అన్వేషించండి

ధర్మవరంలో పరిటాల Vs చిలకం-టిక్కెట్‌ దక్కేదెవరికో?

రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తే.. శ్రీరామ్ కు ధర్మవరం టిక్కెట్ డౌట్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక టిక్కెట్. టిడిపి - జనసేన పొత్తు వుంటే చిలకం కే టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట.

అనంతపురం జిల్లాలోని ఆ నియోజకవర్గం ఇప్పుడు మిత్రుల మధ్యే విభేదాలు సృష్టించబోతోందా? పొత్తుల్లో భాగంగా ఆ సీటు ఎవరికి దక్కబోతోంది ? ఏ పార్టీ ఈ నియోజకవర్గాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది ? ఇంతకీ ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ బలంగా ఉందా లేదంటే విపక్షమా ? 

ఏపీలో విపక్షాలన్నీ ఒక్కటై ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. అయితే ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారన్నది ఇంకా తేలలేదు. టిడిపి -బీజేపీతో కలిసి జనసేన బరిలోకి దిగుతుందా లేదంటే పచ్చపార్టీతో కలిసి ముందుకెళ్తుందా అన్నది ఇంకా పవన్‌ కల్యాణ్‌ తేల్చలేదు. అటు బీజేపీ కూడా జనసేనతో కలిసి ఉంటామని చెబుతున్నా కానీ ఎన్నికల్లో పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇలాంటి టైమ్‌లో ఆ నియోజవర్గంలో సీటు కోసం ఇటు టిడిపి అటు జనసేన నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎవరికి రానున్న ఎన్నికల్లో ఈ నియోజవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్‌ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ నియోకవర్గం ఏంటంటే ధర్మవరం. 

అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఇప్పుడు టిడిపి-జనసేనల మధ్య చిచ్చుపెట్టబోతోందన్న టాక్‌ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ నియోజవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని టిడిపి నేత ఆ నియోజకవర్గ ఇంఛార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ భావిస్తున్నారు. చంద్రబాబు సూచనల మేరకు ధర్మవరం ఇంఛార్జ్‌ గా వ్యవహరిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ సీటు తనకివ్వాలని ఇప్పటికే తల్లి పరిటాల సునీత ద్వారా చంద్రబాబుకి విన్నవించారట. అయితే టిడిపి అధినేత మాత్రం మౌనంగా ఉన్నారట. అందుకు కారణం గత ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్‌ ఓటమిపాలవ్వడమే. అంతేకాదు శ్రీరామ్‌ స్థానంలో పరిటాల సునీతను వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దింపాలన్నది చంద్రబాబు ఆలోచనట. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గ బాధ్యతలను సునీత చూసుకుంటారు. అక్కడి నుంచే ఆమెని బరిలోకి దింపాలన్నది చంద్రబాబు వ్యూహమట. అంతేకాదు కుటుంబం నుంచి ఒక్కరికే టిక్కెట్‌ ఇవ్వాలని టిడిపి అధ్యక్షుడు ఇప్పటికే నిర్ణయించారట. అందుకే పరిటాల సునీత వైపే ఆయన మొగ్గు చూపుతున్నారట. అయితే సునీత మాత్రం తన కొడుక్కే మళ్లీ పోటీ చేసే అవకాశమివ్వాలని చంద్రబాబుకి మొరపెట్టుకున్నారట. 

జనసేన పార్టీ కూడా ఈనియోజకవర్గంలో బలపడటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ చిలకం మధుసూదనరెడ్డికి ప్రజల్లో మంచి పేరే ఉంది. అధికారపార్టీతో ఢీ కొట్టే నేతగా చిలకం పేరు తరచూ వినిపిస్తుంటుంది. పవన్‌ కల్యాణ్‌కి కూడా ఈయనపై మంచి అభిప్రాయమే ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున చిలకం ధర్మవరం నుంచి పోటీ చేయనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి- జనసేన పొత్తు ఖరారైతే ధర్మవరం నుంచి పరిటాలకి అవకాశం ఉంటుందా లేదంటే చిలకం ఛాన్స్‌ కొట్టేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో ఎవరికి ఛాన్స్‌ ఇచ్చినా ఇంకొకరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం ధర్మవరం అధికారపార్టీనేతగా కేతిరెడ్డి ఉన్నారు. గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం పేరుతో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల్లో మంచి పేరే తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేతిరెడ్డిని ఓడించే నేత ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పరిటాల శ్రీరామ్‌కి టికెట్ అంత ఈజీ కాదనీ, టిడిపి - జనసేన పొత్తు వుంటే చిలకం మధుసూదన్‌రెడ్డికే టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నియోజకవర్గంలో టాక్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Assam Assembly Elections 2026: అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget