అన్వేషించండి

Munugode Congress : మునుగోడులో పరిస్థితుల్ని చక్కదిద్దుతున్న రేవంత్ - అసంతృప్తులతో వరుస భేటీలు !

మునుగోడులో టిక్కెట్ ఆశించి భంగపడిన వారికి రేవంత్ రెడ్డి సర్ది చెబుతున్నారు. పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచిస్తున్నారు.

Munugode Congress :   మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరరగనున్న ఉపఎన్నికల్లో ఇతర పార్టీల కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ దివంగత నేత, మునుగోడు నుంచి ఐదు సార్లు గెలిచిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే పలువురు నేతుల టిక్కెట్ ఆశించారు. వారందరూ అసంతృప్తికి గురయ్యారు. వారిని బుజ్జగించేందుకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. నిన్నటి వరకూ ప్రధానంగా టిక్కెట్ రేసులో చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. ఆయనను రేవండ్ రెడ్డి పిలిచి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని .. అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలని సూచించారు. దానికి కృష్ణారెడ్డి అంగీకరించారు. 

రేవంత్ రెడ్డితో సమావేశం అయిన చలమల కృష్ణారెడ్డ, పాల్వాయి స్రవంతి

మరోవైపు మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా రేవంత్ ఇంటికి వెళ్లారు. పాల్వాయి స్రవంతి, చెలమల కృష్ణా రెడ్డి ఇద్దరిని కూర్చొబెట్టి పీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడారు. విభేదాలను పరిష్కరించే ప్రయత్నం చేశారు.  నాయకులు అందరూ ఐకమత్యంతో పనిచేసి మునుగోడు బైపోల్ లో కాంగ్రెస్ కు విజయాన్ని సాధించిపెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం శుక్రవారం రోజున సూచించింది. ఈమేరకు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా నిన్న ఓ పోస్ట్ చేశారు. తన పోస్ట్ తో పాటు పాల్వాయి స్రవంతిని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం జారీ చేసిన లేఖను ఆయన ట్యాగ్ చేశారు.  

మునుగోడు కీలక నేతలతో  భేటీ కానున్న సీనియర్ నేతలు

మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో చెల్లమల్ల కృష్ణారెడ్డితో పాటు పల్లె రవి, కైలాష్ నేత కూడా ఉన్నారు. వీరిని బుజ్జగించేందుకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు  ఏఐసీసీ సెక్రటరీ బోసు రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక  సమావేశం జరగనుంది. దీనికి కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మధుయాష్కీ, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరవుతారు. 

ఇంకా మునుగోడు ఉపఎన్నికల విషయంలో యాక్టివ్ కాని కోమటిరెడ్డి 

పార్టీ ఆదేశిస్తే ప్రచారం చేస్తానన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికీపూర్తి స్థాయిలో ముందుకు రావడం లేదు. మునుగోడు ఉపఎన్నికపై జరిగే సమావేశాలకు రావడం లేదు. పైగా అక్కడ సోదరుడి కోసం పని చేయాలని కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కోమటిరెడ్డి ఇష్యూ కూడా మునుగోడు ఉపఎన్నికల్లో కీలకం కానుంది. సోదరుడి ఓటమి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పని చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని..  ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఆయన విషయంలో కాంగ్రెస్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan on YS Avinash Reddy | వివేకా హత్య కేసులో అవినాష్ నిర్దోషి అన్న సీఎం జగన్ | ABP DesamTirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy| తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో ఇంటర్వ్యూSRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget