అన్వేషించండి

ధర్మవరంలో పరిటాల Vs చిలకం-టిక్కెట్‌ దక్కేదెవరికో?

రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తే.. శ్రీరామ్ కు ధర్మవరం టిక్కెట్ డౌట్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక టిక్కెట్. టిడిపి - జనసేన పొత్తు వుంటే చిలకం కే టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట.

అనంతపురం జిల్లాలోని ఆ నియోజకవర్గం ఇప్పుడు మిత్రుల మధ్యే విభేదాలు సృష్టించబోతోందా? పొత్తుల్లో భాగంగా ఆ సీటు ఎవరికి దక్కబోతోంది ? ఏ పార్టీ ఈ నియోజకవర్గాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది ? ఇంతకీ ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ బలంగా ఉందా లేదంటే విపక్షమా ? 

ఏపీలో విపక్షాలన్నీ ఒక్కటై ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. అయితే ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారన్నది ఇంకా తేలలేదు. టిడిపి -బీజేపీతో కలిసి జనసేన బరిలోకి దిగుతుందా లేదంటే పచ్చపార్టీతో కలిసి ముందుకెళ్తుందా అన్నది ఇంకా పవన్‌ కల్యాణ్‌ తేల్చలేదు. అటు బీజేపీ కూడా జనసేనతో కలిసి ఉంటామని చెబుతున్నా కానీ ఎన్నికల్లో పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇలాంటి టైమ్‌లో ఆ నియోజవర్గంలో సీటు కోసం ఇటు టిడిపి అటు జనసేన నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎవరికి రానున్న ఎన్నికల్లో ఈ నియోజవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్‌ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ నియోకవర్గం ఏంటంటే ధర్మవరం. 

అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఇప్పుడు టిడిపి-జనసేనల మధ్య చిచ్చుపెట్టబోతోందన్న టాక్‌ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ నియోజవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని టిడిపి నేత ఆ నియోజకవర్గ ఇంఛార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ భావిస్తున్నారు. చంద్రబాబు సూచనల మేరకు ధర్మవరం ఇంఛార్జ్‌ గా వ్యవహరిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ సీటు తనకివ్వాలని ఇప్పటికే తల్లి పరిటాల సునీత ద్వారా చంద్రబాబుకి విన్నవించారట. అయితే టిడిపి అధినేత మాత్రం మౌనంగా ఉన్నారట. అందుకు కారణం గత ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్‌ ఓటమిపాలవ్వడమే. అంతేకాదు శ్రీరామ్‌ స్థానంలో పరిటాల సునీతను వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దింపాలన్నది చంద్రబాబు ఆలోచనట. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గ బాధ్యతలను సునీత చూసుకుంటారు. అక్కడి నుంచే ఆమెని బరిలోకి దింపాలన్నది చంద్రబాబు వ్యూహమట. అంతేకాదు కుటుంబం నుంచి ఒక్కరికే టిక్కెట్‌ ఇవ్వాలని టిడిపి అధ్యక్షుడు ఇప్పటికే నిర్ణయించారట. అందుకే పరిటాల సునీత వైపే ఆయన మొగ్గు చూపుతున్నారట. అయితే సునీత మాత్రం తన కొడుక్కే మళ్లీ పోటీ చేసే అవకాశమివ్వాలని చంద్రబాబుకి మొరపెట్టుకున్నారట. 

జనసేన పార్టీ కూడా ఈనియోజకవర్గంలో బలపడటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ చిలకం మధుసూదనరెడ్డికి ప్రజల్లో మంచి పేరే ఉంది. అధికారపార్టీతో ఢీ కొట్టే నేతగా చిలకం పేరు తరచూ వినిపిస్తుంటుంది. పవన్‌ కల్యాణ్‌కి కూడా ఈయనపై మంచి అభిప్రాయమే ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున చిలకం ధర్మవరం నుంచి పోటీ చేయనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి- జనసేన పొత్తు ఖరారైతే ధర్మవరం నుంచి పరిటాలకి అవకాశం ఉంటుందా లేదంటే చిలకం ఛాన్స్‌ కొట్టేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో ఎవరికి ఛాన్స్‌ ఇచ్చినా ఇంకొకరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం ధర్మవరం అధికారపార్టీనేతగా కేతిరెడ్డి ఉన్నారు. గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం పేరుతో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల్లో మంచి పేరే తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేతిరెడ్డిని ఓడించే నేత ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పరిటాల శ్రీరామ్‌కి టికెట్ అంత ఈజీ కాదనీ, టిడిపి - జనసేన పొత్తు వుంటే చిలకం మధుసూదన్‌రెడ్డికే టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నియోజకవర్గంలో టాక్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget