అన్వేషించండి

Ram Madhav : మళ్లీ ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి రామ్‌మాధవ్ - రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతారా ?

BJP : ఆరెస్సెస్ నేత రామ్ మాధవ్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ బాధ్యతలు తీసుకోవడమే దీనికి కారణం.

RSS leader Ram Madhav will be active in BJP politics again :  కశ్మీర్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. విభజన తర్వాత ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున ఇంచార్జులుగా కిషన్ రెడ్డితో పాటు రామ్ మాధవ్ కూడా నియమితులయ్యారు. ఎన్నికల ఇంచార్జుల జాబితాలో రామ్ మాధవ్ పేరు చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. మళ్లీ రామ్ మాధవ్ బీజేపీలో ఎప్పుడు పని చేయడం ప్రారంభించారని చర్చించుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే.. ఆరెస్సెస్ బీజేపీ రాజకీయాల్ని వదిలేసి ఆరెస్సెస్ లోకి వెళ్లిపోయారు. గత ఐదేళ్ల కాలంలో ఆయన ఎక్కడా కనిపించలేదు. మళ్లీ ఇప్పుడే కశ్మీర్ పై దృష్టి సారించారు. 

2014 తర్వాత బీజేపీలో కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ 

2014  ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత మోదీ ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఆరెస్సెస్ నుంచి మురళీధర్ రావుతో పాటు రామ్ మాధవ్ బీజేపీలోకి వచ్చారు. ప్రధాన కార్యదర్శులుగా వారిద్దరికీ పార్టీలో చాలా పవర్ ఉండేది. ముఖ్యంగా రామ్ మాధవ్ కు ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్ బాధ్యతలను బీజేపీ అగ్రనేతలు ఇచ్చారు. ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి నామమాత్రంగా ఉండేది కానీ.. రామ్ మాధవ్ ఇంచార్జ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్ష ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. దాంతో ఆయన పేరు మారుమోగిపోయింది. జమ్మూకశ్మీర్ లోనూ పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కశ్మీర్ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆయనకు బీజేపీ పెద్దలతో దూరం పెరిగిపోయింది.  

2019 ఎన్నికల తర్వాత తిరిగి ఆరెస్సెస్ లోకి !   

బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో ఓ దశలో.. రామ్ మాధవ్ పేరు బీజేపీ అధ్యక్ష పదవికి వినిపించింది. కారణం ఏదైనా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ముందుకు పోలేదు. తర్వాత ఆ పదవి కూడా దక్కకపోవడంతో సైలెంట్ గా ఆరెస్సెస్ లోకి వెళ్లిపోయారు. అయితే మురళీధర్ రావు మాత్రం.. పదవులు వచ్చినా రాకపోయినా  బీజేపీలోనే ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన మల్కాజిగిరి టిక్కెట్ కోసం చాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు మరళీధర్ రావుకు పెద్దగా  బాధ్యతలు లేవు కానీ.. రామ్ మాధవ్ గతంలో కశ్మీర్ వ్యవహారాలను చక్కబెట్టి ఉండటంతో.. ఎన్నికల కోసం ఇంచార్జ్ గా నియమించి ప్రాధాన్య త కల్పిస్తున్నారు. 

తెలుగు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ 

రామ్మాధవ్ గోదావరి జిల్లాలకు చెందిన వారు. మొదటి నుంచి ఆరెస్సెస్ లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. యన కేంద్ర బీజేపీలో కీలకంగా ఉన్న సమయంలో ఏపీ రాజకీయాల్లోనూ ఆయన పాత్ర ప్రముఖంగా ఉండేది. పలు సార్లు వివాదాస్పద కామెంట్లు చేసేవారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు ఆయన సలహాలు ఇచ్చేవారని చెప్పేవారు. కారణం ఏదైనా తర్వాత ఇనాక్టివ్ అయ్యారు. ఇప్పుడు కశ్మీర్ ఎన్నికల్లో ఆయన మంచి ఫలితాలు సాధిస్తే మరోసారి బీజేపీలో కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget