ఎంతో భవిష్యత్తు ఉన్న పసివాడి జీవితాన్ని బలి తీసుకున్నాయి. భరద్వాజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.' అని ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read: Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!

టాప్ హెడ్ లైన్స్

MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Ongole Politics: కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget