అన్వేషించండి

Sharad Pawar: అనూహ్య పరిణామం- శరద్ పవార్ తో అదానీ భేటీ, ఫ్యాక్టరీ సైతం ప్రారంభం

ఎన్సీపీ అధినేత శరత్ పవర్ ఆదానిని కలిశారు.

హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం ఆదానీ- మోదీ సంబంధాల పట్ల దేశ రాజకీయాలు అట్టుడికిన నేపథ్యంలో  అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌తో అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ భేటీ కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ఎన్సీపీ అధినేత శరత్ పవర్, ఆదాని గ్రూప్స్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇద్దరు కలిసి అహ్మదాబాద్ సనంద్ లోని ఓ గ్రామంలో ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఆ తర్వాత అహ్మదాబాద్ లోని ఆయన నివాసాన్ని, ఆఫీసును శరత్ పవర్ సందర్శించారు. ఈ విషయాన్ని శరత్ పవర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాను. అలాగే వీరిద్దరూ కలిసి ఫ్యాక్టరీని ప్రారంభించిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరి భేటీతో ఏ ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.ఈ విషయాన్ని శరత్ పవర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాను. అలాగే వీరిద్దరూ కలిసి ఫ్యాక్టరీని ప్రారంభించిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరి భేటీతో ఏ ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.

ఏడాది ఏప్రిల్ లో శరత్ పవర్ ని ముంబైలోని ఆయన నివాసంలో గౌతం అదాని కలిసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు గంటలపాటు వీరిద్దరు మాట్లాడుకున్నట్లు సంబంధిత వర్గాలు అప్పట్లో వెల్లడించాయి. అదాని సంస్థలపై హీడెన్బర్గ్ రీసెర్చ్ నివేదికపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్న సమయంలోనే ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు అదాని గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి తాను ముగ్గు చూపుతున్నట్లు పవర్ ఆ సమయంలో ప్రకటించారు. ఆ తర్వాత జూన్ లో అదాని మరోసారి పవన్ కలిశారు.

శరత్ పవర్, ఆదానీల మధ్య దాదాపు రెండు దశాబ్దాల బంధం ఉంది. 2015లో పవర్ ప్రచురించిన తన మరాటి ఆత్మకథ ' లోక్ మేజ్ సంగటి ' లో బొగ్గు రంగంలో అడుగుపెట్టిన అదానిపై పవర్ ప్రశంసలు కురిపించారు. తన పట్టుదలతోనే అదాని థర్మల్ పవర్ రంగంలోకి అడుగు పెట్టారని అందులో తెలిపారు. అంతేకాకుండా సేల్స్ మాన్ గా తన జీవితాన్ని ప్రారంభించిన దాని తన కార్పొరేట్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారో పవర్ అందులో వివరించారు.

అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని విపక్షాలు పట్టుబడుతున్న వేళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో గౌతమ్ అదానీ భేటీ కావడం సంచలనంగా మారింది.  ముంబైలోని శరద్ పవార్ నివాసానికి వచ్చిన అదానీ దాదాపు రెండు గంటలకు పైగా సమావేశం అయ్యారు. అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కార్నర్ చేస్తున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కు ప్రధాన మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీ త్వరలో బీజేపీ కూటమిలో చేరబోతోందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.

ఈ క్రమంలో తమ పార్టీ అధినేత శరద్ పవార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని అజిత్ పవార్ సైతం క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో శరద్ పవార్ తో అదానీ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతకు ముందు జేపీసీ కమిటీ కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టడాన్ని శరద్ పవార్ విమర్శించారు. అదానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేయాలని రాహుల్ గాంధీ అనుకోవడం సరికాదని, అదానీపై జేపీసీ వేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు.

అదానీ దేశంలో అనేక రకాల సేవలు చేస్తున్నారని కితాబిచ్చారు. ఈ క్రమంలో అదానియే శరద్ పవార్ నివాసానికి వచ్చి భేటీ కావడంతో అదానీ, పవార్ ఏం చర్చించుకున్నారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు వీరి భేటీతో శరత్ పవార్ కాంగ్రెస్ కు హ్యాండిచ్చి బీజేపీలో చేరుతారా అనే ప్రచారం ఊపందుకుంది. ఇదే జరిగితే కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఊహించని దెబ్బగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Prashant Kishor Electoral Debut: వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
Telangana Cabinet Coordination Issues: జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
Andhra Pradesh Law and Order Issue: మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget