అన్వేషించండి

YS Sharmila Letter To CM Jagan : ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ

Andhra Politics : ఎస్సీ ఎస్టీలకు క్షమాపణ చెప్పాలని షర్మిల జగన్ ను డిమాండ్ చేశారు. వారికి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చకపోగా మరింత అణిచి వేశారన్నారు. ఈ మేరకు బహిరంగలేఖ రాశారు.

YS Sharmila Letter To CM Jagan : ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలకు చేసిన అన్యాయంపై సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.  ఈ మేరకు ఓ బహిరంగలేఖ రాశారు.  మీ ఏలుబడిలో దయనీయంగా ఉన్న బడుగు బలహీనవర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) అత్యధికులు రాష్ట్రంలో ఎంతో దుర్బరమైన జీవితం గడుపుతున్నారని లేఖలో పేర్కొన్నారు.  వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులతో పాటు జీవన ప్రమాణాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. ప్రత్యేక చర్యలతో వారిని ఆదుకోవాల్సింది పోయి, వారికి రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి మీ పాలనలో ఎదురవుతోందని విమర్శించారు.
YS Sharmila Letter To CM Jagan : ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మళ్లిస్తారా ? 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్  . నిధులు దారి మళ్లించారని వారి కోసమని రూపొందించి, మీరొచ్చేదాకా కొనసాగుతున్న 28 పథకాలు, కార్యక్రమాలను నిర్దయగా నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజకీయంగా వారిని ఎదగనీయకుండా, అవకాశాలకు కత్తెర వేసి మొగ్గలోనే తుంచే దుర్మార్గాన్ని మీరు పాటిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో దళితులు, ఆదివాసీలు, గిరిజనులపై దాడులు జరుగుతున్నా, దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్టే ఉన్నారు. వాటిని నివారించి వారిని కా పాడే నిర్దిష్ట చర్యలు లేవు. ప్రధానంగా వారికి రక్షణ లేదు. పైగా, ఇలా దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్న వారిలో ఎక్కువమంది మీ పార్టీకి చెందిన పెత్తందార్లు, మోతుబర్లు, రౌడీ మూకలేనని ఆరోపించారు.
YS Sharmila Letter To CM Jagan : ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ

ఆదరించిన ఎస్సీ, ఎస్టీల్ని వంచిస్తారా ? 

ఎన్నికల ముందు నుంచీ మిమ్మల్ని అక్కున చేర్చుకొని, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు మీపై ఎంతో విశ్వాసం చూపించారు. కానీ, మీరు..... ఎక్కడ అవకాశం దొరికినా, వేదికెక్కి ప్రసంగించినా 'నా ఎస్సీలు, నా ఎస్టీలు' అంటూనే వారిని వంచించారన్నారు.  మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు. డా సుధాకర్ కు జరిగిన దారుణమైన అవమానమైతేనేమి, సుబ్రహ్మణ్యాన్ని మీ ఎమ్మెల్సీ మట్టుబెట్టిన విధానమైతేనేమి, దళితుల శిరోముండనమైతేనేమి, చివరికి మీ పార్టీ సీనియర్ నాయకుడు, దశాబ్దాల క్రితం దళితులపై చేసిన దాష్టీకాలకు, నేడు కోర్టులో శిక్షపడ్డా ఆయనను అందలం ఎక్కించాలని సిగ్గు, సంస్కరం వదిలేసినా మీ నాయక్వానికే చెల్లుతుంది. అయినా మర్దార్లు, గూండాయిజాలు చేసే నాయకులను మోసే సంస్కృతి మీలో నిలువెల్లా నిండిపోయిందని చెప్పకనే చెపుతోంది. అంతెందుకు, ఇప్పుడు కూడా మీ పార్టీలోని దళిత నాయకులు, ఏరుదాటి తెప్పతగలేసే మీ బరితెగించిన వాలకాన్ని తట్టుకోలేక ఎలా బయటకు వస్తున్నారో వేరే చెప్పాలా అని ప్రశ్నించారు.
YS Sharmila Letter To CM Jagan : ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ

ఎన్నికలయ్యాక ఎస్సీ,ఎస్టీల్ని ఎందుకు పట్టించుకోలేదు ? 
 
రాష్ట్ర జనాభాలో 16.8 శాతంగా ఉన్న ఎస్సీలు, 5.3 శాతంగా ఉన్న ఎస్టీలు ఎన్నికలయ్యాక మీ కంటికి కనిపించకపోవడం, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాగానే కనిపించడం అన్నది అతిపెద్ద దుర్మార్గమన్నారు.  మీరు పాలనా పగ్గాలు చేపట్టిన తొలి నాలుగేళ్లలోనే ఎస్సీ, ఎస్టీలకు ఎంతటి అన్యాయం జరిగిందో గణాంకాలే చెబుతాయి. ఉప ప్రణాళిక కింద బడ్జెట్ లో ఎస్సీలకు ప్రతిపాదించిన రూ. 89,706 కోట్లకు బదులు రూ. 66,656 కోట్లు మాత్రమే కేటాయించి రూ. 23,050 కోట్లకు గండికొట్టారు. ఇదే ఉప ప్రణాళిక ప్రకారం ఎస్టీలకు వాస్తవిక బడ్జెట్ రూ. 28,990 కోట్లు కాగా, రూ. 22,443 కోట్లు మాత్రమే కేటాయించి రూ.6547 కోట్ల మేర గండికొట్టారు. దీన్నిబట్టి ఎస్సీ, ఎస్టీల పట్ల మీ చిత్తశుద్దిని అర్థం చేసుకోవచ్చన్నారు.    
 
దళితలపై దాడులు ఎక్కువ ! 

దక్షిణ భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంత ఘోరంగా దళితులు, ఆదివాసీలు, గిరిజనులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని షర్మిల లేఖలో పేర్కొన్నారు.  ఎస్సీ, ఎస్టీలకు రక్షణే లేకుండా పోతోంది. నెలకు సగటున ముగ్గురు హత్యలకు గురవుతున్నారు. వారానికి నలుగురు దళిత' గిరిజన మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. సగటున రోజూ ఏడు దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయని..   2021లో స్వయానా మీ సాంఘిక సంక్షేమ శాఖ వారు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక స్పష్టం చేసిందన్నారు.   రాజకీయంగా కూడా ఎస్సీ, ఎస్టీలపైన మీది చిన్నచూపే! స్థిరంగా ఎదగనీయకుండా వారిని మొక్కగా ఉన్నపుడే చిదిమేస్తారా? ఎస్సీల్లో 12 మంది సిట్టింగ్ కు ఇప్పుడు మీ పార్టీ టిక్కెట్టు నిరాకరించారు. మరో 6 మందికి స్థానచలనం కలిగించారు. కింది స్థాయిలోని స్థానిక సంస్థల్లోనూ ఇదే పరిస్థితి అన్నారు.   125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్థాపిస్తారు. ఆయన విధానాల స్ఫూర్తిని మాత్రం సమాధి చేస్తారా? ఇదెక్కడి న్యాయమని షర్మిల ప్రశ్నించారు.  ఇకపై ఏ వివక్షా లేకుండా, తప్పులు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వండి. వారి అభ్యున్నతికి అవసరమైన అన్ని చర్యల్ని తక్షణం చేపట్టాలని లేఖలో డిమాండ్ చేశారు.  అరకులో 

అరకు నియోజకవర్గంలో ప్రచారం

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అరకు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.   బాక్సైట్ తవ్వకాల విషయంలో ప్రజా అభిప్రాయం గౌరవించారు   వద్దు అంటే వదిలేశారన్నారు.  ఇప్పుడు జగన్ అక్రమంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారన్నారు.  అదానీ లాంటి వాళ్లకు 7 హైడ్రో  పవర్ ప్రాజెక్ట్ లకు అనుమతి  ఇచ్చాని.  ఇది అక్రమం కాదా అని  ప్రశ్నించారు.   కనీసం 45 ఏళ్లకే పెన్షన్ పథకం ఎంతమందికి ఇస్తున్నారో తెలియదన్నారు.  - అప్పులు తప్పా మనకు ఏమీ లేదు .య.  చేతిలో చిప్ప తప్పా...ఏమి లేదు ..   మళ్ళీ ఇలాంటి పార్టీలను మనం గెలిపించడం అవసరమా అని షర్మిల ప్రశ్నించారు. 
 

 

టాప్ హెడ్ లైన్స్

New Political Parties in Telangana: తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
Almatti Dam Height Dispute 2026: దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
Telangana Cabinet Expansion Postponed 2026: తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
Modi Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Embed widget