అన్వేషించండి

Ram Madhav : మళ్లీ ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి రామ్‌మాధవ్ - రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతారా ?

BJP : ఆరెస్సెస్ నేత రామ్ మాధవ్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ బాధ్యతలు తీసుకోవడమే దీనికి కారణం.

RSS leader Ram Madhav will be active in BJP politics again :  కశ్మీర్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. విభజన తర్వాత ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున ఇంచార్జులుగా కిషన్ రెడ్డితో పాటు రామ్ మాధవ్ కూడా నియమితులయ్యారు. ఎన్నికల ఇంచార్జుల జాబితాలో రామ్ మాధవ్ పేరు చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. మళ్లీ రామ్ మాధవ్ బీజేపీలో ఎప్పుడు పని చేయడం ప్రారంభించారని చర్చించుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే.. ఆరెస్సెస్ బీజేపీ రాజకీయాల్ని వదిలేసి ఆరెస్సెస్ లోకి వెళ్లిపోయారు. గత ఐదేళ్ల కాలంలో ఆయన ఎక్కడా కనిపించలేదు. మళ్లీ ఇప్పుడే కశ్మీర్ పై దృష్టి సారించారు. 

2014 తర్వాత బీజేపీలో కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ 

2014  ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత మోదీ ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఆరెస్సెస్ నుంచి మురళీధర్ రావుతో పాటు రామ్ మాధవ్ బీజేపీలోకి వచ్చారు. ప్రధాన కార్యదర్శులుగా వారిద్దరికీ పార్టీలో చాలా పవర్ ఉండేది. ముఖ్యంగా రామ్ మాధవ్ కు ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్ బాధ్యతలను బీజేపీ అగ్రనేతలు ఇచ్చారు. ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి నామమాత్రంగా ఉండేది కానీ.. రామ్ మాధవ్ ఇంచార్జ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్ష ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. దాంతో ఆయన పేరు మారుమోగిపోయింది. జమ్మూకశ్మీర్ లోనూ పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కశ్మీర్ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆయనకు బీజేపీ పెద్దలతో దూరం పెరిగిపోయింది.  

2019 ఎన్నికల తర్వాత తిరిగి ఆరెస్సెస్ లోకి !   

బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో ఓ దశలో.. రామ్ మాధవ్ పేరు బీజేపీ అధ్యక్ష పదవికి వినిపించింది. కారణం ఏదైనా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ముందుకు పోలేదు. తర్వాత ఆ పదవి కూడా దక్కకపోవడంతో సైలెంట్ గా ఆరెస్సెస్ లోకి వెళ్లిపోయారు. అయితే మురళీధర్ రావు మాత్రం.. పదవులు వచ్చినా రాకపోయినా  బీజేపీలోనే ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన మల్కాజిగిరి టిక్కెట్ కోసం చాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు మరళీధర్ రావుకు పెద్దగా  బాధ్యతలు లేవు కానీ.. రామ్ మాధవ్ గతంలో కశ్మీర్ వ్యవహారాలను చక్కబెట్టి ఉండటంతో.. ఎన్నికల కోసం ఇంచార్జ్ గా నియమించి ప్రాధాన్య త కల్పిస్తున్నారు. 

తెలుగు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ 

రామ్మాధవ్ గోదావరి జిల్లాలకు చెందిన వారు. మొదటి నుంచి ఆరెస్సెస్ లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. యన కేంద్ర బీజేపీలో కీలకంగా ఉన్న సమయంలో ఏపీ రాజకీయాల్లోనూ ఆయన పాత్ర ప్రముఖంగా ఉండేది. పలు సార్లు వివాదాస్పద కామెంట్లు చేసేవారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు ఆయన సలహాలు ఇచ్చేవారని చెప్పేవారు. కారణం ఏదైనా తర్వాత ఇనాక్టివ్ అయ్యారు. ఇప్పుడు కశ్మీర్ ఎన్నికల్లో ఆయన మంచి ఫలితాలు సాధిస్తే మరోసారి బీజేపీలో కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Bengal Assembly elections 2026: రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
Tamil Nadu Assembly Elections 2026: విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?
విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?
Telangana assembly meetings: అసెంబ్లీలో వార్ వన్ సైడ్ - కేసీఆర్ లేని లోటు - రేవంత్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి!
అసెంబ్లీలో వార్ వన్ సైడ్ - కేసీఆర్ లేని లోటు - రేవంత్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Embed widget