అన్వేషించండి

Opposition Leader Sharmila : జగన్ వద్దనుకుంటున్నారు కానీ షర్మిల ఆక్రమించేస్తున్నారు - ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారా ?

Andhra Pradesh : ఏపీలో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనే అని షర్మిల నిరూపించే ప్రయత్నంలో ఉన్నారు. జగన్ నిర్లిప్తత నుంచి అవకాశాలు సృష్టించుకుంటున్నారు.

AP Congress Party :  ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్ని ఆయన సోదరి , ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తనకు అనుకూలంగా మార్చుకునే విషయంలో వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంపై పోరాడుతున్నది తాను మాత్రమేనని.. ఏపీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేననని అన్న  అభిప్రాయాన్ని కలిగించేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ నిర్లిప్తత..జగన్ బెంగళూరులోనే ఎక్కువ మకాం పెడుతూండటంతో షర్మిల చురుగ్గా ఆలోచించి రాజకీయా వ్యూహాలను అమలు చేస్తున్నారు. జగన్ అసెంబ్లీకి వెళ్లకూడదన్న నిర్ణయాన్ని మరింత అడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నారు. చురుగ్గా ప్రజల్లోకి వెళ్లి వారి తరపున తానే పోరాడుతున్నానన్న అభిప్రాయాన్ని కలిపిస్తున్నారు. 

సినీ ఇండస్ట్రీపై రేవంత్ ఆగ్రహం - వెంటనే స్పందించిన చిరంజీవి - ఏమన్నారంటే ?

రాజకీయంగా జగన్ తడబాటు నిర్ణయాలు

ఎన్నికల్లో ఘోరమైన పరాజయం తర్వాత జగన్ ఇంకా తప్పటడుగులే వేస్తున్నారన్న అభిప్రాయంతో వైసీపీ క్యాడరే కాదు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది అసెంబ్లీకి వెళ్లకపోవడం. అసెంబ్లీలో ఎవరు అవునన్నా.. కాదన్న ఆయన ప్రతిపక్ష నేతనే. కూటమికి వ్యతిరేకంగా తమ పార్టీ తప్ప మరో పార్టీ లేదని అందుకే తమదే ప్రతిపక్షమని ఆయన అంటున్నారు. ఆ విషయాన్ని టీడీపీ కూడా కాదనడం లేదు. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదాను మాత్రం ఇవ్వలేదు. అందుకు పదిశాతం సీట్లు రావాలన్న రూల్ ఉందని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది. పార్లమెంట్ లో గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షహోదా ఈ కారణంతోనే ఇవ్వలేదు. కానీ ప్రతిపక్షంగా గుర్తింపు పొంది పోరాడుతూనే ఉంది. కానీ అలాంటి ప్రతిపక్షంగా పోరాడటానికి జగన్ సిద్దంగా లేరు. నకు హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని.. తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రారని ఆయన తేల్చి చెప్పారు. దాంతో అసెంబ్లీలో ప్రతిపక్షమే కనిపించలేదు. కనీసం అసెంబ్లీకి వెళ్లి ఉంటే.. మాట్లాడటానికి చాన్సివ్వకపోతే.. అదే విషయాన్ని ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ అసలు వెళ్లకపోతే..  అలా చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. 

ప్రభుత్వంపై పార్టీ కోణంలోనే పోరాటం 

అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధపడని జగన్మోహన్ రెడ్డి .. ప్రభుత్వంపై పోరాటాన్ని పార్టీ కోణలోనే చేస్తున్నారు కానీ.. సాధారణ ప్రజల దిశగా వెళ్లడం లేదు. వినుకొండలో జరిగిన హత్యా ఉదంతంతో ఢిల్లీలో ధర్నా చేశారు. తమ పార్టీ నేతలపై హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఎంత మంది హత్యకు గురయ్యారో వారి వివరాలు ఇవ్వాలని మీడియాతో పాటు టీడీపీ ప్రభుత్వం అడిగినా స్పందించలేదు. అదే్ సమయంలో.. శ్వేతపత్రాల పేరుతో తమ పై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ఈ పోరాటం అంతా పార్టీ కోణంలోనే జరుగుతోంది కానీ..ప్రజా సమస్యలపై ఇంకా దృష్టి పెట్టలేదు. ఇక్కడే షర్మిల అడ్వాంటేజ్ తీసుకున్నారు. 

ఏపీలో ఆరోగ్య శ్రీ చుట్టూ రాజకీయం - షర్మిలకు గట్టి కౌంటర్ ఇచ్చిన పెమ్మసాని

ప్రజా సమస్యలపై స్పందిస్తున్న షర్మిల

షర్మిల వర్షాకాలం కారణంగా వచ్చిన వరదలతో మునిగిన పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి  గూడెంలో షర్మిల నడుంలోతు నీళ్లు ఉన్న పొలంలోకి దిగి..అందర్నీ ఆశ్చర్యపరిచారు. రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలెవరూ రైతులను పట్టించుకోలేదు. వరద బాధితుల గురించి ఆలోచించలేదు. చిన్న ప్రకటన కూడా చేయలేదు. ఓ వైపు ప్రతిపక్ష పాత్రను నిర్వర్తించడానికి మొహమాట పడుతున్న వైసీపీని మరంతగా కార్నర్ చేస్తూ.. తానే ప్రభుత్వంపై పోరాటానికి ముందుకు వస్తున్నారు. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా మారుతోంది. ప్రజల తరపున పోరాటంలో షర్మిల ముందుకెళ్తే..  వైసీపీకి మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే సరైన సమయంలో జగన్ బయటకు వస్తారని ఆ తర్వాత షర్మిలను ఎవరూ పట్టించుకోరని అనుకుంటున్నారు. 

మొత్తంగా షర్మిల, జగన్ మధ్య ప్రతిపక్ష నేతగా ప్రజల్లో గుర్తింపు కోసం హోరాహోరీ పోరు సాగుతోందని అనుకోవచ్చు. మరి ఎవరిది పైచేయి అవుతుందో ?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget